Bihar Assembly Elections: మగధ్లో మహా ఉత్కంఠ!
బంధువుల మధ్యే చాలాచోట్ల పోటీ
రెబల్స్ ప్రభావమూ అధికమే..

బిహార్లోని మగధ్ ప్రాంతంలో అసెంబ్లీ పోరు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎన్డీఏ, మహాగఠ్బంధన్ల మధ్యలో గట్టి పోటీ నెలకొంది. జన్ సురాజ్ పార్టీ అభ్యర్థులు, రెబల్స్ ఈ రెండు కూటములకు తలనొప్పిగా మారారు. ఈ ప్రాంతంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే కులం మధ్య పోటీ జరుగుతోంది. కొన్ని చోట్ల బంధువులే పోటీపడుతున్నారు. ఇక్కడి 5 జిల్లాల్లోని 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాలా చోట్ల రెండు కూటములూ ఒకే వర్గానికి టికెట్లిచ్చాయి. రాష్ట్రానికి దక్షిణాన ఉన్న మగధ్లో ఔరంగాబాద్, గయా, ఆర్వాల్, జెహానాబాద్, నవడా జిల్లాలున్నాయి.
బేలాగంజ్, బోధ్ గయా, బారాఛత్తీ, వజీర్గంజ్, నవడా, హిసువా, ఔరంగాబాద్లలో ఎన్డీయే, మహాగఠ్బంధన్ కూటములు టికెట్లిచ్చిన అభ్యర్థుల సామాజిక వర్గాలు ఒకటే కావడం విశేషం.
ఎన్డీయేకి సవాలే..
2020 అసెంబ్లీ ఎన్నికల్లో మగధ్ ప్రాంతం ఎన్డీయేకు షాక్ ఇచ్చింది. పక్కనే ఉన్న షాబాద్ మాదిరిగానే ఇక్కడా ఫలితాలు అనుకూలంగా రాలేదు. గత ఎన్నికల్లో మగధ్లోని 26 సీట్లలో కేవలం 6 చోట్లే ఎన్డీయే గెలిచింది. మహాగఠ్బంధన్ 20 చోట్ల విజయం సాధించింది.
జెహానాబాద్, ఔరంగాబాద్, ఆర్వాల్ జిల్లాల్లో ఎన్డీయే ఖాతానే తెరవలేదు. ఇక్కడా కుష్వాహా, ఎస్సీల్లో చీలికతో ఆ కూటమి నష్టపోయింది.
గత ఎన్నికల్లో ఎల్జేపీ ఒంటరిగా పోటీ చేసింది. ఈసారి ఎన్డీయేలోకి తిరిగిరావడంతో ఈ ప్రాంతంలో 6 సీట్లు ఆ పార్టీకి దక్కాయి. మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హెచ్ఏఎం పార్టీకి 5 సీట్లు దక్కాయి. ఎస్సీ వర్గాల వారిని ఆకట్టుకునేందుకు ఆ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు 11 సీట్లను ఎన్డీయే కేటాయించింది. ఈ వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు ఆర్జేడీ పలు చోట్ల అభ్యర్థులను మార్చింది. గత ఎన్నికల్లో ఆ పార్టీ 15 సీట్లను గెలుచుకుంది.
బేలాగంజ్లో..
బేలాగంజ్లో ఈసారి పోటీ మాత్రం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. జెహానాబాద్ ఎంపీ, ఆర్జేడీ అగ్ర నేత సురేంద్ర ప్రసాద్ యాదవ్ అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారు. 2024 నవంబరులో ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు విశ్వనాథ్ యాదవ్ పరాజయం పాలయ్యారు. అదీ బంధువైన మనోరమా దేవి చేతిలో కావడంతో ఆయనకు తల తీసినట్లయింది. ఈసారీ వారి మధ్యే పోటీ నెలకొంది. దీంతో సురేంద్ర ప్రసాద్ యాదవ్ చావోరేవో అన్నట్లుగా కుమారుడి తరఫున ప్రచారం చేస్తున్నారు.
- బేలాగంజ్లో 10 నియోజకవర్గాలుండగా.. జేడీయూ ఒక్కచోటే పోటీ చేస్తోంది.
 - బోధ్ గయాలోనూ ఆర్జేడీ, ఎల్జేపీల మధ్య ఒకే వర్గానికి చెందినవారు పోటీ పడుతున్నారు. అయితే పాశ్వాన్ వర్గానికి చెందినవారే 1972 నుంచి 2020 మధ్య 8 సార్లు విజయం సాధించారు.
 - బారాఛత్తీలోనూ ఒకే వర్గం పోటీపడుతోంది. ఇక్కడ జీతన్ రామ్ మాంఝీ బంధువు జ్యోతి దేవి, మాజీ ఎమ్మెల్యే మనవరాలు తనుశ్రీ మాంఝీ పోటీ చేస్తున్నారు.
 - వజీర్గంజ్లో సీనియర్ కాంగ్రెస్ నేత అవధేశ్ సింగ్తో భాజపాకు చెందిన వీరేంద్ర సింగ్ తలపడుతున్నారు. వీరిద్దరూ ఒకే వర్గానికి చెందినవారు.
 - నవడాలో కుటుంబంలోనే పేరు సాగుతోంది. జేడీయూ నుంచి విభా దేవి, ఆర్జేడీ నుంచి కౌషల్ యాదవ్ తలపడుతున్నారు. వీరిద్దరూ ఎన్నికలకు ముందు అటు ఇటు పార్టీలు మారారు.
 - హిసువాలో భూమిహార్ వర్గానికి చెందిన నీతు కుమారి (కాంగ్రెస్), అనిల్ సింగ్ (భాజపా) పోటీ చేస్తున్నారు.
 - ఔరంగాబాద్లోనూ ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా రాజకీయాలను ప్రభావితం చేస్తున్న భూమిహార్ వర్గం (అగ్ర వర్ణం) నుంచే అభ్యర్థులు పోటీపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఆనంద్ సింగ్, భాజపా నుంచి త్రివిక్రమ్ సింగ్ తలపడుతున్నారు.
 
దడ పుట్టిస్తున్న రెబల్స్
మగధ్ ప్రాంతంలో ఎన్డీయే, మహాగఠ్బంధన్ కూటములకు రెబల్స్ బెడద భారీగానే ఉంది. వారు స్వతంత్రులుగానూ, జన్ సురాజ్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. రెబల్స్ కారణంగా గోవింద్పుర్, గురువా, నబీనగర్లలో త్రిముఖ పోటీ నెలకొంది.
- గోవింద్పుర్లో ఆర్జేడీ రెబల్, సిటింగ్ ఎమ్మెల్యే ఎండీ కమ్రాన్.. అధికారిక అభ్యర్థి పూర్ణిమా యాదవ్కు చెమటలు పట్టిస్తున్నారు. ప్రత్యర్థి, ఎల్జేపీ అభ్యర్థికీ వణుకు పుట్టిస్తున్నారు.
 - గురువాలో జేడీయూ రెబల్ అభ్యర్థి సంజీవ్ శ్యామ్.. ఎన్డీయే అధికారిక అభ్యర్థిని ఇబ్బంది పెడుతున్నారు.
 - నబీనగర్లోనూ జేడీయూ రెబల్ అభ్యర్థితో అధికారిక అభ్యర్థికి తిప్పలు తప్పడం లేదు.
 
నేషనల్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

బిహార్లో గెలుస్తాం.. 18న ప్రమాణం చేస్తాం
బిహార్లో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమని ఇండియా కూటమి తరఫు ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ పునరుద్ఘాటించారు. - 
                                    
                                        

హత్యలు, అపహరణలు, దోపిడీలకు మంత్రిత్వశాఖలు
బిహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఒకవేళ ఇండియా కూటమికి వస్తే.. హత్యలు, అపహరణలు, దోపిడీలకు మూడు మంత్రిత్వ శాఖలను తేజస్వీ యాదవ్ ఏర్పాటు చేస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్షా తీవ్ర ఆరోపణ చేశారు. - 
                                    
                                        

దిల్లీ గాలి కాలుష్యంపై తక్షణమే చర్యలు తీసుకోండి
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. గత రెండు వారాలుగా అక్కడ గాలి నాణ్యత బాగా క్షీణించింది. - 
                                    
                                        

దేశాభివృద్ధికి మహిళల భాగస్వామ్యం అవసరం
మనదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మహిళల భాగస్వామ్యంతో పాటు అందరి సమష్టి కృషి అవసరమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. - 
                                    
                                        

వ్యాపారవేత్తల చేతి రిమోట్ కంట్రోల్గా మోదీ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే ప్రధాని మోదీ భయపడిపోతారని.. ఆయన బడా వ్యాపారవేత్తల చేతి రిమోట్ కంట్రోల్లాంటివారని లోక్సభ విపక్షనేత రాహుల్గాంధీ విమర్శించారు. - 
                                    
                                        

పహల్గాంలో కేబుల్ కార్ పనులకు ఎన్ఐయే సుముఖత
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో కేబుల్ కార్ ప్రాజెక్టు చేపట్టడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐయే) ఇటీవల జమ్మూకశ్మీర్ ప్రభుత్వానికి తెలిపింది. - 
                                    
                                        

కాంగ్రెస్ తలపై తుపాకీ ఎక్కుపెట్టి.. తేజస్విని సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ ప్రకటించింది
బిహార్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య సంబంధాలు సవ్యంగా లేవని ప్రధాని మోదీ పేర్కొన్నారు. - 
                                    
                                        

పెయింట్ ది సిటీతో ధంతరీ సుందరీకరణ
ఈటీవీ భారత్: ఛత్తీస్గఢ్లోని ధంతరీ నగరంలో జిల్లా అధికార యంత్రాంగం, మున్సిపల్ కార్పొరేషను సిబ్బంది ‘పెయింట్ ది సిటీ’ పేరుతో వినూత్న సుందరీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. - 
                                    
                                        

బీసీఏ పట్టభద్రుడి బండి.. తందూరీ సమోసావాలా!
బీసీఏ చదివి ప్రోగ్రామింగులో ప్రత్యేక శిక్షణ పొందిన మనేశ్వర్ చేస్తున్న ఉద్యోగం వదిలి సమోసావాలాగా మారారు. - 
                                    
                                        

మహాత్ముడి బాటలో.. ఊరు ఊరంతా శాకాహారులే
ఝార్ఖండ్లోని లాతెహార్ జిల్లా బార్వాగఢ గ్రామంలో అందరూ శాకాహారులే. వీరిలో ఎక్కువమంది తానా భగత్ సమాజానికి చెందినవారు. - 
                                    
                                        

క్లిష్ట పరిస్థితులు.. మీ పాలిట వరాలు
అడ్డంకులు మీ నిబద్ధతను పరీక్షిస్తాయి. వైఫల్యాలు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి అవసరమైన విలువైన సూచనలు అందిస్తాయి. - 
                                    
                                        

46 నుంచి 38కి తగ్గిన నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య
దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో ఈ ఏడాది ఏప్రిల్ 1నాటికి 46గా ఉన్న నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య 38కి తగ్గినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజా సమీక్షలో పేర్కొంది. - 
                                    
                                        

భళా.. బాహుబలి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన సీఎంఎస్-03 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. బాహుబలి రాకెట్గా పేరొందిన ‘ఎల్వీఎం3-ఎం5’ వాహకనౌక ద్వారా ఇది నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది. - 
                                    
                                        

హిమగిరులకే చెమట పట్టించారు
ఉత్తరాఖండ్ రజతోత్సవాల్లో భాగంగా హిమగిరుల్లో నిర్వహించిన ‘ఆది కైలాశ్ అల్ట్రా మారథాన్’లో 14,000 అడుగుల ఎత్తున, మైనస్ 2 డిగ్రీల ఉష్ణోగ్రత నడుమ అథ్లెట్లు పరుగు తీశారు. - 
                                    
                                        

పశ్చిమ కనుమల్లో జడలబర్రెలు!
హిమాలయ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే జడల బర్రెలు.. కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లోని చల్లని వాతావరణానికీ అలవాటు పడుతున్నాయి. - 
                                    
                                        

80 ఏళ్ల టీచరమ్మ.. నెట్టింట్లో పద్య కవితాసేవ
ఆమె కవయిత్రి కాదు.. రచయిత్రి కూడా కాదు. అయితేనేం 80 ఏళ్ల వయసులో మలయాళ పద్య కవితా వైభవాన్ని భావితరాలకు అందించేందుకు అవిశ్రాంత కృషి చేస్తున్నారు. - 
                                    
                                        

తమిళనాట ‘సర్’ వద్దు.. అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం
తమిళనాట ఓటర్ల జాబితాలో ప్రత్యేక సవరణ పనులు విడనాడాలని ఎన్నికల కమిషన్ను ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ నేతృత్వంలోని అఖిలపక్ష సమావేశం కోరింది. - 
                                    
                                        

పదేపదే ప్రమాదాలు జరుగుతుంటే గుత్తేదారులకు భారీ జరిమానా
జాతీయ రహదారులపై పదే పదే ప్రమాదాలు జరుగుతున్నట్లయితే ఆ ప్రాంతంలో పనులు చేసిన గుత్తేదారులకు భారీ జరిమానాలు విధించాలని ‘కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ’ నిర్ణయించింది. - 
                                    
                                        

రైతులు రుణాలు తిరిగి చెల్లించే అలవాటు చేసుకోవాలి - అజిత్ పవార్
రైతులు ప్రతిసారి మాఫీ కోసం వేచి చూడకుండా, సాధ్యమైతే రుణాలు తిరిగి చెల్లించాలని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ సూచించారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 - 
                        
                            

చేవెళ్ల దుర్ఘటన.. బస్సు డ్రైవర్ తప్పేం లేదు: ఆర్టీసీ ప్రకటన
 - 
                        
                            

తల్లి వర్ధంతి.. 290 మందికి రుణ విముక్తి
 - 
                        
                            

ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు.. భూసేకరణకు ప్రభుత్వం అనుమతి
 - 
                        
                            

జోగి రమేశ్ను కస్టడీకి కోరుతూ ఎక్సైజ్శాఖ పిటిషన్
 - 
                        
                            

ఎస్వీయూలో విద్యార్థినులపై ప్రొఫెసర్ వేధింపులు.. విద్యార్థి సంఘాల ఆందోళన
 


