UP: కల్యాణ వేదికపైనే వధువుకు వరుడి ముద్దు.. ఇరు కుటుంబాల పరస్పర దాడి

వరుడి అత్యుత్సాహంతో కల్యాణ వేదిక రణరంగంగా మారింది. వరమాల క్రతువు పూర్తయిన తర్వాత అందరిముందే వధువును ముద్దు పెట్టుకోవడం వివాదానికి దారితీసింది.

Updated : 24 May 2024 08:01 IST

లఖ్‌నవూ: వరుడి అత్యుత్సాహంతో కల్యాణ వేదిక రణరంగంగా మారింది. వరమాల క్రతువు పూర్తయిన తర్వాత అందరిముందే వధువును ముద్దు పెట్టుకోవడం వివాదానికి దారితీసింది. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెల వివాహాలను హాపూర్‌లోని అశోక్‌నగర్‌లో ఒకేరోజు ఏర్పాటు చేశారు. ఒక కుమార్తె వివాహం పూర్తయిన కాసేపటికి మరొకరిది ప్రారంభించారు. వరమాల వేయడం పూర్తయిన తర్వాత వరుడు, వధువుకు బహిరంగంగా ముద్దు పెట్టాడు. ఇది ఆమె బంధువులకు నచ్చకపోవడంతో స్టేజీ పైకి చేరుకొని వరుడు, అతడి కుటుంబసభ్యులపైన దాడికి దిగారు. అవతలి వారూ ప్రతిదాడికి దిగడంతో కల్యాణ వేదిక కాస్త రణరంగంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని.. గాయపడిన ఏడుగురిని ఆసుపత్రికి తరలించారు. తమ కుమార్తె నిరాకరిస్తున్నా.. అందరిముందు ముద్దు పెట్టుకున్నాడని వధువు కుటుంబీకులు ఆరోపించారు. మరోవైపు ఆమె అంగీకారంతోనే ముద్దు పెట్టుకున్నట్లు వరుడు చెప్పడం గమనార్హం. ఈ ఘటనపై రాత పూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, బహిరంగంగా దాడికి పాల్పడినందుకు ఆరుగురిపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని