New CJI: నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్!
కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేసిన జస్టిస్ బి.ఆర్.గవాయ్
రాష్ట్రపతి ఆమోదం తర్వాత నియామక ఉత్తర్వులు..
వచ్చే నెల 24న బాధ్యతలు చేపట్టే అవకాశం
తొలి హరియాణావాసిగా రికార్డు

న్యాయశాఖకు పంపిన లేఖ ప్రతిని జస్టిస్ సూర్యకాంత్కు అందజేస్తున్న సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్
ఈనాడు, దిల్లీ: భారత సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నియమితులు కానున్నారు. ఆయన పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ సోమవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. రాష్ట్రపతి ఆయన నియామకాన్ని ఆమోదించాక దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా వచ్చే నెల 24వ తేదీన బాధ్యతలు చేపడతారు. 23వ తేదీన ప్రస్తుత సీజేఐ జస్టిస్ గవాయ్ పదవీ విరమణ చేయనున్నారు.ప్రస్తుతం సీనియారిటీలో తన తర్వాతి స్థానంలో ఉన్న జస్టిస్ సూర్యకాంత్ను తదుపరి సీజేఐగా నియమించాలని సిఫార్సు చేస్తూ కేంద్ర న్యాయశాఖకు జస్టిస్ గవాయ్ లేఖ పంపారు. దాని ప్రతిని సోమవారమే జస్టిస్ సూర్యకాంత్కు అందజేశారు. ‘సుప్రీం కోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి పదవికి సీనియర్ జడ్జి అయిన జస్టిస్ సూర్యకాంత్ పేరును సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ సిఫార్సు చేశారు’ అని సుప్రీం కోర్టు విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
14 నెలల పదవీకాలం
నవంబరు 24వ తేదీన సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ సూర్యకాంత్ 2027 ఫిబ్రవరి 9న పదవీ విరమణ చేస్తారు. అంటే ఆయన దాదాపు 14 నెలలపాటు ఆ పదవిలో కొనసాగుతారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హరియాణా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించబోతున్నారు.
చిన్న పట్టణంలో న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ సూర్యకాంత్.. 1962 ఫిబ్రవరి 10న హరియాణా హిస్సార్ జిల్లాలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అక్కడే 1981లో డిగ్రీ పూర్తి చేశారు. 1984లో రోహ్తక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి న్యాయ శాస్త్ర పట్టా పొందారు. అదే సంవత్సరం హిస్సార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా సాధన ప్రారంభించారు. 1985లో పంజాబ్ హరియాణా హైకోర్టుకు మారారు. 2001లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు. 2004 జనవరి 9న పంజాబ్ హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేంత వరకూ హరియాణా అడ్వకేట్ జనరల్గా పని చేశారు. 2018 అక్టోబరు 5న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2019 మే 24వ తేదీన సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
2011లో ఆయన కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయ శాస్త్రంలో పీజీ పూర్తి చేశారు.
కీలక తీర్పుల్లో భాగస్వామి..
రెండు దశాబ్దాలుగా వివిధ ధర్మాసనాల్లో పని చేసిన జస్టిస్ సూర్యకాంత్ పలు కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో ఆయన ఉన్నారు. దీంతోపాటు వాక్స్వాతంత్య్రం, అవినీతి, బిహార్ ఓటర్ల జాబితా, పర్యావరణం, లింగసమానత్వం వంటి అంశాల్లో ఆయన కీలక తీర్పులను వెలువరించారు.
- బ్రిటీష్ కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని నిలిపివేస్తూ ఇచ్చిన తీర్పులో జస్టిస్ సూర్యకాంత్ భాగస్వామి. ఈ చట్టం కింద కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయవద్దని ఈ తీర్పులో ఆదేశించారు.
 - బిహార్లో ప్రత్యేక ముమ్మర సవరణలో (సర్) భాగంగా 65 లక్షల మంది ఓటర్లను తొలగిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై ఆయన ధర్మాసనం తీర్పు చెప్పింది. తీసేసిన వారందరి పేర్లను బహిరంగపరచాలని ఆదేశించింది.
 - సుప్రీంకోర్టుతోపాటు అన్ని కోర్టుల బార్ అసోసియేషన్లలో మూడో వంతు సీట్లను మహిళలకు కేటాయించాలని ఆయన ఆదేశించారు.
 - సైనిక దళాల్లో ఒకే ర్యాంకు.. ఒకే పెన్షన్ విధానాన్ని సమర్థిస్తూ.. అది రాజ్యాంగపరంగా చెల్లుబాటు అవుతుందని జస్టిస్ సూర్యకాంత్ తీర్పు చెప్పారు. శాశ్వత సర్వీసుల్లో మహిళా అధికారులను నియమించే పిటిషన్పైనా వాదనలను ఆయన వింటున్నారు.
 - అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మైనారిటీ హోదాను పునఃసమీక్షించేందుకు మార్గాన్ని సుగమం చేస్తూ తీర్పు ఇచ్చిన ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో ఆయన ఉన్నారు.
 - పెగాసస్పై విచారణ జరిపిన కేసులోనూ జస్టిస్ సూర్యకాంత్ భాగస్వామి.
 - రాష్ట్రపతి, గవర్నర్లు బిల్లుల ఆమోదంపై దాఖలైన పిటిషన్ల విచారణ ధర్మాసనంలో ఆయన ఉన్నారు.
 - ఉత్తరాఖండ్లోని చార్ధామ్ ప్రాజెక్టు పర్యావరణ మదింపు కేసు విచారణలోనూ భాగస్వామిగా ఉన్నారు.
 - దిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు మద్యం కేసులో బెయిలు మంజూరు చేసిన ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు.
 - సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన 300 ధర్మాసనాల్లో సభ్యుడిగా సేవలందించారు.
 
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ఔషధ తయారీకి ఏఐ ఊతం!
ఔషధాల కోసం ప్రపంచ దేశాలు ఏళ్ల తరబడి సమయాన్ని వెచ్చిస్తున్నాయి. ఓ మందు తయారు చేయాలంటే ట్రిలియన్ల సంఖ్యలో ఉన్న మాలిక్యూల్లపై వేట కొనసాగించాల్సి ఉంటుంది. - 
                                    
                                        

రైతుల అప్పు తీర్చిన బాబూభాయ్
గుజరాత్లోని సూరత్కు చెందిన వ్యాపారవేత్త బాబూభాయ్ జిరావాలా (ఛాద్వాడియా).. 290 మంది రైతుల అప్పులను తీర్చారు. దశాబ్దాలుగా అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతున్న వారి కష్టాన్ని చూసి చలించిపోయి ఈ నిర్ణయం తీసుకున్నారు. - 
                                    
                                        

ముళ్ల కంపలో దూకే ఆచారం
మహారాష్ట్రలోని బారామతి ప్రాంతంలో ఉన్న గులంకీ గ్రామంలో భక్తులు నల్ల తుమ్మ చెట్టు ముళ్ల కంపలోకి దూకే ఆచారం వందల ఏళ్లుగా కొనసాగుతోంది. - 
                                    
                                        

బిహార్లో చేసిన వ్యాఖ్యలు ఇక్కడా చేయగలరా?
బిహార్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడుకు వచ్చి అనగలరా అని ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ప్రశ్నించారు. - 
                                    
                                        

ఎస్ఐఆర్పై ఆందోళన అవసరం లేదు
ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ(ఎస్ఐఆర్)పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆ ప్రక్రియ ఊహించిన దాని కన్నా బాగా జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మద్రాసు హైకోర్టుకు తెలిపింది. - 
                                    
                                        

ఆర్జేడీ-కాంగ్రెస్లది ప్రమాదకర కుట్ర
చొరబాటుదారుల్ని ప్రోత్సహించి, సీమాంచల్ ప్రాంతంలో జనాభాపరమైన మార్పుల్ని తీసుకువచ్చేందుకు ఆర్జేడీ-కాంగ్రెస్ ప్రమాదకరమైన కుట్రపన్నుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. - 
                                    
                                        

అమెరికా హైర్ ఆందోళనకరం
అమెరికాలో ప్రతిపాదిత అంతర్జాతీయ ఉపాధి తరలింపు నిలిపివేత(హెచ్ఐఆర్ఈ-హైర్) చట్టం.. హెచ్-1బీ వీసా రుసుం లక్ష డాలర్లకు పెంపు కంటే ఆందోళనకరమని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పేర్కొన్నారు. - 
                                    
                                        

కుటుంబ వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు
భారత ప్రజాస్వామ్యానికి కుటుంబ వారసత్వ రాజకీయాలు తీవ్ర ముప్పుగా మారాయని కాంగ్రెస్ నేత శశి థరూర్ వ్యాఖ్యానించారు. రాజకీయ అధికారాన్ని సామర్థ్యం, నిబద్ధత, క్షేత్రస్థాయి బలం కన్నా.. కుటుంబ వారసత్వాలు నిర్ణయిస్తే పరిపాలన దెబ్బతింటుందని పేర్కొన్నారు. - 
                                    
                                        

రూ.3 వేల కోట్లు కొల్లగొట్టారా..
దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో పెచ్చరిల్లుతున్న డిజిటల్ అరెస్టు కేసులు, సైబర్ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ మోసాలను ఉక్కుపాదంతో అణచివేయాల్సిన అవసరం ఉందని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం పేర్కొంది. - 
                                    
                                        

ఖర్జూర చెట్ల ఆకులతో కళాకృతులు
ఒడిశాలోని పూరీ జిల్లా కాకత్పుర్కు చెందిన 24 ఏళ్ల సత్యజిత్ మహారాణా.. ఖర్జూర చెట్ల ఆకులతో అద్భుత కళాకృతులను తయారు చేస్తున్నారు. - 
                                    
                                        

నక్సల్స్ ఇలాకాలో సినిమా షూటింగ్
ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో ఉన్న అబూజ్మడ్ ఒకప్పుడు తుపాకీ మోతలతో దద్దరిల్లేది. అక్కడి సహజ అందాలు, దట్టమైన అడవులు, చూడచక్కని కొండ ప్రాంతాలు, పచ్చిక బయళ్లు దశాబ్దాలపాటు రక్తమోడాయి. - 
                                    
                                        

పదేళ్లుగా స్వచ్ఛ భారత్
ఒడిశాలోని బలంగీర్కు చెందిన వైద్యుడు మన్మోహన్ బాగ్.. గత పదేళ్లుగా స్వచ్ఛ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తున్నారు. పర్యావరణాన్ని రక్షించడానికి స్వచ్ఛందంగా ఆయన ఈ పని చేస్తున్నారు. - 
                                    
                                        

సంక్లిష్ట పరిశోధనల కేంద్రంగా భారత్
అత్యంత క్లిష్టమైన, అధిక ప్రభావం చూపే పరిశోధనలకు భారత ప్రభుత్వం మద్దతిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మరింత అభివృద్ధి సాధించడానికి, దేశాన్ని సాంకేతిక శక్తి కేంద్రంగా తీర్చిదిద్దటానికి ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. - 
                                    
                                        

ట్రైబునళ్ల సంస్కరణ చట్టంపై విచారణ.. ధర్మాసనాన్ని మార్చాలన్న కేంద్రం
ట్రైబునళ్ల సంస్కరణలు (హేతుబద్దీకరణ, సర్వీసు నిబంధనలు) చట్టం-2021ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ ముగింపునకు వస్తున్న సమయంలో ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. - 
                                    
                                        

జమ్మూలో మళ్లీ రాజధాని
ప్రభుత్వం ఆరు నెలలు శ్రీనగర్లో, మిగతా ఆరు నెలలు జమ్మూలో పనిచేయడమనే ఏళ్లనాటి సంప్రదాయాన్ని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సోమవారం పునరుద్ధరించారు. - 
                                    
                                        

సియాటిల్లోని భారత కాన్సులేట్లో ‘వాల్ ఆఫ్ యూనిటీ’
ఏక్తా దివస్ నేపథ్యంలో అమెరికాలోని సియాటిల్లో గల భారత దౌత్య కార్యాలయ నూతన ప్రాంగణంలో సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ గౌరవార్థం ‘ఐక్యతా గోడ’(వాల్ ఆఫ్ యూనిటీ)ను ఏర్పాటు చేశారు. - 
                                    
                                        

అవమానాల శాఖను ఏర్పాటు చేయండి
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ప్రధానమంత్రి మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశాన్ని, బిహార్ను అవమానించారంటూ ప్రతిపక్ష నేతలందరిపై ప్రధానమంత్రి మోదీ ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. - 
                                    
                                        

ఎన్డీయే మళ్లీ వచ్చినా నీతీశ్ను సీఎంను చేయదు: ఖర్గే
బిహార్లో ఎన్డీయే తిరిగి అధికారంలోకి వచ్చినా.. నీతీశ్కుమార్ను మాత్రం మళ్లీ ముఖ్యమంత్రిని చేయదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. దానికి బదులుగా కాషాయ పార్టీలోని మరొకరికి ఆ పదవి కట్టబెడుతుందన్నారు. - 
                                    
                                        

రైతుల వార్షికాదాయం రూ.60వేల లోపే
దేశంలో దాదాపు 80% మంది రైతుల వార్షిక ఆదాయం రూ.17వేల నుంచి రూ.60 వేలలోపే ఉందని నీతి ఆయోగ్ పేర్కొంది. - 
                                    
                                        

ఐదేళ్లలో మీ జీవితం మారాలంటే..
కొత్తగా కెరియర్ మొదలుపెట్టిన యువత ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఐదేళ్లలో మీ జీవితం మారాలంటే మూడు అంశాలను పాటించాలి. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

రైతులను కలిసే అర్హత జగన్కు లేదు: మంత్రి నిమ్మల
 - 
                        
                            

టికెట్లకు డబ్బుల్లేవు.. మహిళా క్రికెట్ జట్టుకు మొత్తం పారితోషికం ఇచ్చేసిన మందిరా బేడీ
 - 
                        
                            

కలలు కనడం ఎప్పుడూ ఆపొద్దు: హర్మన్ ప్రీత్ కౌర్
 - 
                        
                            

పెట్టుబడుల విషయంలో పూర్తిగా సహకరిస్తాం: సీఎం రేవంత్రెడ్డి
 - 
                        
                            

అదరగొట్టిన ఎస్బీఐ.. లాభం రూ.20,160 కోట్లు
 - 
                        
                            

అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ..జట్టులో ద్రవిడ్ కుమారుడు
 


