Election: అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన కౌంటింగ్‌ ఉదయం 6 గంటలకే ప్రారంభమైంది.

Updated : 02 Jun 2024 07:59 IST

దిల్లీ: అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 6 గంటలకే కౌంటింగ్‌ ప్రారంభమైంది. నేటితో అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీల గడువు ముగియనుంది. దీంతో ముందుగానే ఓట్ల లెక్కింపు చేపట్టారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో మొత్తం 60, సిక్కింలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటన్నింటికీ ఏప్రిల్‌ 19న ఒకే దశలో పోలింగ్‌ జరిగింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని