EC: పోలింగ్ కేంద్రాల వారీగా డేటాను వెల్లడిస్తే గందరగోళమే: సుప్రీంకు ఈసీ అఫిడవిట్
EC affidavit to SC: పోలింగ్ కేంద్రాల వారీగా ఓటింగ్ శాతాల వివరాలను వెబ్సైట్లో ప్రచురించడం వల్ల ఎన్నికల యంత్రాంగం గందరగోళంలో పడుతుందని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది.
దిల్లీ: సార్వత్రిక ఎన్నికల వివిధ దశల్లో నమోదవుతున్న పోలింగ్ శాతాలపై కచ్చితమైన అధికారిక (voter turnout data) సమాచారాన్ని ఎన్నికల సంఘం (Election Commission) సకాలంలో ఇవ్వలేకపోవడంపై విమర్శలొస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court)లోనూ పిటిషన్ దాఖలైంది. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఎన్నికలు జరుగుతున్న సమయంలో పోలింగ్ కేంద్రాల వారీగా డేటాను వెబ్సైట్లో వెల్లడిస్తే అది గందరగోళ పరిస్థితులకు దారితీస్తుందని పేర్కొంది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానానికి అఫిడవిట్ దాఖలు చేసింది.
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) ప్రథమ, ద్వితీయ దశల పోలింగ్ శాతాలను అధికారికంగా వెల్లడించడంలో తీవ్ర జాప్యం జరగడం, ఆ గణాంకాలను సవరించడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే ప్రతి విడతలో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే కేంద్రాలవారీ ఓటింగ్ శాతాలను ఈసీ (EC) వెబ్సైట్లో ప్రచురించేలా చూడాలని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ సుప్రీంకోర్టు (SC)లో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం.. ఈసీకి కీలక ప్రశ్నలు సంధించింది. వీటికి వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
మార్ఫింగ్ ముప్పు..
ఈ క్రమంలోనే ఈసీ (poll panel) బుధవారం కోర్టుకు 225 పేజీల్లో తమ వివరణ సమర్పించింది. ‘‘ప్రతి పోలింగ్ స్టేషన్లో పడిన ఓట్ల సంఖ్యను తెలిపే ‘ఫామ్ 17సీ’ పత్రాన్ని బహిర్గతం చేయాలని నిబంధనల్లో లేదు. ప్రస్తుతం ఈ 17సీ ఒరిజినల్ను స్ట్రాంగ్ రూమ్ల్లో భద్రపరుస్తున్నాం. కేవలం పోలింగ్ ఏజెంట్కు మాత్రమే దాని కాపీని పొందేందుకు అనుమతి ఉంటుంది. అది కూడా వారి సంతకంతో ఇస్తాం. అలా కాకుండా.. పిటిషనర్ కోరినట్లుగా పోలింగ్ కేంద్రాల వారీగా ఓటింగ్ శాతాన్ని బహిరంగంగా ప్రచురిస్తే దాన్ని దుర్వినియోగం చేసే అవకాశముంది. వాటి చిత్రాలను, కౌంటింగ్ ఫలితాలను మార్ఫింగ్ చేసే ప్రమాదం ఉంది. ఈ డేటాను వెబ్సైట్లో అప్లోడ్ చేయడం వల్ల ఎన్నికల యంత్రాంగంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. దీని వల్ల మొత్తం ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అపనమ్మకం ఏర్పడుతుంది’’ అని ఈసీ సమాధానంలో పేర్కొంది. ఈ ఫామ్ 17సీని ఏ సంస్థకు ఇచ్చేందుకు అనుమతులు లేవని స్పష్టం చేసింది.
ఇక తొలి రెండు దశల్లో పోలింగ్ శాతాలపై పిటిషనర్ చేసిన ఆరోపణలను కూడా ఈసీ కొట్టిపారేసింది. అవన్నీ అవాస్తవమని, తప్పుదోవ పట్టించేవని ఆరోపించింది. ‘‘పోలింగ్ డేటాలో హెచ్చుతగ్గులు ఉన్నట్లు వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవి. 2019లోనూ ఇదే తరహా ఆరోపణలతో పిటిషన్లు దాఖలయ్యాయని చెబుతున్నారు. అందుకు ఒక్క ఉదాహరణ కూడా వారు ప్రస్తావించలేదు. కేవలం అనుమానంతో మాత్రమే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని స్పష్టమవుతోంది’’ అని ఈసీ పేర్కొంది.
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న ముగిసినా.. పోలైన ఓట్ల సంఖ్యను 11 రోజుల తరవాత-ఏప్రిల్ 30న ప్రచురించారు. ఏప్రిల్ 26న జరిగిన రెండో దశ పోలింగ్ శాతాన్ని నాలుగు రోజుల తరవాత ప్రచురించారు. పోలింగ్ రోజున ఎన్నికల సంఘం వెల్లడించిన ఓటింగ్ శాతం కన్నా కొంత అధికంగా ఏప్రిల్ 30న గణాంకాలు కనిపించాయి. దీనిపై విమర్శలు రావడంతో.. ఏడీఆర్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ మే 24న జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమాలు జరిగితే ఎన్టీఏను జవాబుదారీ చేస్తాం
పరీక్షల నిర్వహణలో అక్రమాలను తమ ప్రభుత్వం సహించబోదని, ఒక వేళ లోపాలు జరిగినట్లు తేలితే జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని జవాబుదారీ చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. -
బుల్లెట్ రైలులో ఆటోమేటెడ్ వర్షపాత పర్యవేక్షణ వ్యవస్థ
బుల్లెట్ రైలు సేవలను సురక్షితంగా నిర్వహించేందుకు ఆటోమేటెడ్ వర్షపాత పర్యవేక్షణ వ్యవస్థ(రెయిన్ఫాల్ మానిటరింగ్ సిస్టమ్)ను అవలంబిస్తున్నామని శుక్రవారం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. -
శివునికి ఎవరి రక్షణా అవసరం లేదు
యమునా నది వరదకు గురయ్యే తీర భూమిలో గల ప్రాచీన శివాలయాన్ని కూల్చివేయాలంటూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు శుక్రవారం సమర్థించింది. -
త్వరలో కేంద్ర క్యాబినెట్ ముందుకు జమిలి ఎన్నికల కమిటీ నివేదిక
‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సమర్పించిన నివేదిక త్వరలో కేంద్ర క్యాబినెట్ ముందుకు రానుంది. -
భాజపాతో ఆరెస్సెస్కు విభేదాల్లేవు.. సంఘ్ వర్గాల వెల్లడి
భాజపాతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)కు ఎటువంటి విభేదాల్లేవని సంబంధిత వర్గాలు శుక్రవారం స్పష్టం చేశాయి. 2014, 2019 లోక్సభ ఎన్నికల తరవాత ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ చేసిన ప్రసంగానికి తాజాగా ఆయన మాట్లాడిన మాటలకు పెద్దగా తేడా ఏమీ లేదని పేర్కొన్నాయి. -
అమెరికాలో వర్క్ పర్మిట్దారుల పిల్లలను ఆదుకోండి
అమెరికాకు వర్క్పర్మిట్పై వచ్చిన దంపతుల పిల్లల(డ్రీమర్ల)కు 21 ఏళ్లు నిండగానే వారివారి దేశాలకు తిప్పిపంపేయకుండా తక్షణం రక్షణ కల్పించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు 43 మంది శాసనకర్తలు విజ్ఞప్తి చేశారు. -
యడియూరప్పకు కోర్టులో ఊరట
మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఓ బాలికను లైంగికంగా వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను అరెస్టు చేయవద్దని సదాశివనగర పోలీసులను ఆ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. -
నీట్పై సీబీఐతో దర్యాప్తు చేయించాలి
ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్-యూజీ(2024) పరీక్షలో అక్రమాలు జరిగాయని, వీటిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
కేంద్ర మంత్రి సోమణ్ణ కుమారుడిపై కేసు
రైల్వేశాఖ సహాయ మంత్రి వి.సోమణ్ణ కుమారుడు అరుణ్, ఆయన సహచరుడు ప్రమోద్రావుపై బెంగళూరు సంజయనగర ఠాణాలో కేసు నమోదు చేసినట్లు సంబంధిత అధికారులు శుక్రవారం వెల్లడించారు. -
బహుముఖాలను గుర్తించే ఏఐ టూల్
ఒకేసారి అత్యంత కచ్చితత్వంతో బహుముఖాలను గుర్తించగలిగేలా ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టూల్ని ఒక స్టార్టప్ సంస్థ అభివృద్ధి చేసింది. శివానీ వర్మ అనే మహిళ నేతృత్వంలోని ఈ స్టార్టప్ తీసుకొచ్చిన టూల్ను ‘దివ్య దృష్టి’ పేరుతో పిలుస్తున్నారు. -
అందర్నీ చంపేయాలనే కసి వారిలో కనిపించింది
యాత్రికుల బస్సు లోయలో పడినా, ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూనే ఉన్నారని జమ్మూ కశ్మీర్లో చోటుచేసుకున్న ఘటనలో గాయపడిన ఓ బాధితురాలు వాపోయారు. -
చాంద్నీ చౌక్లో భారీ అగ్నిప్రమాదం
ఉత్తర దిల్లీలోని చాంద్నీ చౌక్ ప్రాంతంలో గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 50కిపైగా దుకాణాలు దగ్ధమయ్యాయి. -
షీనాబోరా అస్థికలు మాయం
ఇరవై నాలుగేళ్ల షీనా బోరా హత్య కేసులో మరో ట్విస్టు చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక సాక్ష్యంగా ఉన్న మృతురాలి అస్థికలు మాయమైనట్లు దర్యాప్తు అధికారులు సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. -
ఆర్మీ అమ్ములపొదిలో ‘నాగాస్త్ర-1’
భారత సైన్యం అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రం చేరింది. మహారాష్ట్ర నాగ్పుర్లోని సోలార్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసిన ‘నాగాస్త్ర-1’ సైన్యం చేతికి వచ్చింది. -
తేనెటీగల దాడి.. పీపీఈ కిట్లుధరించి దహన సంస్కారాలు
తేనెటీగలు దాడి చేయడంతో పీపీఈ కిట్లు ధరించి దహన సంస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన పరిస్థితి ఎదురైంది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. -
ఝార్ఖండ్లో రూ.2 లక్షల వరకూ రైతు రుణాల మాఫీ
రైతులకు గల రూ.రెండు లక్షల లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని ఝార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయమంత్రి బాదల్ పత్రలేఖ శుక్రవారం వెల్లడించారు. -
పత్రికాస్వేచ్ఛను అడ్డుకొనే చట్టాలు ఉపసంహరించుకోండి
పత్రికాస్వేచ్ఛను అడ్డుకోవడమే లక్ష్యంగా ఉన్న చట్టాలను ఉపసంహరించుకోవాలని పలు జర్నలిస్టు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. -
నీట్ పరీక్షలో అక్రమాలు.. గుజరాత్లో ఐదుగురి అరెస్టు
నీట్-యూజీ పరీక్షలో అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నించిన ఐదుగురు వ్యక్తులను శుక్రవారం గుజరాత్లోని పంచ్ మహల్ జిల్లాలోని గోధ్రా పోలీసులు అరెస్టు చేశారు. -
కువైట్ అగ్నిప్రమాదం.. భారత్కు చేరిన 45 మృతదేహాలు
కువైట్లోని అల్ మంగాఫ్లో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 45 మంది భారతీయుల మృతదేహాలు శుక్రవారం ఉదయం భారత్కు చేరుకున్నాయి. -
సంక్షిప్త వార్తలు (11 )
ఒడిశా సీఎంగా ఎన్నికైన భాజపా నేత మోహన్ చరణ మాఝి మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇంటికి స్వయంగా వెళ్లి తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించడం, ఆయన ఆశీర్వాదాలు తీసుకోవడంతో పాటు సలహాలు, సూచనల కోసం అభ్యర్థించడం ఆహ్వానించదగ్గ పరిణామం. -
ఉప ఎన్నిక బరిలో ‘దర్శన్’ను దించాలనుకున్న డీకే బ్రదర్స్?
చన్నపట్న అసెంబ్లీ ఉప ఎన్నికలో దర్శన్ను పోటీ చేయించేందుకు డీకే సోదరులు ప్రణాళిక వేశారని భాజపా వ్యాఖ్యానించింది.