EC: పోలింగ్ కేంద్రాల వారీగా డేటాను వెల్లడిస్తే గందరగోళమే: సుప్రీంకు ఈసీ అఫిడవిట్
EC affidavit to SC: పోలింగ్ కేంద్రాల వారీగా ఓటింగ్ శాతాల వివరాలను వెబ్సైట్లో ప్రచురించడం వల్ల ఎన్నికల యంత్రాంగం గందరగోళంలో పడుతుందని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది.
దిల్లీ: సార్వత్రిక ఎన్నికల వివిధ దశల్లో నమోదవుతున్న పోలింగ్ శాతాలపై కచ్చితమైన అధికారిక (voter turnout data) సమాచారాన్ని ఎన్నికల సంఘం (Election Commission) సకాలంలో ఇవ్వలేకపోవడంపై విమర్శలొస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court)లోనూ పిటిషన్ దాఖలైంది. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఎన్నికలు జరుగుతున్న సమయంలో పోలింగ్ కేంద్రాల వారీగా డేటాను వెబ్సైట్లో వెల్లడిస్తే అది గందరగోళ పరిస్థితులకు దారితీస్తుందని పేర్కొంది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానానికి అఫిడవిట్ దాఖలు చేసింది.
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) ప్రథమ, ద్వితీయ దశల పోలింగ్ శాతాలను అధికారికంగా వెల్లడించడంలో తీవ్ర జాప్యం జరగడం, ఆ గణాంకాలను సవరించడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే ప్రతి విడతలో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే కేంద్రాలవారీ ఓటింగ్ శాతాలను ఈసీ (EC) వెబ్సైట్లో ప్రచురించేలా చూడాలని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ సుప్రీంకోర్టు (SC)లో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం.. ఈసీకి కీలక ప్రశ్నలు సంధించింది. వీటికి వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
మార్ఫింగ్ ముప్పు..
ఈ క్రమంలోనే ఈసీ (poll panel) బుధవారం కోర్టుకు 225 పేజీల్లో తమ వివరణ సమర్పించింది. ‘‘ప్రతి పోలింగ్ స్టేషన్లో పడిన ఓట్ల సంఖ్యను తెలిపే ‘ఫామ్ 17సీ’ పత్రాన్ని బహిర్గతం చేయాలని నిబంధనల్లో లేదు. ప్రస్తుతం ఈ 17సీ ఒరిజినల్ను స్ట్రాంగ్ రూమ్ల్లో భద్రపరుస్తున్నాం. కేవలం పోలింగ్ ఏజెంట్కు మాత్రమే దాని కాపీని పొందేందుకు అనుమతి ఉంటుంది. అది కూడా వారి సంతకంతో ఇస్తాం. అలా కాకుండా.. పిటిషనర్ కోరినట్లుగా పోలింగ్ కేంద్రాల వారీగా ఓటింగ్ శాతాన్ని బహిరంగంగా ప్రచురిస్తే దాన్ని దుర్వినియోగం చేసే అవకాశముంది. వాటి చిత్రాలను, కౌంటింగ్ ఫలితాలను మార్ఫింగ్ చేసే ప్రమాదం ఉంది. ఈ డేటాను వెబ్సైట్లో అప్లోడ్ చేయడం వల్ల ఎన్నికల యంత్రాంగంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. దీని వల్ల మొత్తం ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అపనమ్మకం ఏర్పడుతుంది’’ అని ఈసీ సమాధానంలో పేర్కొంది. ఈ ఫామ్ 17సీని ఏ సంస్థకు ఇచ్చేందుకు అనుమతులు లేవని స్పష్టం చేసింది.
ఇక తొలి రెండు దశల్లో పోలింగ్ శాతాలపై పిటిషనర్ చేసిన ఆరోపణలను కూడా ఈసీ కొట్టిపారేసింది. అవన్నీ అవాస్తవమని, తప్పుదోవ పట్టించేవని ఆరోపించింది. ‘‘పోలింగ్ డేటాలో హెచ్చుతగ్గులు ఉన్నట్లు వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవి. 2019లోనూ ఇదే తరహా ఆరోపణలతో పిటిషన్లు దాఖలయ్యాయని చెబుతున్నారు. అందుకు ఒక్క ఉదాహరణ కూడా వారు ప్రస్తావించలేదు. కేవలం అనుమానంతో మాత్రమే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని స్పష్టమవుతోంది’’ అని ఈసీ పేర్కొంది.
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న ముగిసినా.. పోలైన ఓట్ల సంఖ్యను 11 రోజుల తరవాత-ఏప్రిల్ 30న ప్రచురించారు. ఏప్రిల్ 26న జరిగిన రెండో దశ పోలింగ్ శాతాన్ని నాలుగు రోజుల తరవాత ప్రచురించారు. పోలింగ్ రోజున ఎన్నికల సంఘం వెల్లడించిన ఓటింగ్ శాతం కన్నా కొంత అధికంగా ఏప్రిల్ 30న గణాంకాలు కనిపించాయి. దీనిపై విమర్శలు రావడంతో.. ఏడీఆర్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ మే 24న జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
అగ్నిపథ్ పథకం దేశ సైన్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకువచ్చిన సంస్కరణ అని మోదీ(PM Modi) తెలిపారు. -
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని హెచ్చరించారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. -
92 వేల అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. -
నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్
కార్గిల్ 25వ విజయ్ దివస్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులర్పించనున్నారు. -
గూగుల్ మ్యాప్స్లో సరికొత్త ఫీచర్లు
భారతీయ వినియోగదారులను మరింతగా ఆకర్షించేలా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ మ్యాప్స్ ప్రకటించింది. -
ఇద్దరు ఝార్ఖండ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఝార్ఖండ్ శాసనసభ స్పీకర్ ట్రైబ్యునల్ గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు (7)
తిహాడ్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడంపై ‘ఇండియా’ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. -
మహారాష్ట్ర, హిమాచల్లలో కుంభవృష్టి
హిమాచల్, మహారాష్ట్రల్లో కుండపోత వర్షాలు కురిసి జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ముంబయిలో 9 గంటల వ్యవధిలో 100 మి.మీ. పైగా వాన దంచికొట్టింది. -
ముమ్మాటికీ వివక్షేనన్న విపక్షం
కేంద్ర బడ్జెట్లో ఒకటిరెండు రాష్ట్రాలకు తప్పిస్తే మిగిలినవాటికి అన్యాయం జరిగిందని విపక్ష సభ్యులు మరోసారి గట్టిగా గళం వినిపించడంతో గురువారం పార్లమెంటు ఉభయసభలు దాదాపు స్తంభించిపోయాయి. -
ట్రంకు పెట్టెల బదులు ట్రాలీ బ్యాగులు
లోకోపైలట్లు, గార్డులు ఇకపై తమ వ్యక్తిగత వస్తువుల్ని, విధి నిర్వహణకు అవసరమైన సామగ్రిని ఇనుప ట్రంకు పెట్టెల్లో కాకుండా ట్రాలీ బ్యాగుల్లో తీసుకువెళ్లాల్సి ఉంటుంది. -
ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0
జమ్ముకశ్మీర్లో ఉగ్ర చర్యలకు పాల్పడుతున్న 55 మంది ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0’ను ప్రారంభించింది. -
భారీ వర్షాలు.. ముంబయిలో రెడ్ అలర్ట్
మహారాష్ట్రలోని ముంబయిలోనూ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్