Fire Accident: ఎయిరిండియా బస్సులో అగ్నిప్రమాదం

Eenadu icon
By National News Desk Published : 29 Oct 2025 06:15 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ విమానాశ్రయంలో ఘటన

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియాకు చెందిన ఓ బస్సు దగ్ధమైంది. మంగళవారం మధ్యాహ్నం ఎయిర్‌పోర్టులోని మూడో టెర్మినల్‌ వద్ద ఆగి ఉన్న బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ట్యాక్సీయింగ్‌ ఏరియాలో నిలిపి ఉంచిన విమానానికి అత్యంత సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని