the elephant whisperers: ఆస్కార్‌ లఘుచిత్ర దర్శకురాలికి రూ.కోటి నజరానా

ఆస్కార్‌ పురస్కారం పొందిన లఘుచిత్రం ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ దర్శకురాలు కార్తికి గొంజాల్వెస్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ రూ.కోటి నజరానా అందించారు.

Updated : 22 Mar 2023 07:04 IST

చెన్నై, న్యూస్‌టుడే: ఆస్కార్‌ పురస్కారం పొందిన లఘుచిత్రం ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ దర్శకురాలు కార్తికి గొంజాల్వెస్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ రూ.కోటి నజరానా అందించారు. ముదుమలై రిజర్వ్‌ ఫారెస్ట్‌లో మావటిగా పనిచేస్తున్న బెల్లి, బొమ్మన్‌ దంపతుల జీవనం ఆధారంగా తెరకెక్కిన ఈ లఘు చిత్రానికి ఆస్కార్‌ పురస్కారం లభించిన విషయం తెలిసిందే. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో తనను కలిసిన దర్శకురాలికి స్టాలిన్‌ చెక్‌ అందించి శాలువాతో సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని