Usha Gokani: మహాత్మాగాంధీ మనవరాలి కన్నుమూత

మహాత్మా గాంధీ మనవరాలు ఉషా గోకనీ మంగళవారం ముంబయిలో కన్నుమూశారు. ఆమె వయసు 89 ఏళ్లు. గత ఐదేళ్లుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు.

Updated : 22 Mar 2023 07:25 IST

ముంబయిలో తుదిశ్వాస విడిచిన ఉషా గోకనీ

ముంబయి: మహాత్మా గాంధీ మనవరాలు ఉషా గోకనీ మంగళవారం ముంబయిలో కన్నుమూశారు. ఆమె వయసు 89 ఏళ్లు. గత ఐదేళ్లుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండేళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. ముంబయిలోని గాంధీ స్మారక నిధికి గతంలో ఆమె ఛైర్‌ పర్సన్‌గా పని చేశారు. గాంధీ స్థాపించిన వార్ధా సేవాగ్రామ్‌ ఆశ్రమంలో గోకనీ బాల్యం గడిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని