Gurpatwant Singh Pannu: జెండాకో ఐఫోన్ ఎర.. చైనాకు మద్దతు ప్రకటన!
గురుపత్వంత్ సింగ్ పన్నూ.. కొద్దిరోజులుగా విదేశాల్లోని భారతీయ ఎంబసీల్లో పదేపదే వినిపిస్తున్న పేరు. ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్లలో భారత్కు తలనొప్పిగా మారిన పేరు!
ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నూ వ్యూహాలు
భారత ఎంబసీలపై దాడులు
గురుపత్వంత్ సింగ్ పన్నూ.. కొద్దిరోజులుగా విదేశాల్లోని భారతీయ ఎంబసీల్లో పదేపదే వినిపిస్తున్న పేరు. ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్లలో భారత్కు తలనొప్పిగా మారిన పేరు! కెనడా ప్రభుత్వానికి భారత్ హెచ్చరిక జారీ చేసే పరిస్థితి తలెత్తటానికి కారణమైన పేరు! అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో చనిపోయాడంటూ తొలుత.. బతికే ఉన్నాడంటూ తర్వాత.. వార్తలు రావటంతో పన్నూ పేరు తాజాగా మరోమారు తెరపైకి వచ్చింది. ఇంతకూ ఎవరీ పన్నూ? ఏంటీ కథ?
పంజాబ్లోని అమృత్సర్ జిల్లా ఖాంకోట్ గ్రామం.. గురుపత్వంత్ సింగ్ పన్నూ స్వస్థలం! ఆయన తండ్రి మహేందర్సింగ్ పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. వీరి కుటుంబం దేశ విభజన సమయంలో పాకిస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చింది. పన్నూ గురించి గ్రామంలో పెద్దగా తెలియకున్నా.. వీరిది సంపన్న కుటుంబం. వ్యవసాయ భూములు, పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. ముగ్గురు సంతానంలో ఒకరైన పన్నూ పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ సంపాదించి తర్వాత అమెరికా వెళ్లాడు. ఆ దేశ పౌరసత్వం తీసుకొని అమెరికా, కెనడాల్లో న్యాయవృత్తిలో అడుగుపెట్టాడు.
ఎస్ఎఫ్జే పేరిట..
2007లో అమెరికా వేదికగా సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) పేరుతో ఓ సంస్థను ఇతరులతో కలిసి పన్నూ స్థాపించాడు. మానవ హక్కుల కోసం ఏర్పాటుచేసిన సంస్థగా దాన్ని చెబుతూనే.. భారత్లోని పంజాబ్ను సిక్కుల స్వయంప్రతిపత్తి ప్రాంతంగా (ఖలిస్థాన్) ఏర్పాటుచేయటం తమ ఉద్దేశంగా పేర్కొన్నాడు. అప్పటి నుంచి విదేశాల్లో భారత వ్యతిరేక ప్రదర్శనలు, ర్యాలీలు, నినాదాలు, సభలు, సమావేశాలకు కేంద్ర బిందువవుతూ వస్తున్నాడు. కెనడా, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాల్లో భారత్కు వ్యతిరేకంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద, రెచ్చగొట్టే పోస్టులు పెడుతూ.. ప్రభుత్వ కార్యాలయాలు, అసెంబ్లీలాంటి ప్రముఖ భవనాలపై తరచూ ఖలిస్థాన్ జెండా ఎగురవేస్తూ ఎస్ఎఫ్జే అందరి దృష్టిలో పడే ప్రయత్నం చేస్తుంటుంది. ఖలిస్థాన్ జెండా ఎగురవేసేవారికి ఐ-ఫోన్లు, ఇతరత్రా బహుమతులిస్తామని ప్రకటించటం ద్వారా పన్నూ యువతరాన్ని ఆకర్షిస్తుంటాడు. న్యాయపరంగా ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో.. 2014లో నరేంద్ర మోదీ, మన్మోహన్సింగ్, సోనియాగాంధీ, సుఖ్బీర్సింగ్ బాదల్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్సింగ్లపై అమెరికా, కెనడాల్లో కేసులు కూడా దాఖలు చేశాడు. ఈ కేసుల కారణంగానే అమరీందర్సింగ్ 2016లో అమెరికా యాత్రను కూడా రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
చైనా అధ్యక్షుడికి సందేశం
గల్వాన్ సరిహద్దుల్లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ తర్వాత పన్నూ చర్య సిక్కు మతస్థుల్లోనూ చాలామందిలో ఆగ్రహం కల్గించింది. ‘‘చైనా పట్ల సహానుభూతి ప్రకటిస్తున్నా. గల్వాన్లో చైనా సైనికుల పట్ల భారత దళాలు జరిపిన క్రూరమైన దాడిని ఖండిస్తున్నాం’’ అంటూ చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్కు పన్నూ సందేశం పంపించాడు.
కెనడాకు భారత్ నిరసన
ఈ మధ్యకాలంలో ఎస్ఎఫ్జే కీలక నేతలు ముగ్గురు అనూహ్య పరిస్థితుల్లో అమెరికా, కెనడాల్లో మరణించటంతో ఆ సంస్థ ఆగ్రహంతో ఉడుకుతోంది. ఫలితంగా... ఆ రెండు దేశాల్లో భారత కాన్సులేట్లపై దాడులు, హెచ్చరికలు తీవ్రమయ్యాయి. కొద్దిరోజుల కిందటే శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్కు ఎస్ఎఫ్జే మద్దతుదారులు నిప్పుపెట్టారు. కెనడాలో భారత ఎంబసీ సిబ్బందిని పదేపదే భయపెడుతున్నారు. జులై 8న కెనడాలో భారత త్రివర్ణ పతాకాన్ని కాల్చటానికి పిలుపునిచ్చారు. తాజాగా.. వచ్చే నెల 15న భారత రాయబార కార్యాలయాలను స్వాధీనం చేసుకుంటామంటూ ఎస్ఎఫ్జే హెచ్చరించింది. తమ దేశంలో సిక్కులు భారీ సంఖ్యలో ఉండటంతో ఓటుబ్యాంకు రాజకీయాలపై దృష్టిపెట్టిన కెనడా ప్రభుత్వం ఖలిస్థానీవాదుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. వీటిని తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం కెనడా ప్రభుత్వానికి హెచ్చరికలాంటి నిరసన తెలియజేసింది.
ఎస్ఎఫ్జే నిర్వాకాలు కొన్ని...
- కొద్దిరోజుల కిందట.. మొహాలీలోని పోలీసు ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై గ్రెనేడ్ దాడి
- జలంధర్లోని బియాంత్సింగ్ విగ్రహంపై ఖలిస్థాన్ అనుకూల నినాదాలు
- భారత్కు రప్పించకుండా ఉండేలా విదేశాల్లోని పలువురు ఖలిస్థాన్ ఉగ్రవాదులకు న్యాయ సాయం
అమెరికా పౌరసత్వంతో..
ఎస్ఎఫ్జే కార్యకలాపాలు హద్దులు మీరుతుండటంతో భారత ప్రభుత్వం 2019లో ఈ సంస్థను నిషేధించింది. మరుసటి ఏడాది పన్నూను ఉగ్రవాదిగా ప్రకటించింది. దీంతో రిఫరెండమ్-2020 పేరుతో ఖలిస్థాన్కు మద్దతు కూడగట్టే ప్రయత్నాలను అతడు ముమ్మరం చేశాడు. వీటికి పాకిస్థాన్ మద్దతిచ్చింది. 2020 అక్టోబరులో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతికి కొద్దిరోజుల ముందు ఖలిస్థాన్ నినాదాలు చేస్తూ, జెండాలు ఎగరేయాల్సిందిగా సిక్కు విద్యార్థులకు పిలుపునిచ్చిన పన్నూ.. అందుకు ప్రతిఫలంగా వారికి ఐఫోన్-12 బహుమతిగా ఇస్తానంటూ ఎర వేశాడు. ఇలా యువతరాన్ని ఖలిస్థాన్ వాదంవైపు ఆకర్షించేలా వారికి డబ్బులు, బహుమతులు ఇవ్వటం పన్నూ ఎత్తుగడల్లో భాగం. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ వద్ద కూడా ఖలిస్థాన్ పోస్టర్లు ఇలాగే వెలిశాయని సమాచారం.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
పెండింగ్ బిల్లుల విషయంలో కేరళ, బెంగాల్ గవర్నర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
అగ్నిపథ్ పథకం దేశ సైన్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకువచ్చిన సంస్కరణ అని మోదీ(PM Modi) తెలిపారు. -
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని హెచ్చరించారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. -
92 వేల అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. -
నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్
కార్గిల్ 25వ విజయ్ దివస్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులర్పించనున్నారు. -
గూగుల్ మ్యాప్స్లో సరికొత్త ఫీచర్లు
భారతీయ వినియోగదారులను మరింతగా ఆకర్షించేలా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ మ్యాప్స్ ప్రకటించింది. -
ఇద్దరు ఝార్ఖండ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఝార్ఖండ్ శాసనసభ స్పీకర్ ట్రైబ్యునల్ గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు (7)
తిహాడ్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడంపై ‘ఇండియా’ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. -
మహారాష్ట్ర, హిమాచల్లలో కుంభవృష్టి
హిమాచల్, మహారాష్ట్రల్లో కుండపోత వర్షాలు కురిసి జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ముంబయిలో 9 గంటల వ్యవధిలో 100 మి.మీ. పైగా వాన దంచికొట్టింది. -
ముమ్మాటికీ వివక్షేనన్న విపక్షం
కేంద్ర బడ్జెట్లో ఒకటిరెండు రాష్ట్రాలకు తప్పిస్తే మిగిలినవాటికి అన్యాయం జరిగిందని విపక్ష సభ్యులు మరోసారి గట్టిగా గళం వినిపించడంతో గురువారం పార్లమెంటు ఉభయసభలు దాదాపు స్తంభించిపోయాయి. -
ట్రంకు పెట్టెల బదులు ట్రాలీ బ్యాగులు
లోకోపైలట్లు, గార్డులు ఇకపై తమ వ్యక్తిగత వస్తువుల్ని, విధి నిర్వహణకు అవసరమైన సామగ్రిని ఇనుప ట్రంకు పెట్టెల్లో కాకుండా ట్రాలీ బ్యాగుల్లో తీసుకువెళ్లాల్సి ఉంటుంది. -
ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0
జమ్ముకశ్మీర్లో ఉగ్ర చర్యలకు పాల్పడుతున్న 55 మంది ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0’ను ప్రారంభించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు