వదంతులు.. అసత్యవార్తల ఆజ్యం
మణిపుర్లో అల్లర్లు జరిగి 160 మంది చనిపోవడానికి అధిక శాతం వదంతులు, అసత్య వార్తలే (ఫేక్ న్యూసే)కారణమని అధికారులు అంటున్నారు.
మణిపుర్ అల్లర్లపై ప్రభుత్వం వెల్లడి
ఇంఫాల్: మణిపుర్లో అల్లర్లు జరిగి 160 మంది చనిపోవడానికి అధిక శాతం వదంతులు, అసత్య వార్తలే (ఫేక్ న్యూసే)కారణమని అధికారులు అంటున్నారు. వివిధ భద్రతా బలగాల అంచనాల ఆధారంగా ఈ విషయం వెల్లడైందని చెబుతున్నారు. ‘చురాచాంద్పుర్లో గిరిజనులు ఒకరిని చంపి పాలిథీన్ కవరులో చుట్టి పడేశారంటూ ఓ చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. దీంతో ప్రత్యర్థులు మే 4వ తేదీన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన చోటుచేసుకుంది. వాస్తవానికి అది ఫేక్ చిత్రం. అది దేశ రాజధాని దిల్లీలో జరిగిన సంఘటనకు సంబంధించినది. ఒక ఫేక్ చిత్రం అమానవీయ ఘటనకు కారణమైంది’ అని అధికారులు పేర్కొన్నారు. అదే రోజు మరో ఇద్దరు మహిళలు అత్యాచారానికి గురయ్యారని, హత్యకు గురయ్యారని వివరించారు. ఇలాంటి ఫేక్ ప్రచారాలను అడ్డుకోవడానికే మణిపుర్లో ప్రభుత్వం ఇంటర్నెట్ను నిలిపేసిందని తెలిపారు. ‘చందేల్ జిల్లాలోని ఖ్వాతా గ్రామంలో మెజారిటీ వర్గంపై గిరిజనులు ఆయుధాలతో వచ్చి దాడికి ప్రయత్నించబోతున్నారని ఒక ప్రముఖ దిన పత్రిక వార్తను ప్రచురించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. చివరకు అది ఫేక్ న్యూస్ అని తేలింది’ అని అధికారులు వివరించారు. దీంతో నిర్ధారణ చేసుకోకుండా ఎటువంటి రెచ్చగొట్టే వార్తలను ప్రచరించకూడదని స్థానిక మీడియాకు పోలీసులు సూచనలు చేశారని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారమైన కొన్ని ఫేక్ న్యూస్ ఉదాహరణలను అధికారులు వెల్లడించారు.
* చురాచాంద్పుర్లో గిరిజన యువకులు ఆయుధాలతో కవాతు చేశారని, మహిళలు, పిల్లలను ఎత్తుకెళ్లారని ఒక వీడియో ప్రచారంలోకి వచ్చింది. అది మిజో భాషలో ఉంటే కొన్ని అసాంఘిక శక్తులు అందులో సబ్ టైటిల్స్తో ప్రచారంలోకి తెచ్చారు. ఘర్షణలకు కారణమయ్యారు. వాస్తవానికి అది ప్రత్యేక పాలనా వ్యవస్థ డిమాండులో జరిపిన ర్యాలీ.
* కొంబా మారులో కొందరు గిరిజనులు ప్రార్థనా స్థలాన్ని కూల్చివేశారని ఫేక్ న్యూస్ను ప్రచారంలోకి తెచ్చారు. దీంతో భద్రతా సిబ్బంది మెజారిటీ వర్గాన్ని తీసుకెళ్లి ప్రార్థనా స్థలానికి ఎటువంటి నష్టం జరగలేదని చూపించాల్సి వచ్చింది. ఈలోగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగి ఇద్దరు గిరిజనులు గాయపడ్డారు.
* మెజారిటీ వర్గానికి చెందిన మృత దేహాలు పడి ఉండగా గిరిజనులు తొక్కుతున్నట్లుగా మరో వీడియో ప్రచారంలోకి వచ్చింది. వాస్తవానికి అది గిరిజన గ్రామాన్ని తగులబెట్టేందుకు వెళ్లిన సందర్భంగా జరిగిన ఘర్షణల్లో మృతి చెందిన మెజారిటీ వర్గీయులది.
* మొదట్లో గిరిజన మహిళపై దాడి చేసి కాల్చి చంపారని ఓ వీడియో ప్రచారంలోకి వచ్చింది. అయితే అది మయన్మార్లో జరిగిన ఘటనకు సంబంధించింది.
* తమ వర్గానికి చెందిన మహిళను గిరిజనులు హింసించారని ఆరోపిస్తూ మెజారిటీ వర్గ మహిళలు దిల్లీలో ఆందోళన నిర్వహించారు. ఆ సందర్భంగా వారు చూపించిన చిత్రం వాస్తవానికి అరుణాచల్ ప్రదేశ్కు చెందినది. అదీ గృహ హింసకు సంబంధించింది.
పౌర సంఘాలపై దేశద్రోహం కేసు
మణిపుర్ సమగ్రత పరిరక్షణ సమన్వయ కమిటీ అధ్యక్షుడు జితేంద్ర నింగోంబాపై దేశద్రోహం, పరువు నష్టం కేసులు దాఖలయ్యాయి. ఈ నెల 10వ తేదీన ఆయనపై అస్సాం రైఫిల్స్ ఈ కేసు నమోదు చేసినట్లు అధికార వర్గాలు ఆదివారం వెల్లడించాయి. చురాచాంద్పుర్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. వివిధ వర్గాల మధ్య మతం, జాతి, ప్రాంతం, పుట్టుక, ఆవాసం, భాష ఆధారంగా కొకొమి చిచ్చు పెడుతోందని ఎఫ్ఐఆర్లో అస్సాం రైఫిల్స్ పేర్కొంది.
రాజస్థాన్తో పోలుస్తారా?: చిదంబరం
దిల్లీ: మణిపుర్ ఘటనను రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లతో పోల్చడం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం వ్యాఖ్యానించారు. కేంద్రం స్వయం ప్రేరిత కోమాలో పడిపోయిందని, ఫలితంగా ఈశాన్య రాష్ట్రం మణిపుర్ కుప్పకూలుతోందని పేర్కొన్నారు. ‘రాజస్థాన్, బిహార్, పశ్చిమ బెంగాల్లో మహిళలపై అరాచకాలు జరుగుతున్నాయని అనుకుందాం.. వాటితో మణిపుర్లో జరుగుతున్న దారుణ హింసను పోల్చి ప్రతిపక్షాలు మౌనంగా ఉండాలా’ అని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. -
92 వేల అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. -
నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్
కార్గిల్ 25వ విజయ్ దివస్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులర్పించనున్నారు. -
గూగుల్ మ్యాప్స్లో సరికొత్త ఫీచర్లు
భారతీయ వినియోగదారులను మరింతగా ఆకర్షించేలా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ మ్యాప్స్ ప్రకటించింది. -
ఇద్దరు ఝార్ఖండ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఝార్ఖండ్ శాసనసభ స్పీకర్ ట్రైబ్యునల్ గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు (7)
తిహాడ్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడంపై ‘ఇండియా’ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. -
మహారాష్ట్ర, హిమాచల్లలో కుంభవృష్టి
హిమాచల్, మహారాష్ట్రల్లో కుండపోత వర్షాలు కురిసి జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ముంబయిలో 9 గంటల వ్యవధిలో 100 మి.మీ. పైగా వాన దంచికొట్టింది. -
ముమ్మాటికీ వివక్షేనన్న విపక్షం
కేంద్ర బడ్జెట్లో ఒకటిరెండు రాష్ట్రాలకు తప్పిస్తే మిగిలినవాటికి అన్యాయం జరిగిందని విపక్ష సభ్యులు మరోసారి గట్టిగా గళం వినిపించడంతో గురువారం పార్లమెంటు ఉభయసభలు దాదాపు స్తంభించిపోయాయి. -
ట్రంకు పెట్టెల బదులు ట్రాలీ బ్యాగులు
లోకోపైలట్లు, గార్డులు ఇకపై తమ వ్యక్తిగత వస్తువుల్ని, విధి నిర్వహణకు అవసరమైన సామగ్రిని ఇనుప ట్రంకు పెట్టెల్లో కాకుండా ట్రాలీ బ్యాగుల్లో తీసుకువెళ్లాల్సి ఉంటుంది. -
ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0
జమ్ముకశ్మీర్లో ఉగ్ర చర్యలకు పాల్పడుతున్న 55 మంది ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0’ను ప్రారంభించింది. -
భారీ వర్షాలు.. ముంబయిలో రెడ్ అలర్ట్
మహారాష్ట్రలోని ముంబయిలోనూ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
-
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
-
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
-
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
-
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్