అయోధ్య విగ్రహ ప్రతిష్ఠాపనకు 7వేల మందికి ఆహ్వానం

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అతిరథ మహారథులను రామాలయ ట్రస్టు ఆహ్వానిస్తోంది.

Published : 07 Dec 2023 05:25 IST

అయోధ్య: ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అతిరథ మహారథులను రామాలయ ట్రస్టు ఆహ్వానిస్తోంది. మొత్తం 7వేల మంది ముఖ్యులకు ఆహ్వానాలను పంపుతోంది. వారిలో ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ, సచిన్‌ తెందుల్కర్‌, విరాట్‌ కోహ్లి, అమితాబ్‌ బచ్చన్‌ తదితరులు ఉన్నారు. రామాయణ్‌ సీరియల్‌లో శ్రీరాముడు, సీతగా నటించిన అరుణ్‌ గోవిల్‌, దీపికా చిక్‌లియాలకూ ఆహ్వానం అందనుంది. వచ్చే ఏడాది జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. అయోధ్యలో కరసేవ సందర్భంగా జరిగిన పోలీసు కాల్పుల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులను, 4,000 మంది యోగులను తదితరులను ఆహ్వానించాలని రామాలయ ట్రస్టు నిర్ణయించింది.

రామాలయంలో ప్రతిష్ఠించే రామ్‌లల్లా విగ్రహాన్ని ఈ నెల 15న ఖరారు చేయనున్నట్లు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. కర్ణాటక, రాజస్థాన్‌ నుంచి తెచ్చిన శిలలతో మొత్తం మూడు విగ్రహాలను శిల్పులు రూపొందించారని, అందులో అత్యుత్తుమ విగ్రహాన్ని ఖరారు చేస్తామని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని