ఎన్నికైన ప్రభుత్వ ఆదేశాలను ప్రధాన కార్యదర్శి పాటించాల్సిందే
దేశరాజధాని దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్రం నియమించినా, ఎన్నికైన ప్రభుత్వ ఆదేశాలను ఆయన పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
పాలనను స్తంభింపచేయకూడదు: సుప్రీంకోర్టు
దిల్లీ: దేశరాజధాని దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్రం నియమించినా, ఎన్నికైన ప్రభుత్వ ఆదేశాలను ఆయన పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దిల్లీ జాతీయ రాజధాని ప్రాంతానికి ప్రధాన కార్యదర్శిని నియమించే అధికారం కేంద్రానికి ఉందంటూ గత నెల 29న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు సంబంధించి పూర్తి పాఠాన్ని బుధవారం సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఇందులో కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్రభుత్వ అధికారులు రాజకీయంగా తటస్థంగా ఉండాలి. దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్రం ఎంపిక చేసినా.. ఎన్నికైన ప్రభుత్వ ఆదేశాలను ఆయన పాటించాల్సిందే. తన చర్యలతో ప్రభుత్వ పాలనను స్తంభింపచేయకూడదు’’ అని ధర్మాసనం పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?