పార్లమెంటు అలజడి తీవ్రమైన అంశం
పార్లమెంటులో భద్రతా వైఫల్యాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని, దీనిపై కలహించుకోవడం తగదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
దీనిపై కలహించుకోవడం తగదు
ప్రధాని మోదీ వ్యాఖ్యలు
దిల్లీ: పార్లమెంటులో భద్రతా వైఫల్యాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని, దీనిపై కలహించుకోవడం తగదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఘటనపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని, కఠిన చర్యలకు ఉపక్రమించాయని చెప్పారు. ఈ అంశంపై చర్చించాల్సిందేనని ఉభయ సభల్లో ప్రతిపక్షాలు డిమాండు చేస్తున్న నేపథ్యంలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘పార్లమెంటులో భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడం ఎంతో బాధించింది. దీన్ని తక్కువగా అంచనా వేయకూడదు. ఇలాంటివి పునరావృతం కాకుండా మూలాల్లోకి వెళ్లి పరిష్కారం కనుగొనాలి. ప్రతిపక్షాలు దీనిపై అనవసర రాద్ధాంతం చేయడం మానుకోవాలి. ఘటన అనంతరం స్పీకర్ ఓం బిర్లా విచారణకు ఆదేశించారు. దర్యాప్తుపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ కుట్ర వెనుక నిజాలు త్వరలోనే బయటపడతాయి’ అని ప్రధాని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ సీఎంలుగా కొత్త వారిని ఎంపిక చేయడంపై ప్రధాని మాట్లాడుతూ.. ‘మూడు రాష్ట్రాల సీఎంలు కొత్తవారని చాలా మంది భావిస్తున్నారు. నిజానికి వారు కొత్తవాళ్లేం కాదు.. ఎంతో అనుభవం ఉంది. చాలా కాలంగా మీడియా దృష్టి కొన్ని కుటుంబాలపైనే ఉండిపోయింది. దీంతో కష్టపడి పని చేసేవారి గురించి పెద్దగా ఎవరికీ తెలియలేదు. ఇలాంటివి ప్రతి రంగంలోనూ ఉంటాయి’ అని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దుకు సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేసిందని, ప్రపంచంలో ఏ శక్తీ దానిని తిరిగి తీసుకురాలేదని తెలిపారు. 2024 ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధిస్తామని చెప్పారు. తమను ప్రజలు ఎందుకు తిరస్కరిస్తున్నారో ప్రతిపక్షాలు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.
చర్చ నుంచి ప్రధాని పారిపోతున్నారు: కాంగ్రెస్
పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై చర్చ నుంచి ప్రధాని మోదీ పారిపోతున్నారని కాంగ్రెస్ విమర్శించింది. ఇందులో మైసూరు ఎంపీ పాత్రపై ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తోందనే ఇలా చేస్తున్నారని అభిప్రాయపడింది. పార్లమెంటు ఘటనపై కలహించుకోవడం తగదని ప్రధాని హితవు పలికిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పందించారు. ఎట్టకేలకు ఈ అంశంపై ప్రధాని మాట్లాడారని పేర్కొన్నారు.
వికసిత్ భారత్ నాకో పరీక్ష: ప్రధాని
వారణాసి: పక్కా ఇల్లు, గ్యాస్ సిలిండర్ అందినప్పుడే పేదలు సాధికారత సాధించగలుగుతారని, ఆత్మ విశ్వాసంతో ఉంటారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తాను గ్యాస్ సిలిండర్ను పొందానని చెప్పిన రోజున అతడు పేద, గొప్ప తారతమ్యాలు అంతమైనట్లు భావిస్తాడని తెలిపారు. సంక్షేమ ఫలాలు అందుతున్నాయో లేదో ప్రజల నుంచి ప్రత్యక్షంగా తెలుసుకునే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర తనకో పెద్ద పరీక్షని చెప్పారు. వారణాసిలో జరిగిన వికసిత్ సంకల్ప్ యాత్రలో ప్రధాని మాట్లాడారు. ‘నేను ఏం చెప్పానో.. ఏం చేస్తున్నానో ప్రజల నుంచి నేరుగా తెలుసుకోవాలనుకుంటున్నా. దేశం సరైన దారిలో వెళ్తుందా లేదా అనేదీ ప్రజల నుంచి వినాలనుకుంటున్నా. నేను అనుకున్న వారికి ఫలాలు అందుతున్నాయా అని తెలుసుకోవాలనుకుంటున్నా. నేను చేసిన పని ఫలితాలిస్తోందా లేదా అనేదీ తెలుసుకోవడానికే ఈ ప్రయత్నం’ అని మోదీ పేర్కొన్నారు.
రెండో కాశీ తమిళ సంగమం ప్రారంభం
వారణాసిలోని నమో ఘాట్లో ఆదివారం ప్రధాని మోదీ.. రెండో కాశీ తమిళ సంగమాన్ని ప్రారంభించారు. వారణాసి, కన్యాకుమారిల మధ్య తిరిగే కాశీ తమిళ సంగమం ఎక్స్ప్రెస్ రైలుకూ ఆయన శ్రీకారం చుట్టారు. ఆదివారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకూ జరిగే కాశీ తమిళ సంగమంలో తమిళనాడు, పుదుచ్చేరిల నుంచి 1,400 మంది పాల్గొంటారు. కృత్రిమ మేధ టూల్ ‘భాషిణి’ని ఉపయోగించి ప్రధాని మోదీ హిందీ ప్రసంగాన్ని తమిళంలోకి అనువదించారు. ప్రధాని కార్యక్రమంలో తొలిసారిగా దీనిని వినియోగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని హెచ్చరించారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. -
92 వేల అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. -
నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్
కార్గిల్ 25వ విజయ్ దివస్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులర్పించనున్నారు. -
గూగుల్ మ్యాప్స్లో సరికొత్త ఫీచర్లు
భారతీయ వినియోగదారులను మరింతగా ఆకర్షించేలా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ మ్యాప్స్ ప్రకటించింది. -
ఇద్దరు ఝార్ఖండ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఝార్ఖండ్ శాసనసభ స్పీకర్ ట్రైబ్యునల్ గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు (7)
తిహాడ్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడంపై ‘ఇండియా’ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. -
మహారాష్ట్ర, హిమాచల్లలో కుంభవృష్టి
హిమాచల్, మహారాష్ట్రల్లో కుండపోత వర్షాలు కురిసి జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ముంబయిలో 9 గంటల వ్యవధిలో 100 మి.మీ. పైగా వాన దంచికొట్టింది. -
ముమ్మాటికీ వివక్షేనన్న విపక్షం
కేంద్ర బడ్జెట్లో ఒకటిరెండు రాష్ట్రాలకు తప్పిస్తే మిగిలినవాటికి అన్యాయం జరిగిందని విపక్ష సభ్యులు మరోసారి గట్టిగా గళం వినిపించడంతో గురువారం పార్లమెంటు ఉభయసభలు దాదాపు స్తంభించిపోయాయి. -
ట్రంకు పెట్టెల బదులు ట్రాలీ బ్యాగులు
లోకోపైలట్లు, గార్డులు ఇకపై తమ వ్యక్తిగత వస్తువుల్ని, విధి నిర్వహణకు అవసరమైన సామగ్రిని ఇనుప ట్రంకు పెట్టెల్లో కాకుండా ట్రాలీ బ్యాగుల్లో తీసుకువెళ్లాల్సి ఉంటుంది. -
ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0
జమ్ముకశ్మీర్లో ఉగ్ర చర్యలకు పాల్పడుతున్న 55 మంది ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0’ను ప్రారంభించింది. -
భారీ వర్షాలు.. ముంబయిలో రెడ్ అలర్ట్
మహారాష్ట్రలోని ముంబయిలోనూ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
-
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
-
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ