పార్లమెంటు అలజడి తీవ్రమైన అంశం
పార్లమెంటులో భద్రతా వైఫల్యాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని, దీనిపై కలహించుకోవడం తగదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
దీనిపై కలహించుకోవడం తగదు
ప్రధాని మోదీ వ్యాఖ్యలు
దిల్లీ: పార్లమెంటులో భద్రతా వైఫల్యాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని, దీనిపై కలహించుకోవడం తగదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఘటనపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని, కఠిన చర్యలకు ఉపక్రమించాయని చెప్పారు. ఈ అంశంపై చర్చించాల్సిందేనని ఉభయ సభల్లో ప్రతిపక్షాలు డిమాండు చేస్తున్న నేపథ్యంలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘పార్లమెంటులో భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడం ఎంతో బాధించింది. దీన్ని తక్కువగా అంచనా వేయకూడదు. ఇలాంటివి పునరావృతం కాకుండా మూలాల్లోకి వెళ్లి పరిష్కారం కనుగొనాలి. ప్రతిపక్షాలు దీనిపై అనవసర రాద్ధాంతం చేయడం మానుకోవాలి. ఘటన అనంతరం స్పీకర్ ఓం బిర్లా విచారణకు ఆదేశించారు. దర్యాప్తుపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ కుట్ర వెనుక నిజాలు త్వరలోనే బయటపడతాయి’ అని ప్రధాని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ సీఎంలుగా కొత్త వారిని ఎంపిక చేయడంపై ప్రధాని మాట్లాడుతూ.. ‘మూడు రాష్ట్రాల సీఎంలు కొత్తవారని చాలా మంది భావిస్తున్నారు. నిజానికి వారు కొత్తవాళ్లేం కాదు.. ఎంతో అనుభవం ఉంది. చాలా కాలంగా మీడియా దృష్టి కొన్ని కుటుంబాలపైనే ఉండిపోయింది. దీంతో కష్టపడి పని చేసేవారి గురించి పెద్దగా ఎవరికీ తెలియలేదు. ఇలాంటివి ప్రతి రంగంలోనూ ఉంటాయి’ అని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దుకు సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేసిందని, ప్రపంచంలో ఏ శక్తీ దానిని తిరిగి తీసుకురాలేదని తెలిపారు. 2024 ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధిస్తామని చెప్పారు. తమను ప్రజలు ఎందుకు తిరస్కరిస్తున్నారో ప్రతిపక్షాలు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.
చర్చ నుంచి ప్రధాని పారిపోతున్నారు: కాంగ్రెస్
పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై చర్చ నుంచి ప్రధాని మోదీ పారిపోతున్నారని కాంగ్రెస్ విమర్శించింది. ఇందులో మైసూరు ఎంపీ పాత్రపై ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తోందనే ఇలా చేస్తున్నారని అభిప్రాయపడింది. పార్లమెంటు ఘటనపై కలహించుకోవడం తగదని ప్రధాని హితవు పలికిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పందించారు. ఎట్టకేలకు ఈ అంశంపై ప్రధాని మాట్లాడారని పేర్కొన్నారు.
వికసిత్ భారత్ నాకో పరీక్ష: ప్రధాని
వారణాసి: పక్కా ఇల్లు, గ్యాస్ సిలిండర్ అందినప్పుడే పేదలు సాధికారత సాధించగలుగుతారని, ఆత్మ విశ్వాసంతో ఉంటారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తాను గ్యాస్ సిలిండర్ను పొందానని చెప్పిన రోజున అతడు పేద, గొప్ప తారతమ్యాలు అంతమైనట్లు భావిస్తాడని తెలిపారు. సంక్షేమ ఫలాలు అందుతున్నాయో లేదో ప్రజల నుంచి ప్రత్యక్షంగా తెలుసుకునే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర తనకో పెద్ద పరీక్షని చెప్పారు. వారణాసిలో జరిగిన వికసిత్ సంకల్ప్ యాత్రలో ప్రధాని మాట్లాడారు. ‘నేను ఏం చెప్పానో.. ఏం చేస్తున్నానో ప్రజల నుంచి నేరుగా తెలుసుకోవాలనుకుంటున్నా. దేశం సరైన దారిలో వెళ్తుందా లేదా అనేదీ ప్రజల నుంచి వినాలనుకుంటున్నా. నేను అనుకున్న వారికి ఫలాలు అందుతున్నాయా అని తెలుసుకోవాలనుకుంటున్నా. నేను చేసిన పని ఫలితాలిస్తోందా లేదా అనేదీ తెలుసుకోవడానికే ఈ ప్రయత్నం’ అని మోదీ పేర్కొన్నారు.
రెండో కాశీ తమిళ సంగమం ప్రారంభం
వారణాసిలోని నమో ఘాట్లో ఆదివారం ప్రధాని మోదీ.. రెండో కాశీ తమిళ సంగమాన్ని ప్రారంభించారు. వారణాసి, కన్యాకుమారిల మధ్య తిరిగే కాశీ తమిళ సంగమం ఎక్స్ప్రెస్ రైలుకూ ఆయన శ్రీకారం చుట్టారు. ఆదివారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకూ జరిగే కాశీ తమిళ సంగమంలో తమిళనాడు, పుదుచ్చేరిల నుంచి 1,400 మంది పాల్గొంటారు. కృత్రిమ మేధ టూల్ ‘భాషిణి’ని ఉపయోగించి ప్రధాని మోదీ హిందీ ప్రసంగాన్ని తమిళంలోకి అనువదించారు. ప్రధాని కార్యక్రమంలో తొలిసారిగా దీనిని వినియోగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘సిజేరియన్’ శిశువులకు రెండో తట్టు టీకా తప్పనిసరి
సహజ ప్రసవం ద్వారా పుట్టే శిశువులతో పోలిస్తే సిజేరియన్ విధానంలో జన్మించిన శిశువుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని బ్రిటన్, చైనా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. -
కేజ్రీవాల్కు ఇచ్చినట్లే నాకూ బెయిలివ్వండి
లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించుకునేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఝార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
వీవీప్యాట్ స్లిప్పుల తీర్పును సమీక్షించాలని కోరుతూ పిటిషన్
లెక్కింపు సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీయం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను పూర్తిస్థాయిలో సరిపోల్చాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన ఏప్రిల్ 26నాటి తీర్పును సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
కేజ్రీవాల్ సహాయకుడు నాపై దాడి చేశారు
మద్యం కుంభకోణం కేసులో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మరో వివాదంలో చిక్కుకుంది. -
త్రిపురకు వెళ్లి ఏనుగులను కాపాడిన అంబానీ ‘వన్ తారా’బృందం
గుజరాత్లోని జామ్నగర్కు చెందిన ‘వన్ తారా’ జంతు సంరక్షణ కేంద్ర సిబ్బంది జబ్బుపడిన ఏనుగును, దాని పిల్లను కాపాడేందుకు ఏకంగా 3,500 కి.మీ. ప్రయాణించారు. -
ముంబయిలో గాలివాన బీభత్సం
కొన్నిరోజులుగా వేడి వాతావరణంతో సతమతమవుతోన్న ముంబయిలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. -
56 పాఠశాలలకు బాంబు బెదిరింపు సందేశాలు
రాజస్థాన్లోని జైపుర్లో ఉన్న 56 పాఠశాలలకు బాంబు బెదిరింపు సందేశాలు రావడం కలకలం సృష్టించింది. సోమవారం ఉదయం మెయిల్ రూపంలో ఈ సందేశాలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. -
కేజ్రీవాల్ను సీఎంగా తొలగించే నిర్ణయం ఎల్జీదే
మనీలాండరింగ్ కేసులో అరెస్టైన కారణంగా దిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్ను తొలగించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. -
మోదీ మతపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు
లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మతపరమైన ప్రసంగాలు చేస్తున్నారని, ఆయనపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సోమవారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
దర్యాప్తునకు పనికొచ్చే సమాచారం అందించని కెనడా
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ (45) హత్య కేసు దర్యాప్తునకు తోడ్పడే నిర్దిష్ట సమాచారమేదీ కెనడా నుంచి భారత దర్యాప్తు సంస్థలకు అందలేదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ సోమవారం తెలిపారు. -
భారత్-ఫ్రాన్స్ సంయుక్త సైనిక శిక్షణ ‘ఎక్సర్సైజ్ శక్తి’ ప్రారంభం
భారత్-ఫ్రాన్స్ దేశాల మధ్య 7వ ‘ఎక్సర్సైజ్ శక్తి’ సంయుక్త సైనిక శిక్షణ సోమవారం మేఘాలయలోని ఉమ్రోయ్లో ఆధునిక విదేశీ శిక్షణ కేంద్రంలో ప్రారంభమైందని రక్షణ శాఖ తెలిపింది. -
ఆపరేషన్ చేసి కడుపులో దూది మర్చిపోయిన వైద్యుడు
ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్లో ఓ వైద్యుడు చేసిన నిర్వాకం రోగి ప్రాణాల మీదకు తెచ్చింది. పిత్తాశయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి లోహియానగర్లోని స్థానిక నర్సింగ్ హోంలో చేరారు. -
సంక్షిప్త వార్తలు
దిల్లీలోని ఒక పెట్రోల్ పంపు వద్ద దాడికి పాల్పడిన ఘటనలో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్, అతని కుమారుడు అనాస్ అహ్మద్పై సోమవారం బెయిల్కు వీల్లేని వారెంట్ జారీ అయినట్లు పోలీసులు తెలిపారు. -
రాహుల్తో చర్చకు భాజపా రెడీ.. యువ నాయకుడికి అవకాశం
Rahul gandhi: రాహుల్తో చర్చించేందుకు భాజపా సిద్ధమైంది. ఓ యువ నాయకుడికి అవకాశం ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
భర్త మరణించినా.. ఓటు విలువ చాటిన భార్య
-
వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన జీవీ ప్రకాశ్, సైంధవి దంపతులు
-
ప్రపంచంలో అతడొక్కడే.. హిరోషిమా, నాగసాకి అణుదాడులకు గురై జీవించిన వ్యక్తి..!
-
కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం.. ఎందుకంటే?
-
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (14/05/24)