డిజిటల్ అంతరాలను చెరిపేస్తాం
భారతదేశంలో డిజిటల్ అంతరాలను చెరిపేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సాంకేతికతను గ్రామాలకూ తీసుకువెళతామని తెలిపారు. కృత్రిమ మేధ(ఏఐ)ని ఓ మంత్రదండంగా చూడకూడదని అన్నారు.
గ్రామాలకూ సాంకేతికతను తీసుకువెళతాం
ఏఐని సరిగ్గా వినియోగించుకోవాలి
డీప్ఫేక్కు హద్దులు నిర్ణయించాలి
బిల్గేట్స్తో సంభాషణలో మోదీ
దిల్లీ: భారతదేశంలో డిజిటల్ అంతరాలను చెరిపేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సాంకేతికతను గ్రామాలకూ తీసుకువెళతామని తెలిపారు. కృత్రిమ మేధ(ఏఐ)ని ఓ మంత్రదండంగా చూడకూడదని అన్నారు. ఈ సాంకేతికతతో సవాళ్లు ఎదురవుతున్న మాట వాస్తవమేనని, వాటిని అధిగమించి అవసరాలకు తగ్గట్టు ఏఐని వినియోగించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తంచేశారు. డీప్ఫేక్పై మాత్రం ప్రధాని ఆందోళన వెలిబుచ్చారు. దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్తో శుక్రవారం ప్రధాని ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంకేతికత, పర్యావరణం సహా పలు రంగాలపై ఇరువురూ చర్చించుకున్నారు. ఈ సందర్భంగా సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి తాను ఇష్టపడతానని ప్రధాని తెలిపారు. ‘‘నేను నిపుణుడిని కాదు. కానీ కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఉత్సుకతతో ఉంటా. భారత్లో జరిగిన జీ20 సదస్సులో ఏఐ టెక్నాలజీనే చాలావరకు వినియోగించాం. ఇది శక్తిమంతమైనదే. కానీ దీన్నో మంత్రదండంగా పరిగణిస్తే తీవ్రపరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంది. డీప్ఫేక్ కంటెంట్ను గుర్తించడం చాలా అవసరం. అందుకోసం కంటెంట్కు వాటర్మార్క్లు ఉండాలి. లేకపోతే చాలా ప్రమాదం. నా గొంతుతో అసభ్యపదజాలం వాడితే ప్రజలు విశ్వసించే అవకాశం ఉంది. ఈ విషయంలో హద్దులు నిర్ణయించుకోవాలి’’ అని మోదీ పేర్కొన్నారు.
నమో యాప్లో కృత్రిమ మేధ
ప్రధాని మోదీ, బిల్గేట్స్ ముఖ్యంగా కృత్రిమ మేధ, దాని ప్రయోజనాలపైనే ఎక్కువగా మాట్లాడుకున్నారు. నమో యాప్లోనూ ఏఐని వినియోగించామని మోదీ చెప్పారు. కాశీ తమిళ సంగమం కార్యక్రమంలో తన హిందీ ప్రసంగం తమిళంలోకి ఏఐ టెక్నాలజీ ద్వారానే మారిందన్న విషయాన్ని తెలిపారు. ‘‘డిజిటల్ రంగంలో భారత్ చాలా మార్పులు తీసుకొచ్చింది. ‘నమో డ్రోన్ దీదీ’ పథకం విజయవంతంగా అమలవుతోంది. సైకిల్ నడపడం కూడా రాని మహిళలు.. ఇప్పుడు పైలట్లుగా, డ్రోన్లు ఆపరేట్ చేసే స్థాయికి ఎదిగారు’’ అని బిల్గేట్స్కు వివరించారు.
విద్య, వైద్యంలోనూ..
భారత్లో తాము డిజిటల్ అంతరాలకు తావివ్వబోమని ప్రధాని స్పష్టం చేశారు ‘‘గ్రామాలకు డిజిటల్ విప్లవాన్ని తీసుకువెళతాం. ఇది మాకు ముఖ్యమైన లక్ష్యం. సాంకేతికతను ఉపయోగించి దేశవ్యాప్తంగా గ్రామాల్లో ఉన్న రెండు లక్షల ఆరోగ్య కేంద్రాలను పట్టణాల్లో ఆసుపత్రులకు అనుసంధానం చేశాం. అత్యుత్తమ వైద్యాన్ని గ్రామీణవాసులకు అందిస్తున్నాం. విద్యావ్యవస్థలోనూ ఇలాంటి మార్పులే చేస్తాం. బోధనా సిబ్బంది కొరత తెలియకుండా సాంకేతికతను వాడుకుంటాం. విద్యార్థికి అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తాం’’ అని మోదీ చెప్పారు.
పర్యావరణ పదజాలమూ మారాలి
పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రస్తుతం అంతర్జాతీయంగా అనుసరించిన పదజాలం మారాల్సిన అవసరం ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ‘‘వాతావరణ మార్పుల విషయంలో ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్లాలి. ఒకటి ఆవిష్కరణ. రెండోది పర్యావరణ అనుకూల జీవనశైలులు. అదే సమయంలో పర్యావరణ సవాళ్లను ఎదుర్కొవడానికి ఉపయోగిస్తున్న పదజాలమూ మారాలి. ఉక్కు, ఇంధనం వినియోగం ఆధారంగా దేశ అభివృద్ధిని లెక్కకడుతున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. ఈ ప్రమాణాలను కొనసాగిస్తే కర్బన ఉద్గారాల శాతం పెరుగుతుంది. ఇది మారాలి. పర్యావరణ హితంగా ప్రమాణాలు ఉండాలి. మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. జీడీపీని హరిత జీడీపీగా పిలవాలి. మొత్తం జీడీపీలో పర్యావరణ జీడీపీ ఎంత ఉందో లెక్కించాలి’’ అని ప్రధాని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
సోషల్ మీడియా ట్రోలర్ల వికృత రూపం మరోసారి బయటపడింది. పదో తరగతిలో స్టేట్ టాపర్గా నిలిచిన బాలికను వారు వేధించారు. ఒక దశలో కొన్ని మార్కులు తగ్గినా బాగుండు అని ఆమె అనుకొనేలా చేశారు. చివరికి నెటిజన్లు, నాయకులు ఆమెకు అండగా నిలవడంతో ధైర్యం తెచ్చుకొని భవిష్యత్తుపై దృష్టిపెడతానని పేర్కొంది. -
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
Mahadev Betting App Case: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో సాహిల్ ఖాన్కు సిట్ అధికారులు డిసెంబరులోనే సమన్లు జారీ చేశారు. కానీ, ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. -
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
ఓ జంతు ప్రేమికుడు తన ఇంట్లో ఉన్న శునకాలపై వినూత్న రీతిలో ప్రేమను చాటుకున్నాడు. తన వివాహ ఆహ్వాన పత్రికపై వాటి పేర్లను ముద్రించాడు. -
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
సమాధాన పత్రాలను జై శ్రీరాం, భారత క్రికెటర్ల పేర్లతో నింపినా విద్యార్థులను 56% మార్కులతో పాస్ చేశారన్న కారణంతో ఉత్తర్ప్రదేశ్లోని వీర్ బహదూర్ సింగ్ పుర్వాంచల్ విశ్వవిద్యాలయం ఇద్దరు ఆచార్యులను తొలగించింది. -
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు
ఆకలి వేస్తోందని శస్త్రచికిత్సను మధ్యలోనే ఆపేసి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేశాడు ఓ వైద్యుడు. అనంతరం దాదాపు రెండు గంటల తర్వాత వచ్చి శస్త్రచికిత్స పూర్తి చేశాడు. -
అక్రమ రవాణా కాదు.. వారంతా మదర్సా విద్యార్థులే
అక్రమంగా చిన్నారులను రవాణా చేస్తున్నారన్న అనుమానంతో శుక్రవారం తాము అదుపులోకి తీసుకున్న బస్సులో ఉన్నది మదర్సా విద్యార్థులని శనివారం ఉత్తర్ప్రదేశ్ అధికారులు తెలిపారు. -
మహిళలకూ సీడీఎస్ పరీక్ష అవకాశంపై నిర్ణయం తీసుకోండి
ఇండియన్ మిలటరీ అకాడమీ (ఐఎంఏ), నేవల్ అకాడమీ (ఐఎన్ఏ), ఎయిర్ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్ఏ)ల్లో ప్రవేశం కోసం నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) పరీక్ష రాసే అవకాశాన్ని మహిళలకూ కల్పించాలన్న వినతిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా దిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ఉత్తరాఖండ్ అడవిలో మంటలు.. రంగంలోకి ఐఏఎఫ్ హెలికాప్టర్
ఉత్తరాఖండ్లోని నైనీతాల్ జిల్లాలోని అడవిలో చెలరేగిన మంటలను అదుపుచేసేందుకు అధికారులు శనివారం భారత వైమానిక దళ హెలికాప్టర్ను రంగంలోకి దించారు. -
సీబీఐపై ఈసీకి తృణమూల్ ఫిర్యాదు
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సీబీఐ సోదాలు నిర్వహించడంపై అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. -
ఇంకా చెరలోనే 16 మంది భారతీయులు
హర్మూజ్ జలసంధి దగ్గర ఇరాన్ అదుపులోకి తీసుకున్న నౌకలోని 16 మంది భారత సిబ్బంది ఇంకా విడుదల కాలేదు. ఇరాన్ చెరలోనే ఉన్నారు. -
దేశంలో పేటెంట్స్ ఫైలింగ్లో వృద్ధి
దేశంలో నూతన ఆవిష్కరణలు, వాటికి సంబంధించిన మేధోహక్కుల (పేటెంట్) దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నా.. సరైన మౌలిక సదుపాయాలు లేవని నాస్కామ్ వెల్లడించింది. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్కు మరోసారి ఈడీ సమన్లు
ఆప్ ఎమ్యెల్యే అమానతుల్లా ఖాన్కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. దిల్లీ వక్ఫ్ బోర్డుకు ఆయన ఛైర్మన్గా వ్యవహరించిన సమయంలో అవకతవకలకు సంబంధించి హవాలా కేసులో 29న దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చి తన వాంగ్మూలాన్ని కొనసాగించవలసిందిగా కోరింది. -
ఈడీ అరెస్టు అక్రమం, నిరంకుశం
మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడం అక్రమం, నిరంకుశమని దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ శనివారం సుప్రీంకోర్టుకు తెలిపారు. -
హెలికాప్టర్లో కూర్చోబోతూ కిందపడ్డ మమతా బెనర్జీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెలికాప్టర్లో కూర్చోబోతుండగా అదుపుతప్పి కింద పడ్డారు. -
సరికొత్త వందే మెట్రో ప్రయోగాత్మక పరుగు జులైలో
వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లకు ప్రయాణికుల నుంచి లభిస్తున్న ఆదరణతో మెట్రో నగరాల మధ్య వందే మెట్రో రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
మణిపుర్లో రెచ్చిపోయిన మిలిటెంట్లు
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. బిష్ణుపుర్ జిల్లాలోని భద్రతా సిబ్బంది శిబిరంపై రెండు గంటల పాటు కాల్పులకు తెగబడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!