నిష్పాక్షిక ఓటుకు ఏఐ చేటు!
దేశంలో వేసవి తాపంతోపాటు ఎన్నికల వేడి కూడా క్రమంగా పెరుగుతోంది. గెలుపే లక్ష్యంగా నేతలు విమర్శలు, ప్రతివిమర్శలకు పదును పెడుతున్నారు.
డీప్ఫేక్లు, వాయిస్క్లోనింగ్లతో ఎన్నికలకు సవాళ్లు
దేశంలో వేసవి తాపంతోపాటు ఎన్నికల వేడి కూడా క్రమంగా పెరుగుతోంది. గెలుపే లక్ష్యంగా నేతలు విమర్శలు, ప్రతివిమర్శలకు పదును పెడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఈ క్రమంలో కృత్రిమ మేధ (ఏఐ), డీప్ఫేక్, వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీల వినియోగం చర్చనీయాంశమైంది. ఈ అధునాతన సాంకేతికతతో లాభమెంతో.. నష్టమూ అంతే! ఈ సాధనాలతో ఒక వ్యక్తి ఆహార్యాన్ని మార్చడం, అనని మాటలను అన్నట్లుగా చూపడంలాంటి చర్యలతో సైబర్ నేరగాళ్లు కలకలం సృష్టిస్తున్నారు. ఎన్నికల్లో ఇలాంటి సాంకేతిక గిమ్మిక్కులు ప్రయోగించి.. ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. తద్వారా ఒక పార్టీకి అనుకూలంగా/ వ్యతిరేకంగా మొగ్గేలా చేయవచ్చు. ఇవి నిష్పాక్షిక ఎన్నికలకు విఘాతం కలిగిస్తాయని, దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు.
కొన్నేళ్ల కిందటితో పోలిస్తే ఏఐ సాంకేతిక పరిజ్ఞానాలు చౌకలో అందుబాటులోకి వచ్చాయి. ప్రజల్ని ఇట్టే బుట్టలో పడేసే డీప్ఫేక్లను తయారుచేయడానికి పెద్దపెద్ద సంస్థలే అవసరంలేదని, ఆ పరిజ్ఞానంపై కాస్త అవగాహన ఉన్నవారు ఒక ల్యాప్టాప్ సాయంతో నకిలీలను వ్యాప్తి చేయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్కు చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్, కమల్నాథ్ల నకిలీ వీడియోలు వెలువడ్డాయి. వారు అనని మాటలను అందులో చొప్పించారు. దీనికితోడు పలు దేశాల్లో జరిగిన పరిణామాలు కూడా ఆందోళనను పెంచుతున్నాయి.
- పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఎన్నికల్లో.. ఓటర్లలో ఆసక్తిని చంపేసే డీప్ఫేక్ సందేశాలను సైబర్ నేరగాళ్లు సృష్టించారు. ‘‘పోలింగ్కు రావొద్దు. మనకు వ్యతిరేకంగా భారీగా రిగ్గింగ్ జరిగింది’’ అంటూ ప్రచారం చేశారు. దీంతో బాధిత పార్టీల నేతలు స్పందించి.. ఆ సందేశాలు నిజం కాదంటూ ఓటర్లను నమ్మించడానికి ఆపసోపాలు పడ్డారు.
- బంగ్లాదేశ్లో ఎన్నికలకు ముందు డీప్ఫేక్ వీడియోలు వచ్చాయి. వాటిలో.. విపక్ష రాజకీయ నాయకురాలు రుమిన్ ఫర్హానాను బికినీలో, మరో మహిళా నేత నిపుణ్ రాయ్ను ఈతకొలనులో చూపించారు.
- ఈ ఏడాది జనవరిలో అమెరికాలోని న్యూహాంప్షైర్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో అధ్యక్షుడు జో బైడెన్ స్వరాన్ని అనుకరిస్తూ ఒక నకిలీ సందేశం వచ్చింది. ప్రైమరీలో పాలుపంచుకోవద్దంటూ ఆయన సూచించినట్లు అందులో ఉంది.
- స్లొవేకియాలో ఏఐ సాయంతో ఒక అభ్యర్థి స్వరాన్ని అనుకరించారు. మద్యం ధరలను పెంచడానికి, ఎన్నికల్లో రిగ్గింగ్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నానని ఆయన పేర్కొన్నట్లు అందులో ఉంది.
పెరిగిన ముప్పు
భారత్లో ఇప్పుడు మొబైల్ డేటా చౌకలో అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్ఫోన్ల వినియోగం విస్తృతమైంది. ఈ నేపథ్యంలో.. అదును చూసి సామాజిక మాధ్యమాల్లోకి వదిలే డీప్ఫేక్లు కార్చిచ్చులా వ్యాపించి, అభ్యర్థులపై ఓటర్లలో ఆగ్రహం పెంచేలా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. లేదా భారీగా రిగ్గింగ్ జరుగుతోందని.. మీరు ఓటువేసినా నిష్ఫలమని ప్రజల్ని నమ్మించే ప్రమాదం ఉందంటున్నారు. ఏఐ సృష్టించే నకిలీ వార్తల వల్ల ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లే ముప్పు కూడా ఉంది.
- 2020లో భాజపా నేత మనోజ్ తివారీ.. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హరియాణ్వీ యాసలో డబ్ చేసిన ఒక ఏఐ ఆధారిత వీడియో సందేశాన్ని తెరపైకి తెచ్చారు. నాడు ప్రసంగానికి తగ్గట్లు తివారీ పెదాల కదలికలు సింక్ చేయడానికి ఒకటిన్నర రోజు పట్టింది. పైగా ఆ స్వరం టెక్నాలజీతో సృష్టించింది కాదు. ఒక మిమిక్రీ కళాకారుడు డబ్బింగ్ చేశారు. ఇప్పుడు సాంకేతికత మారింది. లిప్ సింకింగ్ టెక్నాలజీతోపాటు వాయిస్ ట్రెయినింగ్ మాడ్యూల్స్ వచ్చాయి. వీటి సాయంతో అచ్చంగా ఆ వ్యక్తి మాట్లాడుతున్నట్లే వీడియోలను వేగంగా తయారుచేయవచ్చు.
- భారతీయ ఎన్నికలపై అనేక దేశాలకు ఆసక్తి ఉండొచ్చు. ఏఐ సాయంతో మన ఎన్నికలను అవి ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మంచికీ వాడొచ్చు..
ఎన్నికల్లో విచ్ఛిన్నకర అంశాలకే కాకుండా మంచి విషయాలకూ ఏఐని వాడొచ్చు. ఓటర్లకు చేసే ‘పర్సనలైజ్డ్ ఇంటరాక్టివ్ ఫోన్కాల్స్’ వంటివి ఆసక్తికరమైన నూతన ఆవిష్కరణలు. వాటితో ఎన్నికల ప్రక్రియకు ముప్పు ఉండదు. ఇలాంటి వన్-టు-వన్ కాల్స్ భారత్లో ఇంకా వాస్తవ రూపం దాల్చలేదు. అయితే.. వ్యక్తిగతంగా ఓటర్ల పేర్లను ప్రస్తావిస్తూ అభ్యర్థి స్వరంతో ప్రీ రికార్డెడ్ సందేశాలను రాజస్థాన్లో కాంగ్రెస్, దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీలు ఉపయోగించాయి. వీటితో ఇబ్బంది లేదు.
- ఒక నేత చేసే ప్రసంగాన్ని అప్పటికప్పుడు ఇతర భాషల్లోకి తర్జుమా చేసే పనులకూ ఏఐని ఉపయోగించుకోవచ్చు.
- దివంగత నేతలను ప్రచారంలోకి దించొచ్చు. తమ పార్టీలకు అనుకూలంగా వారు ఓట్లను అడుగుతున్న వీడియోలను రూపొందించొచ్చు. దివంగత నేత కరుణానిధి.. పార్టీ నేతలకు సూచనలు చేస్తున్న వీడియోలు ఇటీవల వెలువడ్డాయి.
ప్రభుత్వం, ఈసీ ఏం చేస్తున్నాయి?
- నకిలీ వార్తలు, దుష్ప్రచారాన్ని గుర్తించడానికి, వేగంగా స్పందించడానికి ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రామాణిక నిర్వహణ విధానాల (ఎస్వోపీ)ను జారీ చేసింది.
- ఎన్నికల సమయంలో ఏఐతో పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ‘ఇండియన్ సైబర్క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ)ని నోడల్ సంస్థగా నియమించింది. ఆన్లైన్లో అభ్యంతరకర కంటెంట్ను తొలగించడం దీని ఉద్దేశం.
- రాష్ట్ర పోలీసు శాఖలోని సైబర్ క్రైమ్ విభాగాలు కూడా ఆన్లైన్లో ‘గస్తీ తిరుగుతూ’ నకిలీ వార్తలు, అభ్యంతరకర కంటెంట్ను గుర్తిస్తుంటాయి.
- సత్వర చర్యల కోసం అన్ని జిల్లాల్లో సైబర్ సెల్స్ సమన్వయంతో సామాజిక మాధ్యమ సెల్స్ను ఏర్పాటు చేసినట్లు ఈసీ అధికారులు చెబుతున్నారు. ఎన్నికల సంఘానికి చెందిన ‘మీడియా సర్టిఫికేషన్ అండ్ మోనిటరింగ్ కమిటీ’ కూడా సామాజిక మాధ్యమాలపై గట్టి నిఘా పెట్టినట్లు వివరిస్తున్నారు.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. -
92 వేల అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. -
నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్
కార్గిల్ 25వ విజయ్ దివస్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులర్పించనున్నారు. -
గూగుల్ మ్యాప్స్లో సరికొత్త ఫీచర్లు
భారతీయ వినియోగదారులను మరింతగా ఆకర్షించేలా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ మ్యాప్స్ ప్రకటించింది. -
ఇద్దరు ఝార్ఖండ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఝార్ఖండ్ శాసనసభ స్పీకర్ ట్రైబ్యునల్ గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు (7)
తిహాడ్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడంపై ‘ఇండియా’ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. -
మహారాష్ట్ర, హిమాచల్లలో కుంభవృష్టి
హిమాచల్, మహారాష్ట్రల్లో కుండపోత వర్షాలు కురిసి జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ముంబయిలో 9 గంటల వ్యవధిలో 100 మి.మీ. పైగా వాన దంచికొట్టింది. -
ముమ్మాటికీ వివక్షేనన్న విపక్షం
కేంద్ర బడ్జెట్లో ఒకటిరెండు రాష్ట్రాలకు తప్పిస్తే మిగిలినవాటికి అన్యాయం జరిగిందని విపక్ష సభ్యులు మరోసారి గట్టిగా గళం వినిపించడంతో గురువారం పార్లమెంటు ఉభయసభలు దాదాపు స్తంభించిపోయాయి. -
ట్రంకు పెట్టెల బదులు ట్రాలీ బ్యాగులు
లోకోపైలట్లు, గార్డులు ఇకపై తమ వ్యక్తిగత వస్తువుల్ని, విధి నిర్వహణకు అవసరమైన సామగ్రిని ఇనుప ట్రంకు పెట్టెల్లో కాకుండా ట్రాలీ బ్యాగుల్లో తీసుకువెళ్లాల్సి ఉంటుంది. -
ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0
జమ్ముకశ్మీర్లో ఉగ్ర చర్యలకు పాల్పడుతున్న 55 మంది ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0’ను ప్రారంభించింది. -
భారీ వర్షాలు.. ముంబయిలో రెడ్ అలర్ట్
మహారాష్ట్రలోని ముంబయిలోనూ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
-
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
-
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
-
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్