‘నోటా..’ కొరగాని తూటా
దేశంలో ప్రతి ఎన్నికకు ఎవ్వరికీ ఉపయోగపడని నోటా ఓట్లు పెరిగిపోతున్నాయి. ఇలాంటివి 2014 లోక్సభ ఎన్నికల్లో 60,00,197 నమోదు కాగా, 2019లో 65,22,772కి చేరాయి.
కోరల్లేని పాములా ‘నన్ ఆఫ్ ద ఎబౌ’ విధానం
నిష్ప్రయోజనకరంగా సుప్రీం తీర్పు.. ఈసీ ప్రయత్నం
క్రిమినల్ కేసులున్న ఎంపీల నిష్పత్తి పెరుగుదల
ఈనాడు, దిల్లీ: దేశంలో ప్రతి ఎన్నికకు ఎవ్వరికీ ఉపయోగపడని నోటా ఓట్లు పెరిగిపోతున్నాయి. ఇలాంటివి 2014 లోక్సభ ఎన్నికల్లో 60,00,197 నమోదు కాగా, 2019లో 65,22,772కి చేరాయి. మొత్తం పోలయిన ఓట్లలో వీటి శాతం తక్కువగా ఉన్నప్పటికీ సంఖ్యాపరంగా భారీగానే ఉన్నాయి. నన్ ఆఫ్ ద ఎబౌ (నోటా) పేరుతో ఈ విధానం 2013లో సుప్రీంకోర్టు తీర్పుతో అమల్లోకి వచ్చింది. అయితే ఇది కోరల్లేని పాములా తయారైందని, రాజకీయవ్యవస్థపై ఇది ఎలాంటి ప్రభావం చూపడంలేదన్న అభిప్రాయం ఉంది. మచ్చపడ్డ అభ్యర్థులను రాజకీయపార్టీలు దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో నోటాను ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు 2013లో ఇచ్చిన తీర్పులో ఆదేశించింది. రంగంలో ఉన్న అభ్యర్థులపై ఇష్టంలేని ఓటర్లు పైవారందర్నీ తిరస్కరించే విధంగా బ్యాలెట్ పేపర్లు, ఈవీఎంలలో చిట్టచివరన నోటా ఆప్షన్ను పొందుపరచాలని భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)ను ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పునకు ముందు అభ్యర్థులకు ఓటేయడానికి ఇష్టంలేని ఓటర్లు 49-ఓ ఫామ్ను భర్తీచేసి ఇవ్వడానికి అవకాశం ఉండేది. ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961 ప్రకారం రూల్ 49-ఓ కింద పోలింగ్స్టేషన్లో ఇలా ఫామ్ భర్తీచేసి ఇవ్వడం అన్నది వ్యక్తిగత గోప్యతకు భంగం కల్గించే విధంగా ఉన్నట్లు భావించి సుప్రీం కోర్టు నోటాను ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ఓటరు ప్రస్తుత వ్యవస్థ, అభ్యర్థులమీదున్న వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి ఈ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ అదేమీ పెద్ద ప్రభావం చూపలేదని నిపుణులు చెబుతున్నారు. 2009లో ఎన్నికైన ఎంపీల్లో క్రిమినల్ కేసులున్నవారి నిష్పత్తి 30% ఉండగా, 2019 నాటికి అది 43%కి పెరిగినట్లు ఏడీఆర్ వెల్లడించింది. నేర, అవినీతి నేపథ్యం ఉన్న అభ్యర్థులను తిరస్కరించేందుకు ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ దానివల్ల పెద్ద ప్రభావం చూపలేదని గణాంకాలు చెబుతున్నాయి. వీటి సరళిని చూస్తే ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా లేదు. దేశంలో అత్యధికమంది ఓటర్లు ఉత్తర్ప్రదేశ్లో ఉన్నప్పటికీ నోటా ఓట్లు మాత్రం బిహార్లో అధికంగా నమోదయ్యాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఆరోస్థానం, తెలంగాణ 13వ స్థానంలో నిలిచాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిగ్నల్కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం
రైలు సిగ్నల్ లైట్లకు బురద రాసి రెండు రైళ్లలో దోపిడీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఉత్తరాఖండ్లోని లక్సర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. -
నాలుగేళ్లలో అరకోటి వృక్షాలు మాయం
‘వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయ’ని పెద్దల నానుడి! పచ్చని చెట్లు పర్యావరణానికే కాదు మనిషి మనుగడకు, ఆరోగ్యకరమైన జీవనానికీ ఎంతో అవసరమని ఇటీవలి పర్యవసానాలు మనకు తెలియజేస్తున్నాయి. -
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపణల నేపథ్యంలో.. శనివారం మరికొన్ని వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం కేజ్రీవాల్ నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు వాటిలో కనిపిస్తోంది. -
తనకు బదులు మరొకరిని వైద్య పరీక్షలకు పంపి..
బెయిలు పొడిగింపు పొందేందుకు అవసరమైన వైద్య పరీక్షల కోసం ఓ నిందితుడు తనకు బదులు మరో వ్యక్తిని ఆసుపత్రికి పంపించాడు. చివరి నిమిషంలో ఈడీ అధికారులు అసలు సంగతిని గుర్తించడంతో చివరకు మళ్లీ జైలుకు వెళ్లాడు. -
సభలో అనారోగ్యంతో కుప్పకూలిన వ్యక్తి.. ప్రసంగాన్ని ఆపి చికిత్సకు ఆదేశించిన మమత
పశ్చిమ బెంగాల్లోని బంకుర జిల్లాలో శనివారం నిర్వహించిన ఎన్నికల సభలో టీఎంసీ ఛైర్పర్సన్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కుప్పకూలిపోయారు. -
దేవాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి
యువతలో ఆధ్యాత్మిక భావం పెంపొందాలంటే దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ సూచించారు. -
సంక్షిప్త వార్తలు (4)
ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా శనివారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. కంటి శస్త్ర చికిత్స కోసం లండన్ వెళ్లిన చడ్డా పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. -
సంపద అంటే డబ్బు ఒక్కటే కాదు
సంపదలో నాలుగు రకాలు. ఆర్థికం: మన అవసరాలను తీర్చుకొనే వెసులుబాటు కల్పించేది. సామాజికం: గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేది. -
అమ్మాయి చదువు ఇంటికి వెలుగు
ఆ కుటుంబానికి ఏళ్లుగా రాత్రిపూట కొవ్వొత్తులే దిక్కు. ఆ వెలుతురులోనే వారి కుమార్తె చదువుకుంది. ఎక్కువ మార్కులు సాధించడంతో అధికారులు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. -
‘4.24 లక్షల ఫిర్యాదులు’
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ యాప్నకు రెండు నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాంవద్ద శనివారం రాత్రి పర్యాటకుల క్యాంప్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాజస్థాన్కు చెందిన జంట గాయపడ్డారు. -
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
మరో ఆరు నెలల్లో పీవోకే భారత్లో విలీనమవడం ఖాయమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. కానీ, మూడోసారి కూడా ప్రధానిగా మోదీ ఎన్నికైతేనే అది సాధ్యమవుతుందని అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!
-
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
-
ఏపీ ఎన్నికల్లో విజయంపై రూ.1.75 కోట్ల పందెం
-
పెట్టుబడి అంటే పట్టుబడినట్టే.. లాభాల పేరుతో సైబర్ నేరగాళ్ల దందా