ఈ లోక్సభ ఎన్నికలు రిగ్గింగ్ లాంటివే!
భారత ప్రజాస్వామ్యం ప్రస్తుతం సంక్షోభంలో పయనిస్తోందని ప్రముఖ ఆర్థిక వేత్త (డెవలప్మెంట్ ఎకనామిస్ట్) జీన్ ద్రెజ్ పేర్కొన్నారు.
భారత ప్రజాస్వామ్యం సంక్షోభంలో పయనిస్తోంది
అధికార భాజపా ప్రతిపక్షాల గొంతు నొక్కుతోంది
ప్రముఖ ఆర్థికవేత్త జీన్ ద్రెజ్
రాంచీ: భారత ప్రజాస్వామ్యం ప్రస్తుతం సంక్షోభంలో పయనిస్తోందని ప్రముఖ ఆర్థిక వేత్త (డెవలప్మెంట్ ఎకనామిస్ట్) జీన్ ద్రెజ్ పేర్కొన్నారు. ఈ సంక్షోభంలో తాజా నిరంకుశత్వ తీరు మాత్రమే కాకుండా, అధికార భాజపా ప్రతిపక్షాల గొంతును అణచివేయడం కూడా ఉందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో జరగుతున్న లోక్సభ ఎన్నికలు రిగ్గింగ్తో సమానమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం ఆయన పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడారు. 2019 ఎన్నికలను ఫెరారీకి, కొన్ని సైకిళ్లకు మధ్య పోటీ అని అరుంధతీరాయ్ వ్యాఖ్యానించిన సంగతిని గుర్తుచేశారు. ‘‘ఆ రూపకం ఇప్పటికీ చెల్లుబాటవుతుంది. ఈ రోజు సుప్రీంకోర్టు పుణ్యమా అని మనం ఫెరారీకి కార్పొరేట్ రంగం ఇంధనం సమకూర్చిన సంగతిని తెలుసుకున్నాం. అదే సమయంలో సైకిళ్లుగా పేర్కొంటున్న ఝార్ఖండ్ ముక్తి మోర్చా, రాష్ట్రీయ జనతా దళ్, కాంగ్రెస్ తదితర పార్టీలను ఓ పద్ధతి ప్రకారం లక్ష్యంగా చేసుకుంటున్నారు’’ అని చెప్పారు. ‘‘ఈ పార్టీల నేతలు ఏళ్ల తరబడి కేంద్ర సంస్థల తనిఖీలు, వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జైల్లో ఉన్నారు. లాలూ ప్రసాద్ అప్పుడప్పుడూ జైలు శిక్ష అనుభవించారు. రాహుల్ గాంధీ కొద్దిలో తప్పించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఖాతాలను స్తంభింపజేశారు. భాజపాకు ప్రమాదకరంగా కనబడుతున్న రాజకీయ నాయకులు వేధింపుల ముప్పును ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జరిగే ఎన్నికలు రిగ్గింగ్తో సమానమే’’ అని ద్రెజ్ వెల్లడించారు. ఝార్ఖండ్లో భాజపా విజయం ఖాయమా అని ప్రశ్నించగా.. కమలం పార్టీ పట్ల అసంతృప్తిగా ఉండడానికి ఆ రాష్ట్ర ప్రజలకు చాలా కారణాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ‘‘సైకిళ్లు సరిగా లేకపోవచ్చు. కానీ, ఈ సారి ఓ బృందంగా ఉన్నాయి. అదే చాలా పెద్ద మార్పును సాధించగలదు. ఝార్ఖండ్లో భాజపా మెజారిటీ స్థానాలు సాధించవచ్చు. అయితే 2019లో మాదిరిగా 14 స్థానాల్లో 11 స్థానాలను మాత్రం కైవసం చేసుకోలేదు’’ అని స్పష్టం చేశారు. బెల్జియంలో జన్మించిన జీన్ 2002లో భారత పౌరసత్వం పొందారు. మరోవైపు, ద్రెజ్ వ్యాఖ్యలపై అధికార భాజపా మండిపడింది. ప్రజాస్వామ్య విధానంలో తాము ప్రజల మద్దతును సంపాదిస్తున్నామని స్పష్టంచేసింది. తమ పాలనను నిరంకుశమైనదిగా పేర్కొనడం పూర్తిగా పక్షపాతంతో కూడినది, ఏకపక్షమని విమర్శించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
అగ్నిపథ్ పథకం దేశ సైన్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకువచ్చిన సంస్కరణ అని మోదీ(PM Modi) తెలిపారు. -
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని హెచ్చరించారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. -
92 వేల అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. -
నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్
కార్గిల్ 25వ విజయ్ దివస్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులర్పించనున్నారు. -
గూగుల్ మ్యాప్స్లో సరికొత్త ఫీచర్లు
భారతీయ వినియోగదారులను మరింతగా ఆకర్షించేలా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ మ్యాప్స్ ప్రకటించింది. -
ఇద్దరు ఝార్ఖండ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఝార్ఖండ్ శాసనసభ స్పీకర్ ట్రైబ్యునల్ గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు (7)
తిహాడ్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడంపై ‘ఇండియా’ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. -
మహారాష్ట్ర, హిమాచల్లలో కుంభవృష్టి
హిమాచల్, మహారాష్ట్రల్లో కుండపోత వర్షాలు కురిసి జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ముంబయిలో 9 గంటల వ్యవధిలో 100 మి.మీ. పైగా వాన దంచికొట్టింది. -
ముమ్మాటికీ వివక్షేనన్న విపక్షం
కేంద్ర బడ్జెట్లో ఒకటిరెండు రాష్ట్రాలకు తప్పిస్తే మిగిలినవాటికి అన్యాయం జరిగిందని విపక్ష సభ్యులు మరోసారి గట్టిగా గళం వినిపించడంతో గురువారం పార్లమెంటు ఉభయసభలు దాదాపు స్తంభించిపోయాయి. -
ట్రంకు పెట్టెల బదులు ట్రాలీ బ్యాగులు
లోకోపైలట్లు, గార్డులు ఇకపై తమ వ్యక్తిగత వస్తువుల్ని, విధి నిర్వహణకు అవసరమైన సామగ్రిని ఇనుప ట్రంకు పెట్టెల్లో కాకుండా ట్రాలీ బ్యాగుల్లో తీసుకువెళ్లాల్సి ఉంటుంది. -
ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0
జమ్ముకశ్మీర్లో ఉగ్ర చర్యలకు పాల్పడుతున్న 55 మంది ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0’ను ప్రారంభించింది. -
భారీ వర్షాలు.. ముంబయిలో రెడ్ అలర్ట్
మహారాష్ట్రలోని ముంబయిలోనూ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
-
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
-
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
-
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు