సంక్షిప్త వార్తలు(6)
అరేబియా సముద్రం పశ్చిమ ప్రాంతంలో 940 కిలోల నిషేధిత మాదకద్రవ్యాలను భారత నౌకాదళం స్వాధీనం చేసుకుంది. భారత నౌకాదళంలో మెరికల్లాంటి మార్కో కమాండోలు ‘క్రిమ్సన్ బరాకుడా’ ఆపరేషన్లో భాగంగా ఓ పడవ నుంచి గత శనివారం మాదకద్రవ్యాలను పట్టుకున్నారని నౌకాదళ ప్రతినిధి ఒకరు వివరించారు.
అరేబియా సముద్రంలో 940 కిలోల మాదకద్రవ్యాల పట్టివేత
దిల్లీ: అరేబియా సముద్రం పశ్చిమ ప్రాంతంలో 940 కిలోల నిషేధిత మాదకద్రవ్యాలను భారత నౌకాదళం స్వాధీనం చేసుకుంది. భారత నౌకాదళంలో మెరికల్లాంటి మార్కో కమాండోలు ‘క్రిమ్సన్ బరాకుడా’ ఆపరేషన్లో భాగంగా ఓ పడవ నుంచి గత శనివారం మాదకద్రవ్యాలను పట్టుకున్నారని నౌకాదళ ప్రతినిధి ఒకరు వివరించారు. కంబైన్డ్ మారిటైమ్ ఫోర్స్(సీఎమ్ఎఫ్)లో సభ్యత్వం పొందిన తర్వాత ఇలాంటి ఆపరేషన్ చేపట్టడం భారత్కు ఇదే తొలిసారి. సీఎమ్ఎఫ్లో 42 దేశాలకు చెందిన నౌకాదళాలున్నాయి. గత నవంబరులో భారత నేవీ ఇందులో సభ్యత్వం పొందింది. అతిముఖ్యమైన నౌకాయన మార్గాల్లో అంతర్జాతీయ నిబంధనలను పాటిస్తూ భద్రతను పెంచే దిశగా సీఎమ్ఎఫ్ పనిచేస్తుంది.
భారతీయ సంస్కృతికి చిహ్నంగా ‘బృందావన్ ఇస్కాన్ టవర్’
వాషింగ్టన్: ఉత్తర్ప్రదేశ్లోని బృందావన్లో ఇస్కాన్ నిర్మిస్తున్న 70 అంతస్తుల ఆకాశహర్మ్య దేవాలయం భారతీయ సంస్కృతికి చిహ్నంగా నిలుస్తుందని బెంగళూరు ఇస్కాన్ సీనియర్ ఉపాధ్యక్షుడు చంచలపతి దాస పీటీఐ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 80 మిలియన్ డాలర్ల (రూ.668 కోట్లు) వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఆలయం 210 మీటర్ల ఎత్తు ఉంటుందని, దేశ పర్యాటక రంగానికి ప్రధాన ఆకర్షణగా మారుతుందని పేర్కొన్నారు. అష్టభుజి శైలితో రూపుదిద్దుకొంటున్న ఈ ఆకాశహర్మ్యంలో మూడు వైపులా మూడు దేవాలయాలతో పాటు నాలుగో వైపు శ్రీల ప్రభుపాదుల చిహ్నంగా ఓ భవంతి ఉంటుందని తెలిపారు. పర్యాటకుల కోసం వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఏటా 2 కోట్ల మంది సందర్శకులు బృందావన్కు వస్తున్నారని, వచ్చే ఆరు నుంచి పదేళ్లలో ఉత్తర్ప్రదేశ్ పర్యాటకం ఐదు రెట్లు పెరిగి సుమారు 10 కోట్ల మంది విచ్చేస్తారని అన్నారు. ఈ ఆలయంలో అన్ని అధునాతన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, ఏకకాలంలో 3 వేల కార్లు నిలపగలిగే పార్కింగ్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. రోజుకు రెండు లక్షల మంది, ఉత్సవాల్లో అంతకంటే ఎక్కువమంది వచ్చినా ఇబ్బంది లేనివిధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
మీటర్ క్యాబిన్లో మంటలు.. ముంబయిలో 14 మందికి గాయాలు
ముంబయి: దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో మంగళవారం 8 అంతస్తుల భవనం మీటర్ క్యాబిన్లో మంటలు చెలరేగాయి. భవనంలోని వారు తప్పించుకునే క్రమంలో గాయపడ్డారు. సుందర్నగర్ ప్రాంతంలోని గిర్నార్ గెలాక్సీ భవనం ప్రవేశమార్గం మెట్ల కిందనున్న మీటర్ క్యాబిన్లో మంటలు చెలరేగాయి. పది నిమిషాల్లోపే మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ, తప్పించుకునే క్రమంలో అయిదుగురు వృద్ధులు, ఓ చిన్నారి సహా 14 మంది గాయపడ్డారు.
కేంద్ర హోంశాఖ భవనంలో చెలరేగిన మంటలు
దిల్లీ: దేశరాజధాని దిల్లీలో కేంద్ర హోంశాఖ భవనంలో మంగళవారం మంటలు చెలరేగాయి. ఉదయం 9.15 గంటల సమయంలో భవనంలºని నార్త్బ్లాక్లోని రూమ్ నెంబర్ 209లో స్వల్పంగా అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లు హోంశాఖ ప్రతినిధి వెల్లడించారు. షార్ట్సర్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ఆయన తెలిపారు. ప్రమాదంలº ఎవ్వరికీ ఎలాంటి హాని జరగలేదు. ఎటువంటి పత్రాలూ కాలిపోలేదు. మంటల తీవ్రత తక్కువగా ఉండటం వల్ల కొన్ని వస్తువులు, పరికరాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అగ్నిమాపక సిబ్బంది 20 నిమిషాల్లో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా ఘటన స్థలంలో లేరు.
జీలం నదిలో పడవ బోల్తా ఆరుగురి దుర్మరణం
శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్లోని జీలం నదిలో ఘోర ప్రమాదం సంభవించింది. పాఠశాల విద్యార్థులతో సహా వెళుతున్న ఓ పడవ మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో శ్రీనగర్ శివారులోని గాండబల్ నౌగామ్ ప్రాంతంలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో ఆరుగురిని రక్షించగా వారిలో ముగ్గురిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో పడవలో 15 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. వీరిలో ఏడుగురు మైనర్లు. పడవలో ఎంత మంది ప్రయాణిస్తున్నారనే విషయమై కచ్చితమైన సమాచారం లేదని అధికారులు తెలిపారు.
‘ఎల్ఎంవీ లైసెన్సు’ కేసుపై తదుపరి విచారణ జులై 30న
దిల్లీ: తేలికపాటి మోటారు వాహనం (ఎల్ఎంవీ) లైసెన్సు పొందిన వ్యక్తి 7,500 కేజీల బరువు మించని రహదారి వాహనం నడపొచ్చా లేదా అన్న న్యాయపరమైన ప్రశ్నపై విచారణ నిర్వహిస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తదుపరి విచారణను జులై 30కి వాయిదా వేసింది. మోటార్ వెహికల్ చట్టం-1988కి సవరణ చేసే అంశంపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ చర్చలు జరుపుతోందని, సార్వత్రిక ఎన్నికల ముగిసిన తర్వాత పార్లమెంటు ముందు సవరణ బిల్లును ప్రవేశపెడతామని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి మంగళవారం న్యాయస్థానానికి తెలిపారు. దీంతో ధర్మాసనం వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ(Gurpatwant Singh Pannun)పై జరిగిన హత్యాయత్నంలో భారత గూఢచర్య సంస్థ హస్తం ఉందంటూ యూఎస్ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. దీనిపై భారత్ ఘాటుగా స్పందించింది. -
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు
PM Modi: వెనుక నుంచి దాడి చేయడంపై తనకు నమ్మకం లేదని ప్రధాని మోదీ అన్నారు. బాలాకోట్పై దాడుల అనంతరం ముందుగా పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే యావత్ ప్రపంచానికి తెలియజేశామన్నారు. -
అలోక్ శుక్లాకు ప్రతిష్ఠాత్మక గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్
‘ఛత్తీస్గఢ్ బచావో ఆందోళన్ సమితి’ కన్వీనర్ అలోక్ శుక్లా ప్రతిష్ఠాత్మక ‘గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్’ అవార్డుకు ఎంపికయ్యారు. శుక్లా గత కొన్నేళ్లుగా పర్యావరణ పరిరక్షణకు ఉద్యమిస్తున్నారు. -
ప్రైవేటు వ్యక్తుల కోసం సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వమా?
సందేశ్ఖాలీ ఆగడాలపై దర్యాప్తు విషయంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ప్రైౖవేటు వ్యక్తుల ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఎలా ఆశ్రయిస్తుందని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం సోమవారం ప్రశ్నించింది. -
బెయిల్ కోసం విచారణ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
తన అరెస్టు, కస్టడీని సవాల్ చేస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఈ కేసులో బెయిల్ కోసం విచారణ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారా? అని సీఎం తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని ధర్మాసనం ప్రశ్నించింది. -
‘శాస్త్ర’లో యూనివర్సిటీ డే వేడుకలు
ఉన్నత విద్యాసంస్థలు విద్యార్థులను భవిష్యత్తుకు తగినట్లు తీర్చిదిద్దాలని ఏఐసీటీఈ వైస్ ఛైర్మన్ డాక్టర్ అభయ్ జెరె సూచించారు. -
ఆసుపత్రుల్లో రుసుముల నిర్ధారణపై మీ వైఖరేంటి?
ఆసుపత్రుల్లో వైద్యసేవల రుసుములను నిర్ధారించే అంశంపై సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వ స్పందన కోరింది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (సెంట్రల్ గవర్నమెంట్) రూల్స్-2012లోని 9వ నిబంధనను అమలు చేయరాదన్న పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ మేరకు పేర్కొంది. -
పత్రికాస్వేచ్ఛ అణచివేత ధోరణి తగదు
పత్రికాస్వేచ్ఛ విషయంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న అణచివేత ధోరణులు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్కు లేఖ రాసింది. -
భోజ్శాల సర్వేకు మరో 8వారాల గడువు
భోజ్శాల ఆలయం-కమల్ మౌలా మసీదు కాంప్లెక్స్పై శాస్త్రీయ సర్వే పూర్తి చేయడానికి భారత పురావస్తు విభాగాని(ఏఎస్ఐ)కి మధ్యప్రదేశ్ హైకోర్టులోని ఇందౌర్ బెంచీ మరో 8 వారాల గడువు ఇచ్చింది. -
ఇక ఏటా పాఠ్యపుస్తకాల సవరణ
దేశవ్యాప్తంగా విద్యార్థులకు పంపిణీచేసే పాఠ్యపుస్తకాల విషయంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)కి కేంద్ర విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విద్యా భత్యం పరిమితికి సవరణ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విద్యా భత్యం, హాస్టల్ రాయితీల పరిమితులను కేంద్రం సోమవారం సవరించింది. కరవు భత్యం పెరిగిన జనవరి 1, 2024 నుంచి పాటు ఈ సవరణ అమల్లోకి వచ్చింది. -
యూజీసీ నెట్ తేదీలో మార్పు
యూజీసీ నెట్ పరీక్ష తేదీ మారింది. ఈ పరీక్షను జూన్ 18న నిర్వహించనున్నట్లు యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ సోమవారం ప్రకటించారు. వాస్తవానికి దాన్ని జూన్ 16న నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. -
ఖలిస్థానీ తీవ్రవాదులను ఉపేక్షించడంపై కెనడాకు భారత్ తీవ్ర నిరసన
భారత్ వ్యతిరేక కార్యకలాపాలను బాహాటంగా నిర్వహిస్తున్న ఖలిస్థానీ వేర్పాటువాదులు, తీవ్రవాదులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వారికి సహకరిస్తున్న కెనడా తీరుపై మన విదేశీ వ్యవహారాల శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. దిల్లీలోని కెనడా డిప్యూటీ హై కమిషనర్ స్టీవార్ట్ వీలర్ను సోమవారం పిలిపించుకుని తీవ్ర నిరసన తెలిపింది. -
కేజ్రీవాల్, ఆతిశీలపై పరువు నష్టం దావా
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మంత్రి ఆతిశీలపై సోమవారం దిల్లీ కోర్టులో పరువు నష్టం దావా దాఖలైంది. వారిద్దరూ భాజపా, ఆ పార్టీ సభ్యుల గౌరవానికి భంగం కలిగిస్తున్నారంటూ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తాన్యా బామనీయాల్ ఎదుట కాషాయ పార్టీ దిల్లీ శాఖ మీడియా ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ఫిర్యాదు దాఖలు చేశారు. -
శ్రీలంక సీతమ్మగుడికి సరయూ జలాలు
శ్రీలంకలో సీతమ్మ ఆలయ ప్రాణప్రతిష్ఠకు భారత్ నుంచి సరయూనదీ జలాలు వెళుతున్నాయి. సంప్రోక్షణ కార్యక్రమంలో వినియోగించేందుకు అయోధ్యలోని సరయూ జలాలను పంపమని శ్రీలంక ప్రతినిధులు లేఖలో కోరారు. -
చంద్రయాన్-3 ప్రయోగంలో 4 సెకన్ల జాప్యం
చందమామ దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన భారత వ్యోమనౌక చంద్రయాన్-3.. ప్రయోగ సమయంలో అంతరిక్ష వ్యర్థాలను ఢీ కొట్టే పరిస్థితిని తప్పించుకోవడానికి 4 సెకన్లపాటు ఆలస్యంగా బయలుదేరింది. -
బాలిక గర్భవిచ్ఛిత్తిపై సుప్రీం ఆదేశాలు వెనక్కి
అత్యాచారానికి గురైన 14 ఏళ్ల బాలిక 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేసేందుకు అనుమతిస్తూ ఈ నెల 22న జారీచేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం మధ్యాహ్నం సీజేఐ ఛాంబర్లో విచారణ జరిపి ఈ నిర్ణయం తీసుకుంది. -
నీట్-పీజీ ఇంటర్న్షిప్ కటాఫ్ పొడిగింపు సాధ్యంకాదు: సుప్రీం
ఈ ఏడాది జూన్ 23న జరిగే నీట్-పీజీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల ఇంటర్న్షిప్ కటాఫ్ను పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారణకు తీసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. -
కొలీజియం రద్దుకు పిటిషన్.. లిస్టింగ్పై పరిశీలనకు సుప్రీం నిరాకరణ
ఉన్నత న్యాయవ్యవస్థలో జడ్జీల నియామకం కోసం అమలవుతున్న కొలీజియం విధానం రద్దుకు దాఖలైన పిటిషన్ను లిస్టింగ్ చేసే అంశాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. మాథ్యూస్ నెడుంపారా అనే న్యాయవాది దీన్ని దాఖలుచేశారు. -
సీఏ పరీక్షల వాయిదాకు ‘పిల్’
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. మే నెలలో జరగాల్సిన చార్టర్డ్ ఎకౌంటెన్సీకి సంబంధించిన కొన్ని పరీక్షలను వాయిదా వేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యా (పిల్)న్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. -
దేవుళ్లు, ఆలయాల పేరుతో ఓట్లు.. మోదీపై పిటిషన్
దేవుళ్లు, ఆలయాల పేరుతో ప్రధాని మోదీ ఓట్లు అడుగుతున్నారని, ఎన్నికల్లో పోటీచేయకుండా ఆయనపై ఆరేళ్ల నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సోమవారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
తాజా వార్తలు (Latest News)
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్