సంక్షిప్త వార్తలు(6)
అరేబియా సముద్రం పశ్చిమ ప్రాంతంలో 940 కిలోల నిషేధిత మాదకద్రవ్యాలను భారత నౌకాదళం స్వాధీనం చేసుకుంది. భారత నౌకాదళంలో మెరికల్లాంటి మార్కో కమాండోలు ‘క్రిమ్సన్ బరాకుడా’ ఆపరేషన్లో భాగంగా ఓ పడవ నుంచి గత శనివారం మాదకద్రవ్యాలను పట్టుకున్నారని నౌకాదళ ప్రతినిధి ఒకరు వివరించారు.
అరేబియా సముద్రంలో 940 కిలోల మాదకద్రవ్యాల పట్టివేత
దిల్లీ: అరేబియా సముద్రం పశ్చిమ ప్రాంతంలో 940 కిలోల నిషేధిత మాదకద్రవ్యాలను భారత నౌకాదళం స్వాధీనం చేసుకుంది. భారత నౌకాదళంలో మెరికల్లాంటి మార్కో కమాండోలు ‘క్రిమ్సన్ బరాకుడా’ ఆపరేషన్లో భాగంగా ఓ పడవ నుంచి గత శనివారం మాదకద్రవ్యాలను పట్టుకున్నారని నౌకాదళ ప్రతినిధి ఒకరు వివరించారు. కంబైన్డ్ మారిటైమ్ ఫోర్స్(సీఎమ్ఎఫ్)లో సభ్యత్వం పొందిన తర్వాత ఇలాంటి ఆపరేషన్ చేపట్టడం భారత్కు ఇదే తొలిసారి. సీఎమ్ఎఫ్లో 42 దేశాలకు చెందిన నౌకాదళాలున్నాయి. గత నవంబరులో భారత నేవీ ఇందులో సభ్యత్వం పొందింది. అతిముఖ్యమైన నౌకాయన మార్గాల్లో అంతర్జాతీయ నిబంధనలను పాటిస్తూ భద్రతను పెంచే దిశగా సీఎమ్ఎఫ్ పనిచేస్తుంది.
భారతీయ సంస్కృతికి చిహ్నంగా ‘బృందావన్ ఇస్కాన్ టవర్’
వాషింగ్టన్: ఉత్తర్ప్రదేశ్లోని బృందావన్లో ఇస్కాన్ నిర్మిస్తున్న 70 అంతస్తుల ఆకాశహర్మ్య దేవాలయం భారతీయ సంస్కృతికి చిహ్నంగా నిలుస్తుందని బెంగళూరు ఇస్కాన్ సీనియర్ ఉపాధ్యక్షుడు చంచలపతి దాస పీటీఐ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 80 మిలియన్ డాలర్ల (రూ.668 కోట్లు) వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఆలయం 210 మీటర్ల ఎత్తు ఉంటుందని, దేశ పర్యాటక రంగానికి ప్రధాన ఆకర్షణగా మారుతుందని పేర్కొన్నారు. అష్టభుజి శైలితో రూపుదిద్దుకొంటున్న ఈ ఆకాశహర్మ్యంలో మూడు వైపులా మూడు దేవాలయాలతో పాటు నాలుగో వైపు శ్రీల ప్రభుపాదుల చిహ్నంగా ఓ భవంతి ఉంటుందని తెలిపారు. పర్యాటకుల కోసం వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఏటా 2 కోట్ల మంది సందర్శకులు బృందావన్కు వస్తున్నారని, వచ్చే ఆరు నుంచి పదేళ్లలో ఉత్తర్ప్రదేశ్ పర్యాటకం ఐదు రెట్లు పెరిగి సుమారు 10 కోట్ల మంది విచ్చేస్తారని అన్నారు. ఈ ఆలయంలో అన్ని అధునాతన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, ఏకకాలంలో 3 వేల కార్లు నిలపగలిగే పార్కింగ్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. రోజుకు రెండు లక్షల మంది, ఉత్సవాల్లో అంతకంటే ఎక్కువమంది వచ్చినా ఇబ్బంది లేనివిధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
మీటర్ క్యాబిన్లో మంటలు.. ముంబయిలో 14 మందికి గాయాలు
ముంబయి: దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో మంగళవారం 8 అంతస్తుల భవనం మీటర్ క్యాబిన్లో మంటలు చెలరేగాయి. భవనంలోని వారు తప్పించుకునే క్రమంలో గాయపడ్డారు. సుందర్నగర్ ప్రాంతంలోని గిర్నార్ గెలాక్సీ భవనం ప్రవేశమార్గం మెట్ల కిందనున్న మీటర్ క్యాబిన్లో మంటలు చెలరేగాయి. పది నిమిషాల్లోపే మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ, తప్పించుకునే క్రమంలో అయిదుగురు వృద్ధులు, ఓ చిన్నారి సహా 14 మంది గాయపడ్డారు.
కేంద్ర హోంశాఖ భవనంలో చెలరేగిన మంటలు
దిల్లీ: దేశరాజధాని దిల్లీలో కేంద్ర హోంశాఖ భవనంలో మంగళవారం మంటలు చెలరేగాయి. ఉదయం 9.15 గంటల సమయంలో భవనంలºని నార్త్బ్లాక్లోని రూమ్ నెంబర్ 209లో స్వల్పంగా అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లు హోంశాఖ ప్రతినిధి వెల్లడించారు. షార్ట్సర్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ఆయన తెలిపారు. ప్రమాదంలº ఎవ్వరికీ ఎలాంటి హాని జరగలేదు. ఎటువంటి పత్రాలూ కాలిపోలేదు. మంటల తీవ్రత తక్కువగా ఉండటం వల్ల కొన్ని వస్తువులు, పరికరాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అగ్నిమాపక సిబ్బంది 20 నిమిషాల్లో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా ఘటన స్థలంలో లేరు.
జీలం నదిలో పడవ బోల్తా ఆరుగురి దుర్మరణం
శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్లోని జీలం నదిలో ఘోర ప్రమాదం సంభవించింది. పాఠశాల విద్యార్థులతో సహా వెళుతున్న ఓ పడవ మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో శ్రీనగర్ శివారులోని గాండబల్ నౌగామ్ ప్రాంతంలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో ఆరుగురిని రక్షించగా వారిలో ముగ్గురిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో పడవలో 15 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. వీరిలో ఏడుగురు మైనర్లు. పడవలో ఎంత మంది ప్రయాణిస్తున్నారనే విషయమై కచ్చితమైన సమాచారం లేదని అధికారులు తెలిపారు.
‘ఎల్ఎంవీ లైసెన్సు’ కేసుపై తదుపరి విచారణ జులై 30న
దిల్లీ: తేలికపాటి మోటారు వాహనం (ఎల్ఎంవీ) లైసెన్సు పొందిన వ్యక్తి 7,500 కేజీల బరువు మించని రహదారి వాహనం నడపొచ్చా లేదా అన్న న్యాయపరమైన ప్రశ్నపై విచారణ నిర్వహిస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తదుపరి విచారణను జులై 30కి వాయిదా వేసింది. మోటార్ వెహికల్ చట్టం-1988కి సవరణ చేసే అంశంపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ చర్చలు జరుపుతోందని, సార్వత్రిక ఎన్నికల ముగిసిన తర్వాత పార్లమెంటు ముందు సవరణ బిల్లును ప్రవేశపెడతామని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి మంగళవారం న్యాయస్థానానికి తెలిపారు. దీంతో ధర్మాసనం వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. -
92 వేల అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. -
నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్
కార్గిల్ 25వ విజయ్ దివస్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులర్పించనున్నారు. -
గూగుల్ మ్యాప్స్లో సరికొత్త ఫీచర్లు
భారతీయ వినియోగదారులను మరింతగా ఆకర్షించేలా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ మ్యాప్స్ ప్రకటించింది. -
ఇద్దరు ఝార్ఖండ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఝార్ఖండ్ శాసనసభ స్పీకర్ ట్రైబ్యునల్ గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు (7)
తిహాడ్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడంపై ‘ఇండియా’ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. -
మహారాష్ట్ర, హిమాచల్లలో కుంభవృష్టి
హిమాచల్, మహారాష్ట్రల్లో కుండపోత వర్షాలు కురిసి జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ముంబయిలో 9 గంటల వ్యవధిలో 100 మి.మీ. పైగా వాన దంచికొట్టింది. -
ముమ్మాటికీ వివక్షేనన్న విపక్షం
కేంద్ర బడ్జెట్లో ఒకటిరెండు రాష్ట్రాలకు తప్పిస్తే మిగిలినవాటికి అన్యాయం జరిగిందని విపక్ష సభ్యులు మరోసారి గట్టిగా గళం వినిపించడంతో గురువారం పార్లమెంటు ఉభయసభలు దాదాపు స్తంభించిపోయాయి. -
ట్రంకు పెట్టెల బదులు ట్రాలీ బ్యాగులు
లోకోపైలట్లు, గార్డులు ఇకపై తమ వ్యక్తిగత వస్తువుల్ని, విధి నిర్వహణకు అవసరమైన సామగ్రిని ఇనుప ట్రంకు పెట్టెల్లో కాకుండా ట్రాలీ బ్యాగుల్లో తీసుకువెళ్లాల్సి ఉంటుంది. -
ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0
జమ్ముకశ్మీర్లో ఉగ్ర చర్యలకు పాల్పడుతున్న 55 మంది ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0’ను ప్రారంభించింది. -
భారీ వర్షాలు.. ముంబయిలో రెడ్ అలర్ట్
మహారాష్ట్రలోని ముంబయిలోనూ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.