2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
పన్నెండేళ్ల తర్వాత సుప్రీంకోర్టుకు కేంద్రం విజ్ఞప్తి
దిల్లీ: వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్దీవాలా ధర్మాసనం ముందు సోమవారం ఈ విషయాన్ని కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి ప్రస్తావించారు. వెంటనే విచారణ జాబితాలో చేర్చాలని అభ్యర్థించారు. కేంద్ర టెలికం మంత్రిగా ఎ.రాజా ఉన్న సమయం(2008)లో వివిధ సంస్థలకు మంజూరైన 2జీ స్పెక్ట్రమ్ లైసెన్సులను రద్దు చేస్తూ 2012 ఫిబ్రవరి 2న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వివక్షకు తావులేకుండా పారదర్శకంగా వేలం ద్వారా మాత్రమే వాటిని కేటాయించాలని స్పష్టం చేసింది. ఆ తీర్పు వచ్చిన 12 ఏళ్ల తర్వాత దానిలో మార్పులు చేయాలని కేంద్రం కోరడం గమనార్హం. ఈ విజ్ఞప్తిని అనుమతించరాదంటూ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అభ్యంతరం తెలిపారు. దేశ సహజ వనరులు దుర్వినియోగం కాకుండా ఇచ్చిన ఆ తీర్పును సవరించడం తగదని పేర్కొన్నారు. గతంలోనూ ఆయన 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులను సవాల్ చేసిన సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే సంస్థ తరఫున వాదించారు. అయితే, తీర్పు సమీక్ష అభ్యర్థనను ఈమెయిల్ ద్వారా పంపిస్తే తాము పరిశీలిస్తామని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణికి సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ సూచించారు. కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా, మరో 16 మందిని 2జీ స్పెక్ట్రమ్ కేసులో నిర్దోషులుగా ప్రత్యేక కోర్టు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ 2018లో వేసిన పిటిషన్ను ఈ ఏడాది మార్చిలో దిల్లీ హైకోర్టు అనుమతించింది. 2017 డిసెంబరు 21న ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి తదితరులను ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పులో కొన్ని లోపాలున్నాయని దిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది.
న్యాయవాది నమోదు రుసుము రూ.600లకు మించకూడదు
దేశవ్యాప్తంగా న్యాయ విద్యను పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లను న్యాయవాదులుగా నమోదు చేయడానికి రూ.600 కంటే ఎక్కువ రుసుము వసూలు చేయకూడదంటూ సోమవారం సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ మొత్తాన్ని చట్ట సవరణ ద్వారా పార్లమెంటు మాత్రమే పెంచగలదని పేర్కొంది. దేశంలో న్యాయవాదులుగా నమోదు చేసుకోవడానికి రాష్ట్ర బార్ సంస్థలు అధిక రుసుమును వసూలు చేస్తున్నాయంటూ 10కి పైగా నమోదయిన పిటిషన్లపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం విచారించింది. అధిక నమోదు రుసుములు చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని, దీనిపై వెంటనే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) స్పందించాలని న్యాయస్థానం ఆదేశింది. గ్రాడ్యుయేట్లను న్యాయవాదులుగా నమోదు చేయడానికి ఒడిశాలో రూ.42,100, గుజరాత్లో రూ.25వేలు, ఉత్తరాఖండ్లో రూ.23,650, ఝార్ఖండ్లో రూ.21,460, కేరళలో రూ.20,050 వసూలు చేస్తున్నారంటూ పిటిషనర్లు తమ అభ్యర్థనల్లో పేర్కొన్నారు. ‘‘మనం రూ.15,000 రుసుము పై మాత్రమే మాట్లాడుతున్నాం. కానీ, క్యాన్సర్ లేదా మూత్రపిండాల వ్యాధితో బాధపడే న్యాయవాదులకు రూ.25,000 చొప్పున చెల్లిస్తున్నాం’’ అని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఛైర్పర్సన్ మనన్కుమార్ మిశ్ర న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
దివ్యాంగ చిన్నారి తల్లికి సెలవు నిరాకరణ
రాజ్యాంగ విధుల ధిక్కరణే
దివ్యాంగ చిన్నారి తల్లికి శిశు సంరక్షణ సెలవులను నిరాకరించడం శ్రామికశక్తిలో మహిళా భాగస్వామ్యానికి సమాన ప్రాతినిధ్యం కల్పించాలన్న రాజ్యాంగ విధి ధిక్కరణేనని సోమవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దివ్యాంగులైన చిన్నారులు గల ఉద్యోగినులకు శిశుసంరక్షణ సెలవులు కల్పించే అంశంపై విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. ‘‘శ్రామిక శక్తిలో మహిళలకు భాగస్వామ్యం ప్రత్యేక హక్కు కాదు..అది రాజ్యాంగపరమైన విధి. ఆదర్శ యజమానిగా రాజ్యం దానిని విస్మరించరాదు’’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో కేంద్రాన్ని భాగస్వామిని చేయాలని, తీర్పు ఇవ్వడంలో అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి సహకారాన్ని తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్ర జియోగ్రఫీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వ్యవహరిస్తున్న పిటిషన్దారైన మహిళకు జన్యుపరమై లోపంతో గల తన కుమారుడి బాగోగులు చూసుకునేందుకు ఆమెకు శిశు సంరక్షణ సెలవులు మంజూరు చేసే అంశాన్ని పరిశీలించాలని పేర్కొంది. ఆ బాలుడికి పుట్టినప్పటి నుంచి పలుమార్లు శస్త్రచికిత్సలు నిర్వహించిన కారణంగా నిబంధనల పరంగా ఆమెకు మంజూరు చేసిన సెలవుల కోటా పూర్తైపోయింది. ఈ నేపథ్యంలో ఆమె కోర్టునాశ్రయించారు.
తాజ్మహల్ సంరక్షణ ప్రణాళికలపై మీ అభిప్రాయం తెలపండి
- పురావస్తు శాఖకు సుప్రీం ఆదేశం
దిల్లీ: చారిత్రక కట్టడం తాజ్మహల్, దాని పరిసరాల పరిరక్షణకు సంబంధించిన దార్శనిక పత్రం, ప్రణాళికలను పరిశీలించి అభిప్రాయం తెలపాలని భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్(ఎస్పీయే) ద్వారా ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం వీటిని రూపొందించింది. దార్శనిక పత్రం, ప్రణాళికలను అధికారికంగా నమోదు చేయాలని యూపీ సర్కారుకు జస్టిస్ అభయ్ ఎస్.ఓక్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం సూచించింది. తాజ్మహల్ పరిరక్షణ కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం సోమవారం ఈ ఆదేశాలిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. -
92 వేల అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. -
నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్
కార్గిల్ 25వ విజయ్ దివస్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులర్పించనున్నారు. -
గూగుల్ మ్యాప్స్లో సరికొత్త ఫీచర్లు
భారతీయ వినియోగదారులను మరింతగా ఆకర్షించేలా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ మ్యాప్స్ ప్రకటించింది. -
ఇద్దరు ఝార్ఖండ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఝార్ఖండ్ శాసనసభ స్పీకర్ ట్రైబ్యునల్ గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు (7)
తిహాడ్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడంపై ‘ఇండియా’ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. -
మహారాష్ట్ర, హిమాచల్లలో కుంభవృష్టి
హిమాచల్, మహారాష్ట్రల్లో కుండపోత వర్షాలు కురిసి జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ముంబయిలో 9 గంటల వ్యవధిలో 100 మి.మీ. పైగా వాన దంచికొట్టింది. -
ముమ్మాటికీ వివక్షేనన్న విపక్షం
కేంద్ర బడ్జెట్లో ఒకటిరెండు రాష్ట్రాలకు తప్పిస్తే మిగిలినవాటికి అన్యాయం జరిగిందని విపక్ష సభ్యులు మరోసారి గట్టిగా గళం వినిపించడంతో గురువారం పార్లమెంటు ఉభయసభలు దాదాపు స్తంభించిపోయాయి. -
ట్రంకు పెట్టెల బదులు ట్రాలీ బ్యాగులు
లోకోపైలట్లు, గార్డులు ఇకపై తమ వ్యక్తిగత వస్తువుల్ని, విధి నిర్వహణకు అవసరమైన సామగ్రిని ఇనుప ట్రంకు పెట్టెల్లో కాకుండా ట్రాలీ బ్యాగుల్లో తీసుకువెళ్లాల్సి ఉంటుంది. -
ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0
జమ్ముకశ్మీర్లో ఉగ్ర చర్యలకు పాల్పడుతున్న 55 మంది ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0’ను ప్రారంభించింది. -
భారీ వర్షాలు.. ముంబయిలో రెడ్ అలర్ట్
మహారాష్ట్రలోని ముంబయిలోనూ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి
-
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
-
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
-
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM