న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు.
ప్రధానికి ఎస్సీబీఏ అధ్యక్షుడి లేఖ
దిల్లీ: న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) అధ్యక్షుడు కూడా అయిన ఆయన వ్యక్తిగత హోదాలో ఈ లేఖ రాసినట్లు స్పష్టంచేశారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు రోజురోజుకు పెరుగుతున్న ముప్పునకు అడ్డుకట్ట వేయాలని లేఖలో అభ్యర్థించినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు నుంచి జిల్లా కోర్టుల వరకు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును మూడేళ్ల మేర పెంచాలని, ట్రైబ్యునళ్లు, కమిషన్లలో విశ్రాంత న్యాయమూర్తులకు బదులు సిట్టింగ్ న్యాయమూర్తులనే నియమించేలా చట్టాలకు సవరణ చేయాలని కూడా ఆయన ప్రధానిని కోరారు. 2008 నుంచి 2011 మధ్య సుప్రీంకోర్టు నుంచి పదవీ విరమణ చేసిన 21 న్యాయమూర్తుల్లో 18 మంది వివిధ కమిషన్లు, ట్రైబ్యునళ్లలో నియమితులయ్యారని లేఖలో ఆదీశ్ సి.అగర్వాలా ప్రస్తావించారు. ‘‘ఈ వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం రూపొందించకపోయినప్పటికీ.. గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాలను అనుసరించి చర్యలు చేపడుతోంది. కాబట్టి ఆ చట్టాల్లో అర్హతను విశ్రాంత న్యాయమూర్తులు నుంచి సిట్టింగ్ జడ్జీలు లేదా ప్రాక్టీసు చేస్తున్న న్యాయవాదులుగా మార్పుచేస్తూ సవరణ చేయాల్సిన అవసరముంది’’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..