రాజ్యాంగ ధర్మాసనం తీర్పే గీటురాయి
వివిధ వ్యాజ్యాలకు సంబంధించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు వెలువరించే తీర్పులే అంతిమ నిర్ణయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
తక్కువ సభ్యులున్న ధర్మాసనాలకు అది శిరోధార్యం
సుప్రీంకోర్టు స్పష్టీకరణ
దిల్లీ: వివిధ వ్యాజ్యాలకు సంబంధించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు వెలువరించే తీర్పులే అంతిమ నిర్ణయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతకన్నా తక్కువ మంది సభ్యులతో ఏర్పడే ధర్మాసనాలకు రాజ్యాంగ ధర్మాసనం తీర్పులు గీటురాయిగా నిలుస్తాయని తెలిపింది. హరియాణాలోని ఒక గ్రామ ప్రజల ఉమ్మడి భూమికి సంబంధించి 2022 ఏప్రిల్ 7న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉపసంహరిస్తూ జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం గురువారం ఈ విషయం వెల్లడించింది. 1966లో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన భగత్రామ్ తీర్పునకు అనుగుణంగా పంజాబ్, హరియాణా హైకోర్టు పూర్తిస్థాయి ధర్మాసనం.... హరియాణా గ్రామీణ ఉమ్మడి భూముల(నియంత్రణ) చట్టం-1961లోని ఉపవిభాగం 6లోని సెక్షన్ 2(జి) చట్టబద్దతను పరిశీలించి తీర్పు వెలువరించింది. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు కాగా ద్విసభ్య ధర్మాసనం... రాజ్యాంగ ధర్మాసనం(భగత్రామ్) తీర్పునకు భిన్నమైన అభిప్రాయంతో 2022 ఏప్రిల్లో ఉత్తర్వు జారీ చేసింది. రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ద్విసభ్య ధర్మాసనం పట్టించుకోకపోగా దానికి విరుద్ధమైన నిర్ణయాన్ని వెలువరించడాన్ని జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం తప్పుపట్టింది. 2022 ఏప్రిల్ 7నాటి ద్విసభ్య ధర్మాసనం తీర్పును ఉపసంహరించడంతో పాటు ఆ తీర్పును సవాల్ చేసిన పిటిషన్ను విచారణకు అనుమతించింది. తదుపరి విచారణను ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంచనాల కంటే ముందే వర్షాలు!
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని గురువారం ప్రకటించిన భారత వాతావరణ శాఖ.. అనుకున్న తేదీ కన్నా ముందే పలు ప్రాంతాల్లోకి ఇవి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయని తాజాగా వెల్లడించింది. -
నడక.. జపం.. ధ్యానం
తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం కొనసాగిస్తున్నారు. రెండోరోజు కార్యక్రమ వీడియోలను భాజపా విడుదల చేసింది. -
నిప్పులు కురిసిన నాగ్పుర్
రోహిణి కార్తెల్లో రోళ్లు పగులుతాయన్న నానుడి దేశంలోని వివిధ ప్రాంతాలవారికి ఇప్పుడు అనుభవంలోకి వస్తోంది. -
రేపు లొంగిపోతా..
ఎన్నికల ప్రచారం నిమిత్తం మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2న తిరిగి లొంగిపోనున్నారు. -
భారత్ ఎన్నికల్లో జోక్యానికి ఇజ్రాయెల్ సంస్థ తీవ్ర యత్నం
ఇజ్రాయెల్ కేంద్రంగా పనిచేసే ఓ సంస్థ... భారత సార్వత్రిక ఎన్నికల్లో జోక్యానికి తీవ్ర ప్రయత్నం చేసిందని చాట్జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ వెల్లడించింది. -
ఎయిరిండియా విమానం 24 గంటలు ఆలస్యం.. ఉక్కపోతతో స్పృహతప్పిన ప్రయాణికులు
దేశ రాజధాని దిల్లీ నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. -
మలద్వారంలో 960 గ్రాముల బంగారం.. కేరళలో ఎయిర్హోస్టెస్ అరెస్ట్
కేరళలో ఓ విమానయాన సంస్థ మహిళా ఉద్యోగి బంగారం అక్రమ రవాణాకు యత్నిస్తూ అధికారులకు చిక్కింది. -
సుప్రీం కొలీజియం నిర్ణయాల్లో జోక్యానికి దిల్లీ హైకోర్టు నిరాకరణ
హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన సిఫార్సులను నిరాకరించడానికి కారణాలేమిటో సుప్రీంకోర్టు కొలీజియం సవివరంగా తెలియజేసేలా ఆదేశించాలని కోరుతూ రాకేశ్కుమార్ గుప్తా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను దిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. -
150 ఏళ్లుగా రుతుపవనాల రాకలో మార్పులు
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) లెక్కల ప్రకారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించే సమయం గత 150 ఏళ్లుగా మారుతూనే ఉంది. మొదటిసారి 1918లో మే 11న ప్రవేశించాయి. అత్యంత ఆలస్యంగా 1972లో జూన్ 18న ప్రవేశించాయి. -
అడుగంటుతున్న ప్రధాన జలాశయాలు
దేశంలోని 150 ప్రధాన జలాశయాల్లో నీటి మట్టం 23 శాతానికి పడిపోయినట్లు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) వెల్లడించింది. ఈ జలాశయాల్లో గత వారం 24 శాతం నీటిమట్టం ఉండేది. -
బిభవ్ కుమార్కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసులో దిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్కు స్థానిక కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. -
శ్రీకృష్ణ జన్మభూమి- షాహి ఈద్గా కేసుల విచారణార్హతపై తీర్పు రిజర్వు
ఉత్తర్ప్రదేశ్లోని మథురలో శ్రీకృష్ణ జన్మభూమి- షాహి ఈద్గా వివాదానికి సంబంధించిన కేసుల విచారణార్హతపై అలహాబాద్ హైకోర్టు శుక్రవారం తన తీర్పును రిజర్వు చేసింది. -
వరదలతో అస్సాం విలవిల
రెమాల్ తుపాను తర్వాత ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అస్సాంలో మొదలైన వరదలు మరింత తీవ్రరూపం దాల్చాయి. శుక్రవారం వరదల కారణంగా ఆ రాష్ట్రంలో ఆరుగురు మృతి చెందారు. -
ఏవియన్ ఇన్ఫ్లుయెంజాతో జాగ్రత్త: కేంద్రం
దేశంలోని పక్షులు, కోళ్లలో అసాధారణ మరణాలు సంభవించడంపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కోరింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని పశుసంవర్థక విభాగంతో పంచుకోవాలని సూచించింది. -
దేశంలో వాతావరణ అత్యయిక స్థితి!
వేసవి కాలం పూర్తికావస్తున్నా దేశంలో నమోదవుతున్న అసాధారణ ఉష్ణోగ్రతలను చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. -
కటకటాల్లోకి ప్రజ్వల్
మహిళలపై అత్యాచారం, కిడ్నాప్ కేసుల్లో నిందితుడిగా ఉన్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (జనతాదళ్)ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. -
అదృశ్యమైన కోటా విద్యార్థి.. 23 రోజులు.. దేశమంతా చక్కర్లు కొట్టి!
ఇటీవల రాజస్థాన్లోని కోటా నుంచి అదృశ్యమైన ఓ విద్యార్థి.. 23 రోజుల వ్యవధిలో జమ్మూ-కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయా ప్రాంతాలన్నీ చుట్టేయడం గమనార్హం. -
భారత ఎన్నికలపై కోవర్ట్ ఆపరేషన్.. ఓపెన్ఏఐ సంచలన నివేదిక
లోక్సభ ఎన్నికలపై ఇజ్రాయెల్కు చెందిన సంస్థ ఒకటి కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించిందని, దాన్ని తాము అడ్డుకున్నట్లు ఓపెన్ ఏఐ సంస్థ వెల్లడించింది.