సంక్షిప్త వార్తలు (4)
ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా శనివారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. కంటి శస్త్ర చికిత్స కోసం లండన్ వెళ్లిన చడ్డా పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.
కేజ్రీవాల్ నివాసానికి రాఘవ్ చడ్డా
దిల్లీ: ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా శనివారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. కంటి శస్త్ర చికిత్స కోసం లండన్ వెళ్లిన చడ్డా పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీంతో పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనకపోవడంపై రాజకీయ వర్గాల్లో అనేక ప్రశ్నలు తలెత్తాయి. చికిత్స అనంతరం చడ్డా బయట కనిపించడం ఇదే తొలిసారి. ఆప్ పేర్కొన్న 40 మంది స్టార్ క్యాంపెయినర్లలో రాఘవ్ చడ్డా ఒకరు.
ఆదాయపు పన్ను అధికారుల దాడులు.. రూ.40 కోట్ల పట్టివేత
ఆగ్రా: లెక్కల్లో చూపని రూ.40 కోట్లను ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆగ్రా కేంద్రంగా పాదరక్షల వ్యాపారం నిర్వహిస్తున్న ఓ వ్యక్తికి చెందిన వివిధ సముదాయాల్లో శనివారం ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో అక్రమంగా దాచిన రూ.40 కోట్లను గుర్తించినట్లు, ఆ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం
తిరుచిరాపల్లి: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తిరుచిరాపల్లి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. 137 మంది ప్రయాణికులతో శనివారం బెంగళూరు నుంచి తిరువనంతపురం బయలుదేరిన విమానం గాల్లో ఉండగానే పైలెట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో అత్యవసరంగా తిరుచిరాపల్లిలో ల్యాండ్ చేసి, అందులోని ప్రయాణికులను దించేశారు. వారిని మరో విమానంలో బెంగళూరుకు పంపించినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
ముగ్గురు బెంగాల్ రాజ్భవన్ అధికారులపై కేసు
గవర్నర్పై లైంగిక వేధింపుల వ్యవహారంలో పురోగతి
ఈటీవీ భారత్: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్పై లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం కొత్తమలుపు తిరిగింది. మేజిస్ట్రేట్ ముందు బాధితురాలి వాంగ్మూలం అనంతరం ముగ్గురు రాజ్భవన్ అధికారులపై శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎక్కడ పోలీసులకు ఫిర్యాదు చేస్తుందోననే భయంతో ఈనెల 2న బాధితురాలు రాజ్భవన్ నుంచి బయటకు వెళ్లకుండా ఆ ముగ్గురూ అడ్డుకున్నట్లు చెప్పారు. ఇటీవల గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తనను వేధింపులకు గురిచేశారంటూ కోల్కతా రాజ్భవన్లో తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్న మహిళ స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగం విషయమై గవర్నర్ తనను రెండుసార్లు పిలిపించి వేధింపులకు పాల్పడినట్లు ఆమె ఆరోపించింది. కోల్కతా పోలీసులపై తనకు నమ్మకం లేదని, ఈ అంశంపై రాష్ట్రపతికి లేఖ రాయనున్నట్లు బాధితురాలు పేర్కొనడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్టీ నేతలకు కేజ్రీవాల్ సందేశం..ఏమన్నారంటే..
నేడు తిహాడ్ జైల్లో లొంగిపోనున్న సందర్భంగా దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీ నాయకులను, కార్యకర్తలనుద్దేశించి ఎక్స్లో తన సందేశాన్ని వెలువరించారు. -
పుణె కారు ప్రమాదం..దర్యాప్తునకు 100మంది పోలీసులు
పుణె కారు ప్రమాదం కేసులో దర్యాప్తును వేగవంతం చేయడానికి 100మంది సిబ్బందితో కూడిన బృందాలను రంగంలోకి దింపినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. -
అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన కౌంటింగ్ ఉదయం 6 గంటలకే ప్రారంభమైంది. -
7 నిమిషాల్లో 15 వేల మెరుపులు
ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. -
మరణ వాంగ్మూలానికి తిరుగులేదు: సుప్రీం
ఓ వ్యక్తి మరణ వాంగ్మూలం నిజమైనదని కోర్టు విశ్వసిస్తే నిందితుడికి శిక్ష వేయడానికి అదొక్కటే చాలని, దానికి వేరెవరి ధ్రువీకరణ అక్కర్లేదని సుప్రీం కోర్టు మే 15న స్పష్టం చేసింది. -
బెయిల్పై కేజ్రీవాల్కు దక్కని ఊరట
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బెయిల్ విషయంలో ఆప్ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఊరట దక్కలేదు. ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్పై నిర్ణయాన్ని దిల్లీ కోర్టు ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు తీర్పు వెలువరించనుంది. -
సల్మాన్ఖాన్పై లారెన్స్ బిష్ణోయ్ ట్రిగ్గర్
బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ఖాన్పై దాడి లక్ష్యంగా గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా పక్కాగా కుట్రలు పన్నుతోంది. గత కొన్ని నెలలుగా ఈ ముఠా సభ్యులు ఆయన కదలికలపై నిఘా పెట్టినట్లు సమాచారం. -
సంక్షిప్త వార్తలు (7)
సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో లైంగిక వేధింపులపై వచ్చే ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి సంబంధించి జస్టిస్ హిమా కోహ్లి నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటైంది. సుప్రీంకోర్టు అంతర్గత విభాగంగా ఇది పని చేయనుంది. -
ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు
రెండు ఇండిగో విమానాలకు సంబంధించి వచ్చిన బాంబు బెదిరింపులు శనివారం అధికారులతో పాటు ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. చివరకు ఆ బెదిరింపులు ఉత్తుత్తివేనని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
పుణె కారు ప్రమాద ఘటనలో బాలుడి తల్లి అరెస్టు
మహారాష్ట్రలోని పుణెలో మైనర్ దురుసు డ్రైవింగ్ కారణంగా ఇద్దరు టెకీలు మృతి చెందిన కేసులో పోలీసులు శనివారం బాలుడి తల్లిని అరెస్టుచేశారు. ప్రమాద సమయంలో ఆ మైనర్ మద్యం తాగలేదని నిరూపించేందుకు ఆమె రక్త నమూనాలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. -
కన్యాకుమారిలో ముగిసిన ప్రధాని ధ్యానం
తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం పూర్తయింది. ఇక్కడి వివేకానంద రాక్ మెమోరియల్ మండపంలో గురువారం సాయంత్రం ధ్యానాన్ని ప్రారంభించిన ఆయన.. శనివారం మధ్యాహ్నం 2.45 గంటలకు పూర్తి చేశారు. -
కేరళ, అస్సాంలకు భారీ వరద
రెండు తుపానుల కారణంగా కేరళ, అస్సాంలను భారీ వరదలు ముంచెత్తుతున్నట్లు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తెలిపింది. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, తదుపరి పరిణామాలను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని ఈ రెండు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. -
‘అగ్నిపథ్’లో జోక్యం చేసుకోండి.. రాష్ట్రపతికి రాహుల్ లేఖ
సైనిక నియామకాలకు ఉద్దేశించిన ‘అగ్నిపథ్’ పథకంలో చేరి అమరులయ్యే సైనికుల కుటుంబాలకు అందించే ప్రయోజనాల్లో వివక్ష ఉంటోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. -
దిల్లీ రికార్డు ఉష్ణోగ్రతకు సెన్సర్ ఎర్రర్ కారణం: కేంద్రం
దిల్లీలోని ముంగేశ్పుర్ వాతావరణ కేంద్రంలో ఇటీవల అత్యధికంగా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చూపించడంపై కేంద్రం స్పందించింది. దానికి సెన్సర్ సరిగా పని చేయకపోవడమే కారణమని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితమంటే అదే.. అలాంటివాటికి దూరంగా పారిపోను: హార్దిక్ పాండ్య
-
ఏపీలో ఓట్ల లెక్కింపుపై సీఈవో ముకేశ్కుమార్ మీనా సమీక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
వ్యూహం లేకపోవడం వల్లే 1969లో ఉద్యమం విఫలమైంది: కేసీఆర్
-
ఆసియా కుబేరుడిగా మళ్లీ అదానీ.. అంబానీని వెనక్కి నెట్టి తొలిస్థానానికి
-
పార్టీ నేతలకు కేజ్రీవాల్ సందేశం..ఏమన్నారంటే..