ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డు మూసివేత
కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డును కేంద్ర ప్రభుత్వం మూసేసింది. గత ఏడాది ఏప్రిల్ 6న జరిగిన కేబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ సంస్థను మూసేస్తున్నట్లు మంగళవారం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది.
ఈనాడు, దిల్లీ: కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డును కేంద్ర ప్రభుత్వం మూసేసింది. గత ఏడాది ఏప్రిల్ 6న జరిగిన కేబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ సంస్థను మూసేస్తున్నట్లు మంగళవారం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ సంస్థ 1964లో కేంద్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రారంభంకాగా, 1993లో దీన్ని మహిళా శిశుసంక్షేమ శాఖ పరిధిలోకి మార్చారు. దీనికింద ఇప్పటివరకు ఫరీదాబాద్, ముంబయి, కోల్కతా, చెన్నైల్లో ప్రాంతీయ నాణ్యతా నియంత్రణ ప్రయోగశాలలు, అలాగే 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కమ్యూనిటీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఎక్స్టెన్షన్ యూనిట్లు(సీఎఫ్ఎన్ఈయూ) పనిచేశాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను హేతుబద్ధీకరించాలని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు 2020 నవంబర్లో చేసిన సిఫార్సులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ బోర్డును మూసేయాలని నిర్ణయించింది. ఇందులో పనిచేస్తున్న 147 మంది ఉద్యోగుల్లో 33 మందికి స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం కల్పించింది. మిగిలిన వారిని మహిళా, శిశు సంక్షేమ శాఖలోని వివిధ విభాగాలకు పంపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు
బిల్లులను ఆమోదించడంలో గవర్నర్లు జాప్యం చేస్తున్నారని కేరళ, బెంగాల్ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లపై 3 వారాల్లోగా స్పందించాలంటూ కేంద్ర హోంశాఖ, ఆయా గవర్నర్ల... -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?