గుజరాత్ యంత్రాంగంపై నమ్మకం లేదు
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన రాజ్కోట్ గేమ్జోన్ వ్యవహారంలో గుజరాత్ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గేమ్జోన్ నిర్వహణకు దాని యజమానులు అసలు అనుమతులే తీసుకోలేదని తెలియడం, కొన్నేళ్లుగా అధికారులు ఆ విషయాన్ని పట్టించుకోకపోవడంపై మండిపడింది.
రాజ్కోట్ గేమ్జోన్లోని భారీ లోపాలు... అగ్ని ప్రమాదంపై హైకోర్టు ఆగ్రహం
నగర మున్సిపల్, పోలీస్ కమిషనర్లు.. మరో 8 మందిపై ప్రభుత్వం వేటు
అహ్మదాబాద్: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన రాజ్కోట్ గేమ్జోన్ వ్యవహారంలో గుజరాత్ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గేమ్జోన్ నిర్వహణకు దాని యజమానులు అసలు అనుమతులే తీసుకోలేదని తెలియడం, కొన్నేళ్లుగా అధికారులు ఆ విషయాన్ని పట్టించుకోకపోవడంపై మండిపడింది. 18 నెలల క్రితం ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా అగ్ని ప్రమాదాల కట్టడికి తానిచ్చిన ఆదేశాలను అధికారులు అమలుచేయకపోవడంపై నిలదీసింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై విశ్వాసం కోల్పోయామని జస్టిస్ బిరేన్ వైష్ణవ్, జస్టిస్ దేవన్ దేశాయ్ ధర్మాసనం సోమవారం పేర్కొంది. నగరంలోని టీఆర్పీ గేమ్జోన్లో శనివారం నాటి అగ్నిప్రమాదంలో 27 మంది మృత్యువాతపడిన ఘటనను హైకోర్టు సుమోటోగా విచారణకు చేపట్టింది. మానవ చర్యల విపత్తుగా దీనిని అభివర్ణించింది. గేమ్జోన్ పేరుతో చేపట్టిన భారీ నిర్మాణానికి అవసరమైన అనుమతులను నిర్వాహకులు తీసుకోలేదని, అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రానికీ దరఖాస్తు చేయలేదని కోర్టు సహాయకుడైన న్యాయవాది తెలుపగా...‘నగర మున్సిపల్ కార్పొరేషన్ ఇన్నాళ్లూ కళ్లు మూసుకుందా?’ అంటూ ధర్మాసనం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. టీఆర్పీ గేమ్జోన్ ఏర్పాటైన 2021 నుంచి అగ్నిప్రమాదం జరిగిన శనివారం(మే 25) వరకు రాజ్కోట్ మున్సిపల్ కమిషనర్లుగా పని చేసిన అధికారులు అందరూ ప్రమాదానికి బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. వారందరూ విడివిడిగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అగ్నిప్రమాదానికి బాధ్యుడైన వ్యక్తి ఎవరో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుందని, కఠిన చర్యలు తీసుకోనుందని న్యాయవాది ఒకరు తెలుపగా...‘కఠిన చర్యలు తీసుకునేది ఎవరు? వాస్తవం చెప్పాలంటే...రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై మాకు ఇప్పుడు నమ్మకం లేదు. కొన్నేళ్ల క్రితం కూడా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇది ఆరో ఘటన. ప్రాణాలు పోయినప్పుడు మాత్రమే యంత్రాంగాన్ని కదిలిస్తారు’ అంటూ ధర్మాసనం ఆక్షేపించింది. రెండున్నరేళ్లుగా గేమ్జోన్లో కార్యకలాపాలు జరుగుతున్నా అగ్నిమాపక శాఖ నుంచి భద్రత ధ్రువీకరణపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? వినోద పన్ను ఎందుకు వసూలు చేయలేదు?...ఇలా అన్ని విభాగాలు ఎందుకు తమ విధులు నిర్వర్తించలేదని ధర్మాసనం నిలదీసింది. బాధ్యులైన అధికారులు అందరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం గురించి ఆరా తీసింది.
ముగ్గురు ఉన్నతాధికారుల బదిలీ
రాజ్కోట్ మున్సిపల్ కమిషనర్, ఐఏఎస్ అధికారి ఆనంద్ పటేల్, నగర పోలీస్ కమిషనర్ రాజు భార్గవ, అదనపు పోలీస్ కమిషనర్ విధి చౌధరీ, డిప్యూటీ పోలీస్ కమిషనర్ సుధీర్కుమార్ దేశాయ్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. వారికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదని రాష్ట్ర హోంశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు టీఆర్పీ గేమ్జోన్ భాగస్వాములైన ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేశారు. సోమవారం రాహుల్ రాథోడ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు యువరాజ్ సింహ్ సోలంకి, మేనేజర్ నితిన్ జైన్ను ఆదివారం అరెస్టు చేశారు.
ఏడుగురు అధికారుల సస్పెన్షన్
టీఆర్పీ గేమ్జోన్ అనుమతుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన ఏడుగురు అధికారులను గుజరాత్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వీరిలో రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ ప్రణాళిక విభాగానికి చెందిన అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ టౌన్ ప్లానర్, రహదారులు-భవనాల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఇద్దరు, పోలీస్ ఇన్స్పెక్టర్లు ఇద్దరుతో పాటు అగ్నిమాపక కేంద్రం అధికారి ఒకరు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
పెండింగ్ బిల్లుల విషయంలో కేరళ, బెంగాల్ గవర్నర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
అగ్నిపథ్ పథకం దేశ సైన్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకువచ్చిన సంస్కరణ అని మోదీ(PM Modi) తెలిపారు. -
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని హెచ్చరించారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. -
92 వేల అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. -
నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్
కార్గిల్ 25వ విజయ్ దివస్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులర్పించనున్నారు. -
గూగుల్ మ్యాప్స్లో సరికొత్త ఫీచర్లు
భారతీయ వినియోగదారులను మరింతగా ఆకర్షించేలా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ మ్యాప్స్ ప్రకటించింది. -
ఇద్దరు ఝార్ఖండ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఝార్ఖండ్ శాసనసభ స్పీకర్ ట్రైబ్యునల్ గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు (7)
తిహాడ్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడంపై ‘ఇండియా’ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. -
మహారాష్ట్ర, హిమాచల్లలో కుంభవృష్టి
హిమాచల్, మహారాష్ట్రల్లో కుండపోత వర్షాలు కురిసి జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ముంబయిలో 9 గంటల వ్యవధిలో 100 మి.మీ. పైగా వాన దంచికొట్టింది. -
ముమ్మాటికీ వివక్షేనన్న విపక్షం
కేంద్ర బడ్జెట్లో ఒకటిరెండు రాష్ట్రాలకు తప్పిస్తే మిగిలినవాటికి అన్యాయం జరిగిందని విపక్ష సభ్యులు మరోసారి గట్టిగా గళం వినిపించడంతో గురువారం పార్లమెంటు ఉభయసభలు దాదాపు స్తంభించిపోయాయి. -
ట్రంకు పెట్టెల బదులు ట్రాలీ బ్యాగులు
లోకోపైలట్లు, గార్డులు ఇకపై తమ వ్యక్తిగత వస్తువుల్ని, విధి నిర్వహణకు అవసరమైన సామగ్రిని ఇనుప ట్రంకు పెట్టెల్లో కాకుండా ట్రాలీ బ్యాగుల్లో తీసుకువెళ్లాల్సి ఉంటుంది. -
ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0
జమ్ముకశ్మీర్లో ఉగ్ర చర్యలకు పాల్పడుతున్న 55 మంది ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0’ను ప్రారంభించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి నీరిచ్చే మనసు లేదు: కేటీఆర్
-
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
-
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
-
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
-
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి