బద్రీనాథ్ దర్శనం లేకుండానే.. 650 మందికి పైగా భక్తులు వెనక్కి
పేర్లు నమోదు చేసుకోకుండా చార్ధామ్ యాత్రకు వెళ్లిన భక్తులను దర్శనానికి అనుమతించకుండా అధికారులు వెనక్కు పంపించారు.
గోపేశ్వర్(ఉత్తరాఖండ్): పేర్లు నమోదు చేసుకోకుండా చార్ధామ్ యాత్రకు వెళ్లిన భక్తులను దర్శనానికి అనుమతించకుండా అధికారులు వెనక్కు పంపించారు. తప్పనిసరి రిజిస్ట్రేషన్ నిబంధనను పాటించకుండా 650 మందికి పైగా భక్తులు బద్రీనాథ్కు వెళుతుండగా.. గౌచార్ చెక్పోస్ట్ నుంచే వారిని వెనక్కు పంపించినట్లు చమోలీ ఎస్ఎస్పీ కార్యాలయం మంగళవారం తెలిపింది. యాత్ర ప్రారంభ రోజుల్లో నెలకొన్న గందరగోళం దృష్ట్యా రద్దీని నియంత్రించడానికి చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. యాత్రికులను తీసుకొచ్చిన దాదాపు 120 వాహనాలను కూడా తిప్పి పంపించామని, అయిదు వాహనాల నిర్వాహకులపై చర్యలు సైతం తీసుకున్నామని వెల్లడించారు. పేర్లు నమోదు చేసుకోకుండా యాత్రకు రావొద్దని, రిజిస్ట్రేషన్లో తమకు కేటాయించిన తేదీల్లో మాత్రమే భక్తులు రావాలని ఉత్తరాఖండ్ సీఎస్, డీజీపీ విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?