ప్రపంచ ఆహార మార్కెట్‌లో భారత్‌ దూకుడు

ప్రపంచ వ్యవసాయ ఆహార మార్కెట్‌లో భారత్‌ దూసుకుపోతోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. 2020-21 నుంచి 2023-24 మధ్యకాలంలో దేశీయ ఆహారధాన్యాల ఉత్పత్తి 10% పెరగడం మన దేశ సత్తాను చాటుతోందన్నారు.

Published : 06 Jun 2024 06:37 IST

వ్యవసాయరంగానికి భారతరత్న  స్వామినాథన్‌ సేవలు అనుపమానం
నాస్‌ వార్షికోత్సవంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

స్వామినాథన్‌ చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఈనాడు, దిల్లీ: ప్రపంచ వ్యవసాయ ఆహార మార్కెట్‌లో భారత్‌ దూసుకుపోతోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. 2020-21 నుంచి 2023-24 మధ్యకాలంలో దేశీయ ఆహారధాన్యాల ఉత్పత్తి 10% పెరగడం మన దేశ సత్తాను చాటుతోందన్నారు. బుధవారమిక్కడ భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రాంగణంలోని ఆడిటోరియంలో నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ సైన్సెస్‌ (నాస్‌) వార్షికోత్సవం సందర్భంగా భారతరత్న స్వామినాథన్‌ స్మారకోపన్యాసంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో హరిత విప్లవానికి  స్వామినాథన్‌ చేసిన కృషిని కొనియాడారు. ‘‘ప్రొఫెసర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ దార్శనికతవల్లే వ్యవసాయరంగం భారత సామాజిక-ఆర్థికాభివృద్ధికి ఎంతో చేయూత ఇవ్వగలిగింది. ప్రస్తుతం దేశం ఆహారభద్రతతోపాటు, పోషకాహార భద్రత సాధించే దిశగా పయనిస్తోంది. 2020-21 నుంచి 2023-24 మధ్యకాలంలో దేశీయంగా ఆహారధాన్యాల ఉత్పత్తి 298 మిలియన్‌ టన్నుల నుంచి 330 మిలియన్‌ టన్నులకు పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ వ్యవసాయ ఆహార మార్కెట్‌లో భారత్‌ విస్తృతి పెరిగింది. బాస్మతీ, నాన్‌బాస్మతీ బియ్యం, సుగంధద్రవ్యాలు, రొయ్యల ఎగుమతుల్లో దూసుకుపోతోంది. ఈ రంగంలో వాణిజ్య మిగులు ఉండడం మనం సాధించిన విజయానికి అద్దంపడుతోంది. దివంగత ప్రొఫెసర్‌ స్వామినాథన్‌ ఈ రంగానికి చేసిన అనిర్వచనీయమైన సేవలే మనం ఇంతబలంగా తయారుకావడానికి కారణం’’ అని వెంకయ్యనాయుడు కొనియాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు