సంక్షిప్త వార్తలు (6)
ఈ పోటీ ప్రపంచంలో కొత్త భాషలను నేర్చుకోవడం చాలా అవసరం. అయితే ఏదైనా కొత్త భాషను నేర్చుకొనేవారు దాన్నొక సబ్జెక్టులా కాకుండా దైనందిన జీవితంలో అంతర్భాగంలా చూడాలి.
భాష నేర్చుకోవడం ఓ ఆటలా ఉండాలి
- డేవిడ్ లవ్జాయ్, జీవన నైపుణ్య శిక్షకుడు
ఈ పోటీ ప్రపంచంలో కొత్త భాషలను నేర్చుకోవడం చాలా అవసరం. అయితే ఏదైనా కొత్త భాషను నేర్చుకొనేవారు దాన్నొక సబ్జెక్టులా కాకుండా దైనందిన జీవితంలో అంతర్భాగంలా చూడాలి. ఈ వారంలోపు ఇన్ని పదాలు నేర్చుకోవాలి, వ్యాకరణం పరీక్షలో పాస్ కావాలి అనే ఆలోచనా ధోరణి సరికాదు. నిత్య జీవితంలో ఎదురయ్యే వివిధ సందర్భాల్లో కొత్త భాషలో సంభాషించడం ద్వారా దాన్ని ఆకళింపు చేసుకొనే ప్రయత్నం చేయాలి. అప్పుడే మన భాషలో జీవం ఉంటుంది. మాతృభాష మాట్లాడటం కూడా తప్పులతోనే మొదలవుతుంది కనుక అందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. స్కూల్లో నేర్చుకున్న సబ్జెక్టులను నిజ జీవితంలో ఉపయోగిస్తామో లేదో కానీ, భాష మాత్రం మనకు తప్పకుండా ఉపయోగపడుతుంది. భాష నేర్చుకోవడం ఓ తపస్సులా కాదు, ఓ ఆటలా ఉండాలి.
పనిలోనే ఆనందం దొరికితే జీవితం ధన్యం
- మనోజ్ అరోడా, రచయిత
ఆసక్తి, అభిరుచి ఉన్న పని చేస్తున్నవారికి అది అసలు పనిలా అనిపించదు. ఇతరులు సెలవుల్లో, విహార యాత్రల్లో ఆనందం వెతుక్కుంటే, వారికి మాత్రం పనిలోనే ఆనందం దొరుకుతుంది. ఆర్థికంగా స్థిరపడి ఓ దశకు వచ్చాక, వారికి ఇక పని చేయాల్సిన అవసరం ఉండదు. ఎంచక్కా విశ్రాంతి తీసుకోవచ్చు. అయినా వారు పనిని వదులుకోవడానికి ఇష్టపడరు. పనిలోనే విశ్రాంతి పొందుతారు. అప్పుడు రోజుకు 8 గంటలు పనిచేస్తున్నామా, 16 గంటలు కష్టపడుతున్నామా అన్నది లెక్కలోకి రాదు. చాలా మంది కళాకారులకు వేదికపై ప్రదర్శన చేస్తూనే తుదిశ్వాస విడవాలన్న కోరిక ఉంటుంది. అలా పని చేస్తూ ఒరిగిపోయేవారంతా ధన్యజీవులు.
పొగాకు సంస్థల విచ్చలవిడి ప్రచారం
- ప్రపంచ ఆరోగ్య సంస్థ
పొగాకు ఉత్పత్తుల సంస్థలు యువతకు వాటిని అలవాటు చేయడానికి సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ఫాలోవర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న ఇన్ఫ్లూయెన్సర్లకు డబ్బులిచ్చి ప్రచారం చేయిస్తున్నాయి. 2007-2016 మధ్య 100కు పైగా పొగాకు ప్రచార సంబంధిత హ్యాష్ట్యాగ్లను సామాజిక మాధ్యమాల వినియోగదారులు సుమారు 2500 కోట్ల సార్లు వీక్షించారు. ప్రభుత్వాలు ఈ పరిస్థితిపై వెంటనే దృష్టిపెట్టి పొగాకు సంస్థల ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి.
ఇంజినీర్ రషీద్ బెయిల్ పిటిషన్పై జూన్ 18న విచారణ
దిల్లీ: ఉగ్రవాదులకు నిధుల పంపిణీ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఇంజినీర్ రషీద్.. లోక్సభ ఎన్నికల్లో బారాముల్లా నుంచి పోటీ చేసి మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాపై గెలుపొందిన విషయం తెలిసిందే. ఎంపీగా ప్రమాణం చేయడానికి తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 18న విచారణ జరపనున్నట్లు దిల్లీ కోర్టు వెల్లడించింది. 2016 నాటి కేసులో జాతీయ దర్యాప్తు దళం (ఎన్ఐఏ) ఉపా చట్టం కింద 2019లో రషీద్ను అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన తిహాడ్ జైలులో ఉన్నారు.
బ్రిక్స్లో నూతన దేశాల చేరికను స్వాగతించిన భారత్
మాస్కో: బ్రిక్స్ కూటమిలో పూర్తిస్థాయి సభ్యదేశాలుగా ఈజిప్టు, ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇథియోపియాల చేరికను స్వాగతిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ‘ఎక్స్’లో ఈ మేరకు పోస్టు పెట్టారు. రష్యాలోని నిజ్నీ నొవ్గొరొడ్ వేదికగా సోమవారం బ్రిక్స్ విదేశాంగ మంత్రుల భేటీ జరిగింది. ఈ సమావేశానికి ఈజిప్టు, ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇథియోపియాల ప్రతినిధులు తొలిసారిగా హాజరయ్యారు. భారత బృందానికి సీనియర్ దౌత్యవేత్త దమ్ము రవి ప్రాతినిధ్యం వహించారు.
భారత్కు తిరిగి రానున్న పురాతన విగ్రహం
లండన్: దాదాపు 500 ఏళ్లక్రితం నాటి ఓ సాధువు పురాతన కాంస్య విగ్రహాన్ని తిరిగి భారత్కు అప్పగించేందుకు యూకేలోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం దాదాపు అంగీకరించింది. తమిళనాడులోని ఓ ఆలయం నుంచి చోరీకి గురైనట్లు భావిస్తున్న సదరు విగ్రహాన్ని.. 1967లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిధిలోని మ్యూజియం ఒక వేలంలో కొనుగోలు చేసింది. అయితే, 16వ శతాబ్దానికి చెందిన ఆ విగ్రహం సెయింట్ తిరుమన్కై అల్వార్దనీ.. దాన్ని తిరిగి తమకు అప్పగించాలని యూకేలోని భారత హైకమిషన్ ప్రతినిధులు ఇటీవల కోరడంతో.. సదరు మ్యూజియం నిర్వాహకులు సానుకూలంగా స్పందించారు. అక్కడి ఛారిటీ కమిషన్ అనుమతి కూడా వస్తే త్వరలోనే ఆ 60 సెంటీమీటర్ల ఎత్తయిన విగ్రహం భారత్కు చేరనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
కార్గిల్ యుద్ధం సమయంలో మోదీ అక్కడి యుద్ధ వీరులతో ముచ్చటించిన పలు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
పెండింగ్ బిల్లుల విషయంలో కేరళ, బెంగాల్ గవర్నర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
అగ్నిపథ్ పథకం దేశ సైన్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకువచ్చిన సంస్కరణ అని మోదీ(PM Modi) తెలిపారు. -
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని హెచ్చరించారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. -
92 వేల అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. -
నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్
కార్గిల్ 25వ విజయ్ దివస్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులర్పించనున్నారు. -
గూగుల్ మ్యాప్స్లో సరికొత్త ఫీచర్లు
భారతీయ వినియోగదారులను మరింతగా ఆకర్షించేలా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ మ్యాప్స్ ప్రకటించింది. -
ఇద్దరు ఝార్ఖండ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఝార్ఖండ్ శాసనసభ స్పీకర్ ట్రైబ్యునల్ గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు (7)
తిహాడ్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడంపై ‘ఇండియా’ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. -
మహారాష్ట్ర, హిమాచల్లలో కుంభవృష్టి
హిమాచల్, మహారాష్ట్రల్లో కుండపోత వర్షాలు కురిసి జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ముంబయిలో 9 గంటల వ్యవధిలో 100 మి.మీ. పైగా వాన దంచికొట్టింది. -
ముమ్మాటికీ వివక్షేనన్న విపక్షం
కేంద్ర బడ్జెట్లో ఒకటిరెండు రాష్ట్రాలకు తప్పిస్తే మిగిలినవాటికి అన్యాయం జరిగిందని విపక్ష సభ్యులు మరోసారి గట్టిగా గళం వినిపించడంతో గురువారం పార్లమెంటు ఉభయసభలు దాదాపు స్తంభించిపోయాయి. -
ట్రంకు పెట్టెల బదులు ట్రాలీ బ్యాగులు
లోకోపైలట్లు, గార్డులు ఇకపై తమ వ్యక్తిగత వస్తువుల్ని, విధి నిర్వహణకు అవసరమైన సామగ్రిని ఇనుప ట్రంకు పెట్టెల్లో కాకుండా ట్రాలీ బ్యాగుల్లో తీసుకువెళ్లాల్సి ఉంటుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్