United Airlines: ఇక విమానయానం సూపర్!
ధ్వని కన్నా వేగంతో దూసుకెళ్లే ప్రయాణికుల విమానాలు మరోసారి గగనసీమలోకి ప్రవేశించనున్నాయి. అమెరికాకు చెందిన విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్లైన్స్.. బూమ్ సూపర్సోనిక్ అనే అంకుర సంస్థ నుంచి 15 ‘ఓవర్ట్యూర్’ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
ధ్వని కన్నా వేగంగా వెళ్లే ప్రయాణికుల విమానాలు
అభివృద్ధి చేస్తున్న అమెరికా సంస్థ
న్యూయార్క్: ధ్వని కన్నా వేగంతో దూసుకెళ్లే ప్రయాణికుల విమానాలు మరోసారి గగనసీమలోకి ప్రవేశించనున్నాయి. అమెరికాకు చెందిన విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్లైన్స్.. బూమ్ సూపర్సోనిక్ అనే అంకుర సంస్థ నుంచి 15 ‘ఓవర్ట్యూర్’ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇవి ప్రస్తుతం అత్యంత వేగంగా పయనించే ప్రయాణికుల జెట్ల కన్నా రెట్టింపు వేగంతో దూసుకెళతాయి. భద్రత, నిర్వహణపరమైన ప్రమాణాలను అందుకోగానే వీటిని సమకూర్చుకుంటామని యునైటెడ్ ఎయిర్లైన్స్ తాజాగా ప్రకటించింది. 2029 నాటికి వీటి సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్నది తమ ఉద్దేశమని పేర్కొంది. ఇవి ధ్వని కన్నా 1.7 రెట్లు వేగంతో ప్రయాణిస్తాయి. ధ్వని వేగం గంటకు సుమారు 1200 కిలోమీటర్లు.
కంకార్డ్ పేరుతో 1970లలో వాణిజ్య సూపర్సోనిక్ జెట్లను ఎయిర్ ఫ్రాన్స్, బ్రిటిష్ ఎయిర్వేస్ సంస్థలు ప్రవేశపెట్టాయి. అయితే పెరుగుతున్న ఖర్చులు, ఆ విమానాల నుంచి వెలువడే ధ్వని వంటి కారణాలతో 2003లో ఆ సర్వీసులకు స్వస్తి పలికాయి. అవి ధ్వని కన్నా రెట్టింపు వేగంతో ప్రయాణించేవి. టికెట్ ధరలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల ధనికులు మాత్రమే వాటిలో ప్రయాణించేవారు.
ఇటీవలి కాలంలో తేలికపాటి, సమర్థమైన మిశ్రమ లోహాలు, కొత్త ఇంజిన్ డిజైన్లను అనేక కంపెనీలు రూపొందిస్తుండటంతో సూపర్సోనిక్ ప్రయాణికుల విమానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ‘బూమ్ సూపర్సోనిక్’ కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఈ సంస్థ రూపొందించే ఓవర్ట్యూర్ విమానం ద్వారా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి జపాన్లోని టోక్యోకు ఆరు గంటల్లో చేరుకోవచ్చు. ప్రస్తుతం ఇందుకు దాదాపు 11 గంటలు పడుతోంది. అమెరికా వైమానిక దళం కోసం సైనిక ‘ఓవర్ట్యూర్’ విమానాన్నీ బూమ్ సంస్థ రూపొందిస్తోంది.
ధర ఎక్కువే
పౌర అవసరాల కోసం రూపొందిస్తున్న సూపర్ సోనిక్ విమానంలో ప్రయాణం అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చని బూమ్ సోపర్సోనిక్ సీఈవో బ్లేక్ స్కాల్ తెలిపారు. ఈ టికెట్ ధర ఎక్కువగానే ఉంటుందని చెప్పారు. ‘‘అయితే నేటి బిజినెస్ క్లాస్ టికెట్ స్థాయిలోనే అది ఉండొచ్చు. విమానానికి సంబంధించిన ఏరోడైనమిక్స్, మిశ్రమ పదార్థాలు, ఇంజిన్ పరిజ్ఞానం విషయంలో సాధించిన పురోగతి కారణంగానే టికెట్ ధర మరీ ఎక్కువగా ఉండకుండా చూడటం సాధ్యమవుతోంది’’ అని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
వీర్యదానంతో 550 మందికి తండ్రైన వైద్యుడు
-
Ts-top-news News
రంగంలోకి కేంద్ర నిఘా సంస్థ.. డేటా లీకేజీ వ్యవహారంలో మలుపులు
-
Crime News
కారుపై ‘పొక్లెయిన్’ పిడుగు!.. ముగ్గురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్రగాయాలు
-
Ap-top-news News
పాపికొండల విహారయాత్రకు పచ్చ జెండా
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు
-
Sports News
భారత్తో బంధం ప్రత్యేకమైంది: ఏబీ డివిలియర్స్