గ్రామస్థులను ఠారెత్తించిన 18 అడుగుల కొండ చిలువ

Eenadu icon
By National News Desk Updated : 29 Oct 2025 06:10 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈటీవీ భారత్‌: ఉత్తరాఖండ్‌లోని నైనీతాల్‌ జిల్లా రామ్‌నగర్‌ గ్రామస్థులు తమ ఇళ్ల నడుమ కనిపించిన భారీ కొండ చిలువను చూసి అవాక్కయ్యారు. వెంటనే తరాయీ అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో పాములను పట్టడంలో అనుభవజ్ఞుడైన తాలిబ్‌ హుసేన్‌ బృందం వచ్చి కొండ చిలువను ఒడిసి పట్టుకొని డీఎఫ్‌వో ఆధ్వర్యంలో అడవిలో వదిలారు. ఈ కొండ చిలువ 18 అడుగుల పొడవు, 175 కిలోల బరువు ఉందని.. ఈ సైజులో ఉండటం అరుదని తాలిబ్‌ అన్నాడు. పర్యావరణ వ్యవస్థలో కీలకపాత్ర పోషించే ఈ కొండ చిలువ సాధారణంగా మనుషులపై దాడి చేయదని అటవీశాఖ అధికారులు తెలిపారు.

Tags :
Published : 29 Oct 2025 05:48 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు