గ్రేట్‌ నికోబార్‌ ప్రాజెక్టుతో విధ్వంసం

Eenadu icon
By National News Desk Published : 29 Oct 2025 05:48 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కేంద్రానికి 70 మంది మేధావుల లేఖ 

దిల్లీ: గ్రేట్‌ నికోబార్‌ అభివృద్ధి ప్రాజెక్టు భారతదేశ సముద్ర వాణిజ్యాన్ని ఎన్నో రెట్లు పెంచేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పేర్కొనడం ఒక మోసపూరిత వాదన అని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర పర్యావరణశాఖ మాజీ మంత్రి జైరాం రమేశ్‌ విమర్శించారు. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణ, సామాజిక విపరిణామాలు సంభవిస్తాయని హెచ్చరించారు. వనరుల దోపిడీకి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు తప్పుగా రక్షణ ప్రయోజనాలను ఆపాదిస్తున్నారనీ, దీనివల్ల స్థానిక తెగలకు, ప్రకృతికి శాశ్వత నష్టం వాటిల్లుతుందని 70 మంది మేధావులు, శాస్త్రజ్ఞులు, ఉద్యమకారులు కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు సోమవారం లేఖ రాశారు. లేఖపై సంతకం చేసిన వారిలో పద్మభూషణ్‌ రామచంద్ర గుహ, పద్మశ్రీ రోములస్‌ విటేకర్‌ కూడా ఉన్నారు. గ్రేట్‌ నికోబార్‌ అభివృద్ధి ప్రాజెక్టు కింద 160 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో సరకుల రేవు, అంతర్జాతీయ విమానాశ్రయం, టౌన్‌ షిప్, విద్యుత్కేంద్రం నిర్మించాలని తలపెట్టారు. దీనికోసం నికోబారీస్, షోంపెన్‌ తెగలు నివసించే 130 చదరపు కిలోమీటర్ల అటవీ భూమిని స్వాధీనం చేసుకుంటారు. వారిని అక్కడ నుంచి వెళ్లగొట్టడం సామాజిక విపరిణామాలకు దారితీస్తుందనీ, పర్యావరణం కోలుకోలేని విధంగా దెబ్బతింటుందని 70 మంది మేధావులు లేఖలో హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని