ఫోన్‌ చేసిన వ్యక్తి పేరు కనిపించాల్సిందే

Eenadu icon
By National News Desk Published : 29 Oct 2025 05:52 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

డాట్‌ అభిప్రాయంతో ఏకీభవించిన ట్రాయ్‌

దిల్లీ: మొబైల్‌లోని మన కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని వ్యక్తి కాల్‌ చేసినా, ఆ వ్యక్తి అసలు పేరు తప్పనిసరిగా కనిపించేలా చూడాలన్న టెలికాం విభాగం (డాట్‌) అభిప్రాయంతో టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్‌ ఏకీభవించింది. ఫోన్‌ కనెక్షన్‌ కోసం ఇచ్చిన గుర్తింపు కార్డులోని పేరే కనిపించేలా చేయడానికి ట్రాయ్‌ అంగీకరించింది. 2024 ఫిబ్రవరిలో ‘ఇంట్రడక్షన్‌ ఆఫ్‌ కాలింగ్‌ నేమ్‌ ప్రెజెంటేషన్‌(సీఎన్‌ఏపీ) ఇన్‌ టెలికమ్యూనికేషన్‌ నెట్‌వర్క్స్‌’ పేరిట డాట్‌కు ట్రాయ్‌ చేసిన సిఫారసు ప్రకారం.. వినియోగదార్ల విజ్ఞప్తి అనంతరమే ఈ సర్వీస్‌ను యాక్టివేట్‌ చేయాలి. అయితే డిఫాల్ట్‌గా సీఎన్‌ఏపీ సేవ లభించేలా చూడాలని, అది వద్దనుకుంటే వినియోగదారు విజ్ఞప్తి చేసుకోవాలని సిఫారసులో మార్పు చేయాలని డాట్‌ కోరింది. అందుకు ట్రాయ్‌ తాజాగా అంగీకారం తెలిపింది. 

డిజిటల్‌ అరెస్ట్‌ వంటి సైబర్‌ నేరాలను అరికట్టేందుకు, మోసపూరిత కాల్స్‌ను నిలువరించేందుకు ఈ సిఫారసు ఉపయోగపడనుంది.

2జీ, 3జీ వినియోగదార్లకు దీనిని అమలు చేయడం క్లిష్టమని ట్రాయ్, డాట్‌ అభిప్రాయపడ్డాయి. 4జీ, అంతకుమించి సాంకేతికత ఉన్న ఫోన్లకే దీనిని వర్తింపజేయనున్నారు. తాజా పరిణామంతో డాట్‌ ఇక ఈ సేవలకు ఒక నియమావళి తీసుకురావడంపై తుది నిర్ణయం తీసుకోనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని