పుష్కర్‌లో పశువుల జాతా.. ధరల మోత!

Eenadu icon
By National News Desk Published : 29 Oct 2025 06:02 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

పుష్కర్‌ (అజ్‌మేర్‌): రాజస్థాన్‌లోని పుష్కర్‌లో గురువారం నుంచి మొదలై వారం రోజులపాటు కొనసాగనున్న పశు ప్రదర్శనలో రూ.15 కోట్ల గుర్రం, రూ.23 కోట్ల దున్నతోపాటు కేవలం 16 అంగుళాల ఎత్తు ఉన్న ఆవులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. దేశంలో పేరొందిన ఈ పశు ప్రదర్శన మేలు జాతుల పశువులకు, రికార్డు స్థాయిలో పలికే ధరలకు ప్రసిద్ధి. 3,028 గుర్రాలు, 1,306 ఒంటెలను వాటి యజమానులు ఇప్పటికే నమోదు చేయించారు. చండీగఢ్‌కు చెందిన వ్యాపారి గ్యారీ గిల్‌ తెచ్చిన 2.5 సంవత్సరాల మగ గుర్రం ‘షెహబాజ్‌’ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ‘‘రూ.2 లక్షల ప్రవేశ రుసుం ఉన్న ఈ గుర్రం ధర రూ.15 కోట్లు పలికే అవకాశముంది. నా వద్ద ఉన్న మార్వాడీ గుర్రానికి ఇప్పటికే రూ.9 కోట్ల ధర వచ్చింది’’ అని గిల్‌ తెలిపారు. రూ.23 కోట్ల ధర చెబుతున్న దున్న ‘అన్‌మోల్‌’ సైతం చూపరులను కట్టిపడేస్తోంది. నిత్యం పాలు, దేశీ నెయ్యి, డ్రై ఫ్రూట్స్‌ దీనికి ఆహారంగా పెడుతున్నట్లు యజమాని పల్మీంద్ర గిల్‌ చెప్పారు. 285 గుర్రపు పిల్లల జన్మదాత అయిన మార్వాడీ మగ గుర్రం ‘బాదల్‌’ ధరను రూ.11 కోట్లుగా దాని యజమాని చెబుతున్నారు. ఈ ప్రదర్శనకు 2,000 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు అజ్‌మేర్‌ గ్రామీణ డీఎస్పీ రామచంద్ర చౌధరి తెలిపారు. ప్రదర్శనకు వచ్చే పశువులు అన్నింటినీ ప్రవేశానికి ముందే వెటర్నరీ వైద్యులు పరీక్షించి ట్యాగ్‌లు పెడుతున్నట్లు పశుసంవర్ధక శాఖ జేడీ సునీల్‌ ఘియా చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని