అయోధ్య రామమందిరానికి ప్రజల విరాళం రూ.3,000 కోట్లు

Eenadu icon
By National News Desk Published : 30 Oct 2025 04:39 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అయోధ్య: పవిత్ర క్షేత్రం అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రజలు రూ.3,000 కోట్లకు పైగా విరాళాలు అందించారు. రామమందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్ర ఈ విషయాన్ని వెల్లడించారు. ఆలయ నిర్మాణానికి సుమారు రూ.1,800 కోట్లు ఖర్చయిందన్నారు. నవంబరు 25న ఆలయంలో జరిగే జెండా ఆవిష్కరణ వేడుకకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారని, 8 వేల మందికిపైగా ఆహ్వానితులు ఇందులో పాల్గొంటారని ఆయన చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని