PM Modi: మోదీకి బహుమతిగా 3 కిలోల వెండి కమలం

మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీకి బహుమతిగా అందజేసేందుకు జమ్మూ-కశ్మీర్‌కు చెందిన నగల వ్యాపారి రింకూ చౌహాన్‌ మూడు కిలోల స్వచ్ఛమైన వెండి ఉపయోగించి భాజపా చిహ్నమైన కమలం పువ్వును తయారు చేశారు.

Published : 10 Jun 2024 06:04 IST

జమ్మూ: మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీకి బహుమతిగా అందజేసేందుకు జమ్మూ-కశ్మీర్‌కు చెందిన నగల వ్యాపారి రింకూ చౌహాన్‌ మూడు కిలోల స్వచ్ఛమైన వెండి ఉపయోగించి భాజపా చిహ్నమైన కమలం పువ్వును తయారు చేశారు. అధికరణం 370 రద్దు, అయోధ్యలో రామ మందిరం నిర్మాణం వాగ్దానాలను మోదీ నెరవేర్చడంతో ఆయనకు వెండి కమలాన్ని బహూకరించాలన్న ఆలోచన వచ్చిందని భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) అధికార ప్రతినిధి అయిన చౌహాన్‌ వెల్లడించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని