DK Shivakumar: సీఎం లేదా నేను చెబితేనే..: నాయకత్వ మార్పుపై డీకే

ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలో కొంతకాలంగా సీఎం మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల తన తండ్రి రాజకీయ భవిష్యత్తుపై సీఎం సిద్ధరామయ్య కొడుకు చేసిన వ్యాఖ్యలతో ఈ వార్తలు మళ్లీ తెరపైకి వచ్చాయి. దీంతో నవంబరులో సీఎం మార్పు (Karnataka CM) ఉండొచ్చన్న ప్రచారం జోరందుకుంది. ఈ కథనాలను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (Deputy CM DK Shivakumar) మరోసారి కొట్టిపడేశారు. రాష్ట్ర ప్రభుత్వంలోని నేతలందరూ ఐక్యతతో ఉన్నారని.. ప్రస్తుతానికి తమకు మరో నాయకుడిని వెతకాల్సిన అవసరం లేదని అన్నారు.
దీనిపై ఏ విషయమైనా సీఎం లేదా తాను చెబితేనే నమ్మాలని..మరెవరి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపైనే దృష్టి పెట్టిందని.. తప్పుడు వార్తలపై కాదని డీకే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah)తో తన అనుబంధం ముందులాగానే కొనసాగుతోందని తెలిపారు. దీంతో రాష్ట్రంలో సీఎం మార్పు విషయంలో వినిపిస్తున్న ఊహాగానాలకు ఫుల్స్టాప్ పెట్టినట్లైంది.
రెండున్నరేళ్ల అనంతరం ముఖ్యమంత్రి పీఠం మార్పు ఉంటుందని కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దాన్నే విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు, కార్యకర్తలు బహిరంగంగానే దీనిపై వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలనే ఆశ తనకు ఉందనేలా డీకే పలుమార్లు పరోక్షంగా బదులిచ్చారు. అయితే, సిద్ధరామయ్యను గద్దె దించితే పార్టీ రెండుగా చీలిపోతుందని అధిష్ఠానం భయపడుతోంది. అందుకే.. ఆయనను కొనసాగించేందుకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
యూఏఈలోని ఓ ప్రవాస భారతీయుడికి బంపర్ ఆఫర్ తగిలింది. అబుధాబిలో నిర్వహించే ప్రముఖ లక్కీ డ్రా అయిన ‘బిగ్ టికెట్ అబుధాబి 280’ సిరీస్లో ప్రవాసుడైన శరవణన్ వెంకటాచలం రూ.60.38 కోట్లు (25 మిలియన్ల దిర్హామ్లు) గెలుచుకున్నారు. - 
                                    
                                        

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.. - 
                                    
                                        

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
Air India survivor: ఎయిరిండియా ప్రమాద ఘటలో ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్కడు విశ్వాస్ కుమార్ రమేశ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. - 
                                    
                                        

‘ఎస్ఐఆర్’కు ఈసీ రెడీ.. 12 రాష్ట్రాలు/యూటీల్లో అమలు
కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 4 నుంచి తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. - 
                                    
                                        

బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన.. ఏటా మూడు రోజులే అవకాశం
సారనాథ్లోని మూలగంధ కుటీ విహారలో గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాలను ప్రజాసందర్శనార్థం అందుబాటులో ఉంచారు. - 
                                    
                                        

తల్లి వర్ధంతి.. 290 మందికి రుణ విముక్తి
Surat Businessman: తల్లి వర్ధంతి రోజున అన్నదానాలు, వస్త్ర దానాలు నిర్వహిస్తుంటారు. పేదరికంలో ఉండేవారికి ఎంతోకొంత ఆర్థిక సాయం చేయడమూ చూస్తుంటాం. కానీ సూరత్కు చెందిన వ్యాపారవేత్త బాబూ భాయ్ జిరావాలా కొత్త ఆలోచన చేశారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


