Tejashwi Yadav: నాకు వయసు లేదేమో గానీ..: తేజస్వీ యాదవ్‌ కీలక వ్యాఖ్యలు

Eenadu icon
By National News Team Updated : 01 Nov 2025 15:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు (Bihar Assembly Polls) షెడ్యూల్‌ ఖరారైన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ దూకుడు పెంచాయి. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) ప్రచార జోరును పెంచారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఆర్జేడీ నేత హామీ ఇచ్చారు. ఈ హామీని అమలుచేయడంలో సాధ్యాసాధ్యాలపై మీడియా ఆయనను ప్రశ్నించగా, అందుకు తేజస్వీ బదులిస్తూ.. తనకు వయసు లేకపోవచ్చు కానీ.. పరిణతి ఉందన్నారు. దాని ఆధారంగానే హామీ ఇచ్చానని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికో ప్రభుత్వ ఉద్యోగం, ఆర్థికన్యాయం, సమ్మిళిత వృద్ధితో బిహార్‌ను భారత్‌లోనే నంబర్ వన్ రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో తాను ముందుకువెళ్తున్నట్లు తెలిపారు.  

తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలు ఉద్యోగాల కోసం, విద్యార్థులు కోచింగ్‌ల కోసం ఇళ్లు వదిలేసి..ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని తేజస్వీ అన్నారు. మూతబడిన జనపనార మిల్లుల పునరుద్ధరణ, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, ఐటీ పార్కులు, సెజ్‌ల అభివృద్ధి, బిహార్‌ను విద్యా కేంద్రంగా మార్చడం వంటి ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్లు తేజస్వీ తెలిపారు. అభివృద్ధి బిహార్‌లోని ప్రతి ఇంటి గుమ్మం ముందుకు చేరుకునేలా చర్యలు తీసుకుంటూ..స్వయం సమృద్ధిగల రాష్ట్రాన్ని సృష్టిస్తామని హామీ ఇచ్చారు. 

రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయలేకపోయాయని తేజస్వీ యాదవ్‌ విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే.. బిహార్‌ను పర్యాటకంగానూ అభివృద్ధి చేసి..దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. 

Tags :
Published : 01 Nov 2025 14:14 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని