Bihar polls: ‘ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం’ - మహాగఠ్బంధన్ మ్యానిఫెస్టో

ఇంటర్నెట్ డెస్క్: బిహార్లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Polls) సమయం దగ్గర పడుతున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో విపక్ష కూటమి మహాగఠ్బంధన్ మ్యానిఫెస్టో (INDIA bloc's Manifesto) విడుదల చేసింది. ‘తేజస్వీ ప్రతిజ్ఞా ప్రణ్’ పేరుతో ఈ మ్యానిఫెస్టోను ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, కాంగ్రెస్ నేత పవన్ ఖేడా తదితరుల సమక్షంలో విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ తదితర హామీలు ఇందులో పేర్కొన్నారు. బిహార్ను అభివృద్ధిపథంలో నడిపించడంతోపాటు దేశంలో నంబర్ వన్గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్ వెల్లడించారు.
అంతకుముందు పార్సా, సారణ్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తేజస్వి.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం స్వేచ్ఛగా లభిస్తోందని, ఇంటికే నేరుగా మద్యం సరఫరా అవుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే నిషేధం నుంచి కల్లుకు మినహాయింపు ఇస్తామన్నారు. విద్య, ఆరోగ్య సదుపాయాలు, ఉపాధి, సాగునీటిని అందించే ప్రభుత్వాన్ని బిహార్ ప్రజలు కోరుకుంటున్నారని.. గత ఇరవై ఏళ్లలో ఎన్డీయే కూటమి వీటిని చేపట్టలేకపోయిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే వీటిని పూర్తి చేసి చూపిస్తామన్నారు.
నిత్యం దోపిడీలు..
‘‘సారణ్లో హత్యలు, దోపిడీ, అపహరణలు నిత్యకృత్యమయ్యాయి. అయినప్పటికీ సీఎం నీతీశ్ కుమార్ (Nitish Kumar) పట్టించుకోవడం లేదు. ఒక్కసారి కూడా బాధితులను పరామర్శించలేదు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే శాంతిభద్రతలను కాపాడటంతోపాటు ఉద్యోగాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం’’ అని తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు.
బిహార్లో 2016 నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు అవుతోంది. మద్యం తయారీ, అమ్మకం, వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ ఉల్లంఘనలు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ కూడా తాము అధికారంలోకి వస్తే మద్యం నిషేధాన్ని ఎత్తివేస్తామని ఇదివరకే ప్రకటించింది. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్లో నవంబర్ 6 తొలిదశ, నవంబర్ 11న రెండోదశలో పోలింగ్ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

మగధ్లో మహా ఉత్కంఠ!
బిహార్లోని మగధ్ ప్రాంతంలో అసెంబ్లీ పోరు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎన్డీఏ, మహాగఠ్బంధన్ల మధ్యలో గట్టి పోటీ నెలకొంది. - 
                                    
                                        

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
Air India survivor: ఎయిరిండియా ప్రమాద ఘటలో ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్కడు విశ్వాస్ కుమార్ రమేశ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. - 
                                    
                                        

తల్లి వర్ధంతి.. 290 మందికి రుణ విముక్తి
Surat Businessman: తల్లి వర్ధంతి రోజున అన్నదానాలు, వస్త్ర దానాలు నిర్వహిస్తుంటారు. పేదరికంలో ఉండేవారికి ఎంతోకొంత ఆర్థిక సాయం చేయడమూ చూస్తుంటాం. కానీ సూరత్కు చెందిన వ్యాపారవేత్త బాబూ భాయ్ జిరావాలా కొత్త ఆలోచన చేశారు. - 
                                    
                                        

వారసత్వ రాజకీయాలతో ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు: శశిథరూర్
వారసత్వ రాజకీయాలు భారత ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పేర్కొన్నారు. - 
                                    
                                        

కరూర్ తొక్కిసలాట ఘటన..విజయ్ కార్యాలయానికి సీబీఐ
కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులు సోమవారం టీవీకే పార్టీ ప్రధాన కార్యాలయంలో దర్యాప్తు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. - 
                                    
                                        
అభిమాని హత్య కేసు.. దర్శన్, పవిత్రపై నేరాభియోగాలు
Darshan: అభిమాని హత్యకేసులో నిందితుడైన కన్నడ నటుడు దర్శన్పై అభియోగాలు నమోదయ్యాయి. - 
                                    
                                        

రూ.3వేల కోట్లు కొల్లగొట్టారు.. డిజిటల్ అరెస్టులపై కఠినచర్యలు: సుప్రీంకోర్టు
Digital Arrests: డిజిటల్ అరెస్టులపై జరిపిన విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. - 
                                    
                                        

‘అనవసర అంశాలపైనే ప్రసంగాలు’.. ప్రధానిపై ప్రియాంక గాంధీ విసుర్లు!
దేశాన్ని, బిహార్ను అవమానించారంటూ ప్రతిపక్ష నేతలందరిపై ప్రధాని నరేంద్ర మోదీ ముద్ర వేస్తున్నారని ప్రియాంక గాంధీ విమర్శించారు. - 
                                    
                                        

భారత పుత్రికలు చరిత్ర సృష్టించారు: ప్రధాని మోదీ
PM Modi: మహిళజట్టు వన్డే ప్రపంచకప్ విజయంపై ప్రధాని మోదీ స్పందించారు. - 
                                    
                                        

మీకు హైకమాండ్ చెప్పిందా: సీఎం మార్పుపై సిద్ధరామయ్య
నాయకత్వ మార్పుపై ప్రజలు ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతారని.. వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. - 
                                    
                                        

భారత్ టెక్ పవర్హౌస్గా ఎదిగేందుకు ప్రైవేటు పెట్టుబడులు: ప్రధాని మోదీ
సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం మరింత అభివృద్ధి చెందడానికి ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. - 
                                    
                                        

బిహార్లో గెలుస్తాం.. 18న ప్రమాణం చేస్తాం
బిహార్లో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమని ఇండియా కూటమి తరఫు ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ పునరుద్ఘాటించారు. - 
                                    
                                        

హత్యలు, అపహరణలు, దోపిడీలకు మంత్రిత్వశాఖలు
బిహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఒకవేళ ఇండియా కూటమికి వస్తే.. హత్యలు, అపహరణలు, దోపిడీలకు మూడు మంత్రిత్వ శాఖలను తేజస్వీ యాదవ్ ఏర్పాటు చేస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్షా తీవ్ర ఆరోపణ చేశారు. - 
                                    
                                        

దిల్లీ గాలి కాలుష్యంపై తక్షణమే చర్యలు తీసుకోండి
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. గత రెండు వారాలుగా అక్కడ గాలి నాణ్యత బాగా క్షీణించింది. - 
                                    
                                        

దేశాభివృద్ధికి మహిళల భాగస్వామ్యం అవసరం
మనదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మహిళల భాగస్వామ్యంతో పాటు అందరి సమష్టి కృషి అవసరమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. - 
                                    
                                        

వ్యాపారవేత్తల చేతి రిమోట్ కంట్రోల్గా మోదీ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే ప్రధాని మోదీ భయపడిపోతారని.. ఆయన బడా వ్యాపారవేత్తల చేతి రిమోట్ కంట్రోల్లాంటివారని లోక్సభ విపక్షనేత రాహుల్గాంధీ విమర్శించారు. - 
                                    
                                        

పహల్గాంలో కేబుల్ కార్ పనులకు ఎన్ఐయే సుముఖత
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో కేబుల్ కార్ ప్రాజెక్టు చేపట్టడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐయే) ఇటీవల జమ్మూకశ్మీర్ ప్రభుత్వానికి తెలిపింది. - 
                                    
                                        

కాంగ్రెస్ తలపై తుపాకీ ఎక్కుపెట్టి.. తేజస్విని సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ ప్రకటించింది
బిహార్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య సంబంధాలు సవ్యంగా లేవని ప్రధాని మోదీ పేర్కొన్నారు. - 
                                    
                                        

పెయింట్ ది సిటీతో ధంతరీ సుందరీకరణ
ఈటీవీ భారత్: ఛత్తీస్గఢ్లోని ధంతరీ నగరంలో జిల్లా అధికార యంత్రాంగం, మున్సిపల్ కార్పొరేషను సిబ్బంది ‘పెయింట్ ది సిటీ’ పేరుతో వినూత్న సుందరీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. - 
                                    
                                        

బీసీఏ పట్టభద్రుడి బండి.. తందూరీ సమోసావాలా!
బీసీఏ చదివి ప్రోగ్రామింగులో ప్రత్యేక శిక్షణ పొందిన మనేశ్వర్ చేస్తున్న ఉద్యోగం వదిలి సమోసావాలాగా మారారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఏలూరు జిల్లాలో బస్సు బోల్తా.. ఇద్దరి పరిస్థితి విషమం
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 - 
                        
                            

చేవెళ్ల దుర్ఘటన.. బస్సు డ్రైవర్ తప్పేం లేదు: ఆర్టీసీ ప్రకటన
 - 
                        
                            

తల్లి వర్ధంతి.. 290 మందికి రుణ విముక్తి
 - 
                        
                            

ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు.. భూసేకరణకు ప్రభుత్వం అనుమతి
 - 
                        
                            

జోగి రమేశ్ను కస్టడీకి కోరుతూ ఎక్సైజ్శాఖ పిటిషన్
 


