LS polls: మెజార్టీల్లో రికార్డుల మోత.. 11 లక్షలతో ఆయనే టాప్!
సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన వ్యక్తిగా భాజపా నేత ప్రీతమ్ ముండే పేరిట రికార్డు ఉండగా.. తాజాగా ఆ రికార్డును లాల్వానీ అధిగమించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన నేతల్లో.. పలువురు భారీ మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు. ఇందౌర్ లోక్సభ స్థానం సిటింగ్ ఎంపీ శంకర్ లాల్వానీ.. తన సమీప ప్రత్యర్థిపై ఏకంగా 11.72 లక్షల ఓట్ల మెజార్టీ సాధించి చరిత్ర తిరగరాశారు. మొత్తంగా ఆయనకు 12,26,751 ఓట్లు పోలవగా.. రెండో స్థానంలో నోటా (NOTA)కు 2,18,674 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థికి కేవలం 51వేల ఓట్లు మాత్రమే రావడం గమనార్హం.
సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన వ్యక్తిగా భాజపా నేత ప్రీతమ్ ముండే పేరిట రికార్డు ఉండగా.. తాజాగా ఆ రికార్డును లాల్వానీ అధిగమించారు. బీఢ్ లోక్సభ స్థానానికి 2014లో జరిగిన ఉప ఎన్నికలో 6.96 లక్షల ఓట్ల తేడాతో ఆమె గెలుపొందారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, గుజరాత్ భాజపా నేత సీఆర్ పాటిల్లు ఏడు లక్షలకు పైగా మెజార్టీ సాధించిన వారి జాబితాలో ఉన్నారు.
- ఆస్సాంలోని ధుబ్రీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి రకీబుల్ హుస్సేన్ 10.12 లక్షల మెజార్టీతో విజయం సాధించారు.. ఆయనకు 14,71,885 ఓట్లు వచ్చాయి.
- మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశ నుంచి పోటీచేసి 8.21లక్షల మెజార్టీతో గెలుపొందారు. మొత్తంగా ఆయనకు 16.11 లక్షల ఓట్లు వచ్చాయి.
- 2019 ఎన్నికల్లో గుజరాత్లోని నవసరిలో భాజపా నేత సీఆర్ పాటిల్ 6.89 లక్షల మెజార్టీ సాధించగా.. తాజా ఎన్నికల్లో 7.73 లక్షలకుపైగా మెజార్టీతో సొంత రికార్డును తిరగరాసుకున్నారు.
- అమిత్ షాకు మొత్తం 10.10 లక్షల ఓట్లు రాగా.. ప్రత్యర్థిపై 7.44 లక్షల మెజార్టీ సాధించారు.
- బెంగాల్లోని డైమండ్ హార్బర్ లోక్సభ స్థానం సిటింగ్ ఎంపీ అభిషేక్ బెనర్జీ (టీఎంసీ) 7.10 లక్షల మార్జిన్తో విజయం సాధించారు. ఆయనకు 10.48 లక్షల ఓట్లు పోలయ్యాయి.
- మధ్యప్రదేశ్లోని గుణ లోక్సభ స్థానం నుంచి బరిలో దిగిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా..5.4 లక్షల మెజార్టీతో గెలుపొందారు.
- వడోదర నుంచి భాజపా అభ్యర్థి హేమంగ్ జోషి 5.82 లక్షల మెజార్టీతో విజయం సాధించారు.
- తెలంగాణలోని నల్గొండ లోక్సభ నుంచి బరిలో ఉన్న కుందూరు రఘువీర్ 5.59 లక్షల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు మొత్తంగా 7.84 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి.
- ఖమ్మం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి 4.67లక్షల మెజార్టీతో ముందున్నారు. మొత్తం ఆయనకు 7.66 లక్షలకుపైగా ఓట్లు వచ్చాయి.
- మల్కాజిగిరి భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్.. 3.91 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
- రాయ్బరేలీ నుంచి బరిలో దిగిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. 3.90 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. వయనాడ్ నుంచి కూడా 3.64 లక్షల మార్జిన్తో గెలుపొందారు.
- వారణాసి నుంచి పోటీలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. 1.52 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
కార్గిల్ యుద్ధం సమయంలో మోదీ అక్కడి యుద్ధ వీరులతో ముచ్చటించిన పలు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
పెండింగ్ బిల్లుల విషయంలో కేరళ, బెంగాల్ గవర్నర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
అగ్నిపథ్ పథకం దేశ సైన్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకువచ్చిన సంస్కరణ అని మోదీ(PM Modi) తెలిపారు. -
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని హెచ్చరించారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. -
92 వేల అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. -
నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్
కార్గిల్ 25వ విజయ్ దివస్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులర్పించనున్నారు. -
గూగుల్ మ్యాప్స్లో సరికొత్త ఫీచర్లు
భారతీయ వినియోగదారులను మరింతగా ఆకర్షించేలా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ మ్యాప్స్ ప్రకటించింది. -
ఇద్దరు ఝార్ఖండ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఝార్ఖండ్ శాసనసభ స్పీకర్ ట్రైబ్యునల్ గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు (7)
తిహాడ్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడంపై ‘ఇండియా’ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. -
మహారాష్ట్ర, హిమాచల్లలో కుంభవృష్టి
హిమాచల్, మహారాష్ట్రల్లో కుండపోత వర్షాలు కురిసి జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ముంబయిలో 9 గంటల వ్యవధిలో 100 మి.మీ. పైగా వాన దంచికొట్టింది. -
ముమ్మాటికీ వివక్షేనన్న విపక్షం
కేంద్ర బడ్జెట్లో ఒకటిరెండు రాష్ట్రాలకు తప్పిస్తే మిగిలినవాటికి అన్యాయం జరిగిందని విపక్ష సభ్యులు మరోసారి గట్టిగా గళం వినిపించడంతో గురువారం పార్లమెంటు ఉభయసభలు దాదాపు స్తంభించిపోయాయి. -
ట్రంకు పెట్టెల బదులు ట్రాలీ బ్యాగులు
లోకోపైలట్లు, గార్డులు ఇకపై తమ వ్యక్తిగత వస్తువుల్ని, విధి నిర్వహణకు అవసరమైన సామగ్రిని ఇనుప ట్రంకు పెట్టెల్లో కాకుండా ట్రాలీ బ్యాగుల్లో తీసుకువెళ్లాల్సి ఉంటుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు