President Murmu: నేడు రఫేల్‌లో రాష్ట్రపతి గగనవిహారం

Eenadu icon
By National News Desk Published : 29 Oct 2025 06:01 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం భారత వైమానిక దళానికి చెందిన రఫేల్‌ యుద్ధవిమానంలో గగనవిహారం చేయనున్నారు. హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరం ఇందుకు వేదిక కానుంది. మాజీ రాష్ట్రపతులు అబ్దుల్‌ కలాం, ప్రతిభా పాటిల్‌లు గతంలో సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధవిమానంలో విహరించారు. ముర్ము 2023 ఏప్రిల్‌ 8న ఇదే ఫైటర్‌ జెట్‌లో గగనయానం చేశారు. ఇప్పుడు రఫేల్‌ యుద్ధవిమానంలో ఆమె పయనించనున్నారు. ఈ జెట్‌లను ఈ ఏడాది మే నెలలో ఆపరేషన్‌ సిందూర్‌లో ఉపయోగించిన సంగతి తెలిసిందే. వీటి సాయంతో నాడు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ దాడులు చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని