SIR 2: ఎస్ఐఆర్-2కు నగారా
జాబితాలో 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు
నేటి నుంచే ప్రక్రియ అమలు
అర్హులైన ఓటర్లలో ఎవరినీ తొలగించం: ఈసీ
అస్సాంకు ప్రత్యేక ఉత్తర్వులు ఇస్తామని వెల్లడి

దిల్లీ: ఓటరు జాబితాల ‘ప్రత్యేక ముమ్మర సవరణ’ (ఎస్ఐఆర్) రెండోదశను తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఈ విషయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్కుమార్ సోమవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. గోవా, ఛత్తీస్గఢ్, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, లక్షద్వీప్లలో వెంటనే ఈ కసరత్తు చేపట్టనున్నామని తెలిపారు. 2026 ఫిబ్రవరి నాటికి ఇది పూర్తవుతుందని చెప్పారు. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమబెంగాల్లలో 2026లో ఎన్నికలు జరగబోతున్నాయని, అస్సాంలోనూ ఎన్నికలున్నా అక్కడి సవరణపై ప్రకటనను విడిగా వెలువరిస్తామని స్పష్టంచేశారు. పౌరసత్వ చట్టం వల్ల అస్సాంలో నిబంధనలు విడిగా ఉంటాయని తెలిపారు.
ఇప్పటివరకు తొమ్మిదిసార్లు
స్వాతంత్య్రం వచ్చాక ఇప్పటివరకూ ముమ్మర సవరణలు దేశంలో తొమ్మిదిసార్లు నిర్వహించామని, చివరిసారిగా 2002-04 మధ్య ఎస్ఐఆర్ జరిగిందని జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. ‘ఒక్క అప్పీలుకూ అవకాశం లేకుండా బిహార్లో తొలివిడత ఎస్ఐఆర్ ఇటీవలే పూర్తిచేశాం. ఈ విడతలో 51 కోట్లమందిని పరిశీలిస్తాం. అర్హుడైన ఏ ఒక్క ఓటరునూ జాబితా నుంచి తొలగించబోం. అప్పీలు అవకాశం ఉంటుంది. అర్హులైన ఓటర్లే జాబితాలో ఉంటారు. తొలగించినవారి పేర్లను స్థానిక కార్యాలయాల్లో ప్రదర్శిస్తాం’ అని వివరించారు. పశ్చిమబెంగాల్తో ఈసీకి ఎలాంటి ఘర్షణా లేదని, రాజ్యాంగబద్ధ విధిని తాము నిర్వర్తిస్తున్నామని స్పష్టంచేశారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనకు సిబ్బందిని సమకూర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు.
ఆధార్ పరిగణనలోకి..
ఎస్ఐఆర్కు ప్రజలు సమర్పించాల్సిన పత్రాల్లో ఆధార్నూ చేర్చాలని ఈసీ నిర్ణయించింది. బిహార్లో ఎస్ఐఆర్ తర్వాత ప్రచురించిన ఓటర్ల జాబితానూ ఇలా ఆధారంగా చూపించేందుకు వీలుందని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు ఆదేశాలిచ్చింది. మునుపటి ఎస్ఐఆర్ ఆధారంగా ఓటర్ల మదింపు దరఖాస్తుల్లో నింపిన వివరాలు సరిపోకపోతే ఓటర్ల నమోదు అధికారులు నోటీసులు జారీచేస్తారు. అప్పుడు ఓటర్లు తమవద్దనున్న పత్రాలు సమర్పించాలి. 1987 జులై ఒకటో తేదీకి ముందు ప్రభుత్వ, స్థానిక సంస్థలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎల్ఐసీ, ప్రభుత్వరంగ సంస్థల్లో ఏవైనా జారీచేసిన ఐడీ కార్డులు, పింఛన్ చెల్లింపు ఉత్తర్వులు వంటివి దీనికి చెల్లుతాయి. పుట్టిన తేదీని ధ్రువీకరించే పత్రం, పాస్పోర్ట్, విద్యార్హతల పత్రాలు, శాశ్వత నివాస ధ్రువపత్రం, అటవీహక్కుల చట్టం, కుల ధ్రువీకరణ పత్రం.. వీటిలో ఏవి ఉన్నా సమర్పించవచ్చు. ఈ 12 రాష్ట్రాల్లో ఎవరైనా ఒక వ్యక్తి బిహార్ ఓటర్ల జాబితాలో తమ తల్లిదండ్రుల పేర్లను చూపిస్తే అప్పుడు.. పుట్టినతేదీ ధ్రువపత్రం మినహా పౌరసత్వ ధ్రువీకరణకు ఎలాంటి పత్రాలు ఇవ్వాల్సిన పనిలేదని ఈసీ తెలిపింది.
ఈసీ విశ్వసనీయత ప్రశ్నార్థకం: కాంగ్రెస్
ఓటర్ల జాబితాల సవరణలో ఈసీ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా ఉందని, ఓటర్లు గానీ, విపక్షం గానీ సంతృప్తి వ్యక్తంచేయడం లేదని కాంగ్రెస్ పేర్కొంది. బిహార్లో ఒక్క ఓటరునూ తొలగించకపోగా 65 లక్షల మందిని చేర్చిన నేపథ్యంలో ఎస్ఐఆర్పై లేవనెత్తిన ప్రశ్నలకు ఇంతవరకు సమాధానాలు రాలేదని పార్టీ ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేడా చెప్పారు. ఓటర్ల జాబితా సవరణతో తమకెలాంటి ఇబ్బంది లేదని, ఈ పేరుతో అర్హులైన ఓటర్లను తొలగించడానికి ఎలాంటి ప్రయత్నం జరిగినా ప్రజాస్వామ్యయుతంగా అడ్డుకుంటామని తృణమూల్ కాంగ్రెస్ తెలిపింది. ఎన్నికల్లో వరస ఓటములకు సాకులు వెతుక్కోవడంలో భాగంగానే ఎస్ఐఆర్ను విపక్షం తప్పుపడుతోందని భాజపా ఆరోపించింది. విపక్షాలను ‘అసంతృప్త ఆత్మల మంద’గా నిందించింది. అవి కపట బుద్ధికి మారుపేరు అని పార్టీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా విరుచుకుపడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో సవరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నవారే ఈ ప్రక్రియను ఇప్పుడు తప్పుబట్టడమేంటని ప్రశ్నించారు.
జరిగేది ఇలా...
ఎన్యూమరేషన్ పత్రాల ముద్రణ, శిక్షణ: మంగళవారం నుంచి వచ్చే నెల 3 వరకు 
ఇంటింటికీ వెళ్లి ఓటర్ల నమోదు: నవంబరు 4 నుంచి డిసెంబరు 4 వరకు 
ముసాయిదా ఓటరు జాబితాల ప్రచురణ: డిసెంబరు 9 
అభ్యంతరాల స్వీకరణ: డిసెంబరు 9 నుంచి 2026 జనవరి 8 
వీటి విచారణ, పరిశీలన: డిసెంబరు 9 నుంచి 2026 జనవరి 31 
తుది ఓటరు జాబితా ప్రచురణ: 2026 ఫిబ్రవరి 7
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

బిహార్లో గెలుస్తాం.. 18న ప్రమాణం చేస్తాం
బిహార్లో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమని ఇండియా కూటమి తరఫు ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ పునరుద్ఘాటించారు. - 
                                    
                                        

హత్యలు, అపహరణలు, దోపిడీలకు మంత్రిత్వశాఖలు
బిహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఒకవేళ ఇండియా కూటమికి వస్తే.. హత్యలు, అపహరణలు, దోపిడీలకు మూడు మంత్రిత్వ శాఖలను తేజస్వీ యాదవ్ ఏర్పాటు చేస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్షా తీవ్ర ఆరోపణ చేశారు. - 
                                    
                                        

దిల్లీ గాలి కాలుష్యంపై తక్షణమే చర్యలు తీసుకోండి
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. గత రెండు వారాలుగా అక్కడ గాలి నాణ్యత బాగా క్షీణించింది. - 
                                    
                                        

దేశాభివృద్ధికి మహిళల భాగస్వామ్యం అవసరం
మనదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మహిళల భాగస్వామ్యంతో పాటు అందరి సమష్టి కృషి అవసరమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. - 
                                    
                                        

వ్యాపారవేత్తల చేతి రిమోట్ కంట్రోల్గా మోదీ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే ప్రధాని మోదీ భయపడిపోతారని.. ఆయన బడా వ్యాపారవేత్తల చేతి రిమోట్ కంట్రోల్లాంటివారని లోక్సభ విపక్షనేత రాహుల్గాంధీ విమర్శించారు. - 
                                    
                                        

పహల్గాంలో కేబుల్ కార్ పనులకు ఎన్ఐయే సుముఖత
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో కేబుల్ కార్ ప్రాజెక్టు చేపట్టడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐయే) ఇటీవల జమ్మూకశ్మీర్ ప్రభుత్వానికి తెలిపింది. - 
                                    
                                        

కాంగ్రెస్ తలపై తుపాకీ ఎక్కుపెట్టి.. తేజస్విని సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ ప్రకటించింది
బిహార్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య సంబంధాలు సవ్యంగా లేవని ప్రధాని మోదీ పేర్కొన్నారు. - 
                                    
                                        

పెయింట్ ది సిటీతో ధంతరీ సుందరీకరణ
ఈటీవీ భారత్: ఛత్తీస్గఢ్లోని ధంతరీ నగరంలో జిల్లా అధికార యంత్రాంగం, మున్సిపల్ కార్పొరేషను సిబ్బంది ‘పెయింట్ ది సిటీ’ పేరుతో వినూత్న సుందరీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. - 
                                    
                                        

బీసీఏ పట్టభద్రుడి బండి.. తందూరీ సమోసావాలా!
బీసీఏ చదివి ప్రోగ్రామింగులో ప్రత్యేక శిక్షణ పొందిన మనేశ్వర్ చేస్తున్న ఉద్యోగం వదిలి సమోసావాలాగా మారారు. - 
                                    
                                        

మహాత్ముడి బాటలో.. ఊరు ఊరంతా శాకాహారులే
ఝార్ఖండ్లోని లాతెహార్ జిల్లా బార్వాగఢ గ్రామంలో అందరూ శాకాహారులే. వీరిలో ఎక్కువమంది తానా భగత్ సమాజానికి చెందినవారు. - 
                                    
                                        

క్లిష్ట పరిస్థితులు.. మీ పాలిట వరాలు
అడ్డంకులు మీ నిబద్ధతను పరీక్షిస్తాయి. వైఫల్యాలు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి అవసరమైన విలువైన సూచనలు అందిస్తాయి. - 
                                    
                                        

46 నుంచి 38కి తగ్గిన నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య
దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో ఈ ఏడాది ఏప్రిల్ 1నాటికి 46గా ఉన్న నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య 38కి తగ్గినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజా సమీక్షలో పేర్కొంది. - 
                                    
                                        

భళా.. బాహుబలి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన సీఎంఎస్-03 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. బాహుబలి రాకెట్గా పేరొందిన ‘ఎల్వీఎం3-ఎం5’ వాహకనౌక ద్వారా ఇది నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది. - 
                                    
                                        

హిమగిరులకే చెమట పట్టించారు
ఉత్తరాఖండ్ రజతోత్సవాల్లో భాగంగా హిమగిరుల్లో నిర్వహించిన ‘ఆది కైలాశ్ అల్ట్రా మారథాన్’లో 14,000 అడుగుల ఎత్తున, మైనస్ 2 డిగ్రీల ఉష్ణోగ్రత నడుమ అథ్లెట్లు పరుగు తీశారు. - 
                                    
                                        

పశ్చిమ కనుమల్లో జడలబర్రెలు!
హిమాలయ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే జడల బర్రెలు.. కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లోని చల్లని వాతావరణానికీ అలవాటు పడుతున్నాయి. - 
                                    
                                        

80 ఏళ్ల టీచరమ్మ.. నెట్టింట్లో పద్య కవితాసేవ
ఆమె కవయిత్రి కాదు.. రచయిత్రి కూడా కాదు. అయితేనేం 80 ఏళ్ల వయసులో మలయాళ పద్య కవితా వైభవాన్ని భావితరాలకు అందించేందుకు అవిశ్రాంత కృషి చేస్తున్నారు. - 
                                    
                                        

తమిళనాట ‘సర్’ వద్దు.. అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం
తమిళనాట ఓటర్ల జాబితాలో ప్రత్యేక సవరణ పనులు విడనాడాలని ఎన్నికల కమిషన్ను ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ నేతృత్వంలోని అఖిలపక్ష సమావేశం కోరింది. - 
                                    
                                        

పదేపదే ప్రమాదాలు జరుగుతుంటే గుత్తేదారులకు భారీ జరిమానా
జాతీయ రహదారులపై పదే పదే ప్రమాదాలు జరుగుతున్నట్లయితే ఆ ప్రాంతంలో పనులు చేసిన గుత్తేదారులకు భారీ జరిమానాలు విధించాలని ‘కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ’ నిర్ణయించింది. - 
                                    
                                        

రైతులు రుణాలు తిరిగి చెల్లించే అలవాటు చేసుకోవాలి - అజిత్ పవార్
రైతులు ప్రతిసారి మాఫీ కోసం వేచి చూడకుండా, సాధ్యమైతే రుణాలు తిరిగి చెల్లించాలని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ సూచించారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చేవెళ్ల బస్సు దుర్ఘటనకు అదీ ఒక కారణమే: మంత్రి పొన్నం
 - 
                        
                            

గాలి వాటం కాదు.. డబ్ల్యూపీఎల్ వేసిన పీఠం ఇది!
 - 
                        
                            

కరూర్ తొక్కిసలాట ఘటన..విజయ్ కార్యాలయానికి సీబీఐ
 - 
                        
                            
అభిమాని హత్య కేసు.. దర్శన్, పవిత్రపై నేరాభియోగాలు
 - 
                        
                            

కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్.. అదరగొట్టిన ‘మంజుమ్మల్ బాయ్స్’.. విజేతలు వీళ్లే
 - 
                        
                            

ఏపీలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న హిందుజా గ్రూప్!
 


