Siddaramaiah: ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు.. సీఎం సిద్ధూ కీలక నిర్ణయం

ఇంటర్నెట్డెస్క్: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) కీలక నిర్ణయం తీసుకున్నారు. అభివృద్ధి పనుల నిమిత్తం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల గ్రాంట్ విడుదల చేసేందుకు ఆమోదం తెలిపారు. పార్టీలో అంతర్గతంగా జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు.
తమ నియోజవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం నిధులు సరిపోవడం లేదని కర్ణాటక పార్టీ ఇంఛార్జి రణదీప్ సూర్జేవాలా వద్ద ఇటీవల ఎమ్మెల్యేలు మొరపెట్టుకున్నారు. బెంగళూరులోని పార్టీ ఆఫీస్లో విడివిడిగా ఒక్కో ఎమ్మెల్యే ఆయనతో మాట్లాడారు. నిధుల జాప్యంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన ప్రాజెక్టులు కుంటుపడుతున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని సూర్జేవాలా సీఎం, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై అంతర్గతంగా జరిగిన చర్చ అనంతరం.. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న కేటాయింపుల విడుదలకు ముఖ్యమంత్రి అంగీకరించారు. దీంతో ప్రతి ఎమ్మెల్యే రూ.50 కోట్ల గ్రాంట్ను పొందనున్నారు.
ఇదిలా ఉంటే.. నిధుల విడుదలలో జాప్యంపై ఎమ్మెల్యేల్లో కొద్దికాలంగా తీవ్ర అసహనం నెలకొంది. ఈ విషయమై గత నెల కాగ్వాడ్ ఎమ్మెల్యే రాజు కగే.. సొంత ప్రభుత్వంపై బహిరంగంగా అసహనం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు ముందుకు సాగడంలేదని, ఈ వైఫల్యంపై తాను నిరాశ చెందానని విమర్శలు చేశారు. అలాగే రాజీనామాకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలోనే తాజా నిర్ణయం వెలువడింది.
ఇదిలా ఉంటే.. కొద్దిరోజులుగా కర్ణాటక రాజకీయాలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని ప్రచారం జరుగుతుండటం, అగ్రనాయకులు వాటిని తోసిపుచ్చుతున్న పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మరోపక్క, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు కోసం ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు బేరసారాలు మొదలుపెట్టారని భాజపా ఆరోపిస్తోంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వాళ్లిద్దరూ సిద్ధంగా ఉన్నారని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భాజపా ప్రయత్నాలు చేస్తోందని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వాదనను తోసిపుచ్చుతూ.. ఈ విధంగా స్పందించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ..జట్టులో ద్రవిడ్ కుమారుడు
 - 
                        
                            

ఖర్గేజీ.. రాహుల్ పెళ్లి ఎప్పుడో చెప్పండి: భాజపా సెటైర్లు
 - 
                        
                            

మంత్రి అజారుద్దీన్కు శాఖల కేటాయింపు
 - 
                        
                            

నాకు ఏం జరిగిందో గుర్తులేదా..? థరూర్ను హెచ్చరించిన భాజపా నేత
 - 
                        
                            

లాలూ తాతలు దిగొచ్చినా.. ఆ సొమ్ము దోచుకోలేరు: అమిత్ షా
 - 
                        
                            

చాట్జీపీటీ గో ఫ్రీ ప్లాన్ .. ఎలా పొందాలంటే?
 


