Criminal Laws: కొత్త నేర చట్టాలు.. జులై 1 నుంచి అమల్లోకి
మూడు నేర చట్టాలు ఈ ఏడాది జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈమేరకు కేంద్రం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.
దిల్లీ: బ్రిటిష్ వలస పాలన నాటి నేర న్యాయవ్యవస్థను ప్రక్షాళించేలా రూపొందించిన మూడు నేర చట్టాలు (Criminal Laws) ఈ ఏడాది జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈమేరకు కేంద్రం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి (IPC), నేర శిక్షాస్మృతి (CrPC), భారత సాక్ష్యాధార చట్టం-1872ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS), భారతీయ సాక్ష్య (BS) చట్టాలను వర్తింపజేయనున్నారు. గతేడాది ఆగస్టులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ మూడు బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఉభయ సభల ఆమోదం అనంతరం డిసెంబరు 25న రాష్ట్రపతి సంతకంతో అవి చట్టరూపం దాల్చాయి.
నేర న్యాయ వ్యవస్థలో సమగ్ర మార్పులతో నేర బిల్లులను కొత్తగా తెచ్చామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ బిల్లుల ఆమోదం సందర్భంగా పార్లమెంట్లో తెలిపారు. ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వడంతో పాటు రాజద్రోహం వంటి పదాలను తొలగించామని, దేశానికి వ్యతిరేకంగా జరిగే దాడులను చేర్చామని వివరించారు. భారతీయ భావనతో న్యాయ వ్యవస్థ ఉండేలా బిల్లులను తెచ్చామని, బానిసత్వ భావనల నుంచి విముక్తి కల్పించామని చెప్పారు. పాత చట్టంలో అత్యాచారానికి 375, 376 సెక్షన్లు ఉండేవి. కొత్త బిల్లులో దానిని సెక్షన్ 63గా పేర్కొన్నారు. పాత చట్టంలో హత్యకు 302 సెక్షన్ ఉండగా.. కొత్త బిల్లులో దానిని 101 సెక్షన్గా పెట్టారు. కిడ్నాప్నకు పాత చట్టంలో 359వ సెక్షన్ ఉండేది. కొత్త బిల్లులో దానిని సెక్షన్ 136 కింద చేర్చారు.
ఏయే బిల్లులో ఏముందంటే?
న్యాయ సంహిత బిల్లు
- కొత్తగా 20 నేరాల చేర్పు.
- ఐపీసీలోని 19 నిబంధనల తొలగింపు.
- 33 నేరాల్లో జైలు శిక్ష పెంపు.
- 83 నేరాల్లో జరిమానా పెంపు.
- 23 నేరాల్లో తప్పనిసరి కనీస శిక్ష విధింపు.
- కొత్తగా 6 నేరాల్లో సమాజ సేవా శిక్ష.
- పిల్లలకు నిర్వచనం.
- జెండర్లో ట్రాన్స్జెండర్ల చేర్పు.
- దస్త్రాలుగా ఎలక్ట్రానిక్, డిజిటల్ రికార్డుల పరిగణన.
- చరాస్తికి విస్తృత నిర్వచనం.
- మహిళలు, పిల్లలపై నేరాలకు కొత్త అధ్యాయం.
- నేర ప్రయత్నం, ప్రేరణ, కుట్రకు ప్రత్యేక అధ్యాయం.
- వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద చర్యలు, హిట్ అండ్ రన్, మూక దాడి, పిల్లలను నేరాలకు వినియోగించడం, మహిళలను వ్యభిచార వృత్తిలోకి దింపడం, గొలుసు దొంగతనం, విదేశాల్లో నేరాలను ప్రోత్సహించడం, భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను, ఐక్యతను దెబ్బతీయడం, ఫేక్ వార్తలను ప్రచురించడం వంటి నేరాలకు నిర్వచనం.
- ఆత్మహత్యకు ప్రయత్నించడం నేర జాబితా నుంచి తొలగింపు.
- భిక్షాటన మానవ అక్రమరవాణా నేరంగా పరిగణన.
- రూ.5వేల లోపు దొంగతనాలకు సమాజ సేవ శిక్ష విధింపు.
- పిచ్చివాడు, అవివేకి, ఇడియట్ వంటి పురాతన పదాలు తొమ్మిది చోట్ల తొలగింపు.
- బ్రిటీష్ క్యాలెండర్, క్వీన్, బ్రిటీష్ ఇండియా, శాంతి కోసం న్యాయం వంటి పదాల తొలగింపు.
- 44 చోట్ల కోర్ట్ ఆఫ్ జస్టిస్ స్థానంలో కోర్టు అని వాడుక.
- పిల్లలు అనే పదానికి బిల్లు మొత్తంలో ఏకీకృత నిర్వచనం.
- 12 చోట్ల డీనోట్స్ స్థానంలో మీన్స్ వాడుక. దటీజ్ టూ సే స్థానంలో నేమ్లీ వాడుక.
భారతీయ నాగరిక్ సురక్షా సంహిత
- మేజిస్ట్రేట్ విధించే జరిమానా పరిమితి పెంపు.
- నేరాంగీకార పరిధి విస్తరణ. గతంలో 19 నేరాలుండగా ప్రస్తుతం 10ఏళ్లు అంతకంటే అధిక శిక్షల కేసులన్నింటికీ వర్తింపు. కొత్త బిల్లులో అత్యాచారం కేసు చేర్పు.
- మూడేళ్ల లోపు శిక్షలు పడే కేసుల్లో అరెస్టుకు సీనియర్ పోలీసు అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి.
- మొదటి 40 నుంచి 60 రోజుల రిమాండులో 15 రోజుల పోలీసు కస్టడీకి అనుమతి. అయితే బెయిలు ఇవ్వడానికి ఇది అడ్డంకి కాదు.
- జప్తు, స్వాధీనం వంటి చర్యలకు విధివిధానాలు.
- తీర్పు వచ్చేవరకూ స్వయంగా హాజరుకాకపోయినా విచారణకు అవకాశం.
- దేశమంతా జీరో ఎఫ్ఐఆర్.
- ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఎఫ్ఐఆర్ నమోదు.
- మూడు నుంచి ఏడేళ్లలోపు శిక్షలు పడే కేసుల్లో ప్రాథమిక విచారణకు అనుమతి.
- దర్యాప్తులో ఫోరెన్సిక్ సాయానికి అనుమతి.
- తీవ్రమైన నేరాల్లో డీఎస్పీ స్థాయి అధికారి దర్యాప్తు.
- బెయిలుకు అర్థం సరళీకరణ.
- మొదటి కేసు నిందితుల సత్వర బెయిలుకు అవకాశం.
- నిర్దోషిగా విడుదల చేయాలని కోరుతూ వేసే కేసుల్లో బెయిలు సరళీకరణ.
- తొలిసారి నేరం చేసిన వారికి విధించే శిక్షల్లో మినహాయింపు. నాలుగో వంతుగానీ, ఆరోవంతుగానీ విధింపు.
- కేసుల్లో పారదర్శకత, జవాబుదారీతనం, వేగంగా న్యాయం కోసం ఆడియో, వీడియో రికార్డుల పరిగణన. సాక్షులు, నిందితుల వాంగ్మూలాల ఆడియో, వీడియో రికార్డులకు అవకాశం. ప్రజాప్రతినిధులు, శాస్త్రీయ నిపుణులు, వైద్యాధికారి సాక్ష్యాలను రికార్డు చేయడానికి అవకాశం.
- శోధన, సీజ్ చేయడాన్ని వీడియో తీసే అవకాశం.
- క్షమాభిక్ష పిటిషన్ విధివిధానాలు.
- సాక్షుల రక్షణకు ప్రత్యేక పథకం.
- బాధితుల రక్షణ సంబంధిత నిబంధనల చేర్పు. బాధితులకు విస్తృత నిర్వచనం. దర్యాప్తు వివరాలను బాధితులకు ఎప్పటికప్పుడు అందించడం.
- రెండు కంటే ఎక్కువ వాయిదాలు అడగకుండా నిబంధనల రూపకల్పన.
- తప్పుడు కేసుల నుంచి ప్రభుత్వాధికారులకు, ప్రజాప్రతినిధులకు రక్షణ.
- ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్ మరింత సమర్థంగా పనిచేసేలా చర్యలు.
- ఘోరమైన నేరాల్లో చేతులకు బేడీలు వేసే నిబంధన చేర్పు.
- కోర్టులో హాజరుకావడానికి ఇచ్చే నోటీసు ప్రొఫార్మా తయారీ. ప్రభుత్వాధికారుల సాక్ష్యాలు ఆడియో, వీడియో రూపంలో సేకరణ.
- 35 నేరాల్లో ఆడియో, వీడియో రికార్డింగ్ చేర్పు.
- 35 నేరాల్లో సత్వర న్యాయానికి సమయ నిర్దేశం.
భారతీయ సాక్ష్య
- కొత్త బిల్లులో రెండు కొత్త సెక్షన్లు, 6 సబ్ సెక్షన్ల జోడింపు.
- 5 వివరణల జోడింపు, 4 వివరణల తొలగింపు.
- 2 నిబంధనల జోడింపు, 24 నిబంధనల తొలగింపు.
- మొత్తంగా 6 సెక్షన్ల తొలగింపు.
- దస్త్రాల్లో ఎలక్ట్రానిక్ రికార్డుల జోడింపు.
- ఎలక్ట్రానిక్ పద్ధతిలో సాక్ష్యం సేకరణకు అనుమతి.
- సాక్ష్యానికి నిర్వచనం.
- ఎలక్ట్రానిక్ సాక్ష్యాల స్టోరేజీ, కస్టడీ, ప్రసారం వంటి అంశాల సమర్థ నిర్వహణ.
- సెకండరీ సాక్ష్యం నోటిమాటగా, లిఖితపూర్వకంగా సేకరణ.
- న్యాయపరంగా ఆమోదించేలా, విలువ ఉండేలా, ఎన్ఫోర్స్ చేసేలా ఎలక్ట్రానిక్, డిజిటల్ రికార్డుల నిర్వహణ.
- భార్యాభర్తల కేసుల్లో కాంపిటెంట్ సాక్ష్యం సేకరణ.
- వలసపాలక పదబంధాల తొలగింపు.
- భాష ఆధునికీకరణ. లింగ సున్నితత్వానికి గౌరవం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
అగ్నిపథ్ పథకం దేశ సైన్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకువచ్చిన సంస్కరణ అని మోదీ(PM Modi) తెలిపారు. -
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని హెచ్చరించారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. -
92 వేల అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. -
నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్
కార్గిల్ 25వ విజయ్ దివస్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులర్పించనున్నారు. -
గూగుల్ మ్యాప్స్లో సరికొత్త ఫీచర్లు
భారతీయ వినియోగదారులను మరింతగా ఆకర్షించేలా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ మ్యాప్స్ ప్రకటించింది. -
ఇద్దరు ఝార్ఖండ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఝార్ఖండ్ శాసనసభ స్పీకర్ ట్రైబ్యునల్ గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు (7)
తిహాడ్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడంపై ‘ఇండియా’ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. -
మహారాష్ట్ర, హిమాచల్లలో కుంభవృష్టి
హిమాచల్, మహారాష్ట్రల్లో కుండపోత వర్షాలు కురిసి జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ముంబయిలో 9 గంటల వ్యవధిలో 100 మి.మీ. పైగా వాన దంచికొట్టింది. -
ముమ్మాటికీ వివక్షేనన్న విపక్షం
కేంద్ర బడ్జెట్లో ఒకటిరెండు రాష్ట్రాలకు తప్పిస్తే మిగిలినవాటికి అన్యాయం జరిగిందని విపక్ష సభ్యులు మరోసారి గట్టిగా గళం వినిపించడంతో గురువారం పార్లమెంటు ఉభయసభలు దాదాపు స్తంభించిపోయాయి. -
ట్రంకు పెట్టెల బదులు ట్రాలీ బ్యాగులు
లోకోపైలట్లు, గార్డులు ఇకపై తమ వ్యక్తిగత వస్తువుల్ని, విధి నిర్వహణకు అవసరమైన సామగ్రిని ఇనుప ట్రంకు పెట్టెల్లో కాకుండా ట్రాలీ బ్యాగుల్లో తీసుకువెళ్లాల్సి ఉంటుంది. -
ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0
జమ్ముకశ్మీర్లో ఉగ్ర చర్యలకు పాల్పడుతున్న 55 మంది ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0’ను ప్రారంభించింది. -
భారీ వర్షాలు.. ముంబయిలో రెడ్ అలర్ట్
మహారాష్ట్రలోని ముంబయిలోనూ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!