Aadhaar: పదేళ్లయిందా...తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాల్సిందే: UIDAI
ఆధార్ తీసుకొని పదేళ్లయినా ఒక్కసారి కూడా అప్డేట్ చేయని వాళ్లు తప్పనిసరిగా కార్డు వివరాలను అప్డేట్ చేసుకోవాలని UIDAI సూచించింది.
దిల్లీ: పదేళ్లనుంచి ఒక్కసారి కూడా ఆధార్ అప్డేట్ (Adhar Update) చేయనివారు కార్డుకుసంబంధించిన వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని భారత విశిష్ట ప్రాధికారసంస్థ (UIDAI) మరోసారి కోరింది. పోటీ పరీక్షలు రాయాలన్నా, వైద్యం చేయించుకోవాలన్నా, వేరే దేశం ప్రయాణించాలన్నా, ఆఖరికి చిన్నపిల్లలను పాఠశాలలో చేర్పించాలన్నా ఇలా ఏ పని జరగాలన్నా ఆధార్ తప్పనిసరి అయిపోయింది. ఆధార్ లేని వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి సేవలు దాదాపుగా పొందలేకపోతున్నారు. ఈ కార్డు ప్రజల జీవితంలో ముఖ్య అవసరంగా మారిపోయింది. ఎంతలా అంటే ఆధార్ లేని వ్యక్తికి బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వవు.
ఆధార్ను పదేళ్లకు ఒకసారి అప్డేట్ చేసుకోవాలని కార్డు దారులను యూఐడీఏఐ కోరింది. దీనికోసం గత నెలలోనే ఆధార్ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి ఆప్డేట్ డాక్యుమెంట్ అనే ఫీచర్ను యూఐడీఏఐ తీసుకొచ్చింది. మై ఆధార్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో యూజర్లు తమ వ్యక్తిగత వివరాలకు సంబంధించిన పత్రాలను అప్డేట్ చేసుకోవచ్చని, లేదా తమ వద్దనున్న ఆధార్ కేంద్రాల ద్వారా అప్డేట్ చేసుకోవచ్చని యూఐడీఏఐ తెలిపింది. ఆధార్ అప్డేట్.. సులభంగా సేవలు పొందటానికి మరింత సహాయ పడుతుందని తెలిపింది.
గత కొన్నేళ్లుగా.. ఆధార్ దాదాపు తప్పని సరి అయిపోయింది. 1,100పైగా ప్రభుత్వ పథకాలకు ఆధార్ సంఖ్య ఆధారంగానే లబ్దిదారులను ఎంపిక చేస్తున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటిదాకా దేశంలో 134 కోట్ల ఆధార్ నంబర్లు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఉన్న చిరునామాతో ప్రతి ఒక్కరూ ఆధార్ను అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ కోరింది. దీనికోసం నవంబరు 9న ఆధార్ నిబంధనలు సవరించి పదేళ్లకోసారి అప్డేట్ తప్పనిసరి చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు
బిల్లులను ఆమోదించడంలో గవర్నర్లు జాప్యం చేస్తున్నారని కేరళ, బెంగాల్ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లపై 3 వారాల్లోగా స్పందించాలంటూ కేంద్ర హోంశాఖ, ఆయా గవర్నర్ల... -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?