Rat Hole Mining: నిషేధించిన విధానమే.. 41మందిని కాపాడింది!
ఉత్తర్కాశీ సొరంగంలో చిక్కుకున్న కూలీలను బయటకు తీసుకువచ్చేందుకు (Tunnel Operation) అనేక ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించినప్పటికీ.. చివరకు ర్యాట్-హోల్ (Rat Hole Mining) పద్ధతిలోనే రెస్క్యూ బృందాలు వారిని రక్షించగలిగాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్కాశీలోని సొరంగంలో చిక్కుకుపోయిన కూలీలను బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ బృందాలు అనేక మార్గాల్లో తీవ్ర ప్రయత్నాలు (Uttarkashi Tunnel Rescue) చేశాయి. భారత సాంకేతికతలతోపాటు అమెరికా నుంచీ తీసుకొచ్చిన అత్యాధునిక మెషిన్లు కూడా సొరంగ మార్గంలో ధ్వంసమయ్యాయి. కానీ, గతంలో నిషేధించిన ఓ పద్ధతే చివరకు దిక్కయ్యింది. అదే ‘ర్యాట్ హోల్ మైనింగ్’ (Rat Hole mining). ఆరు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆపరేషన్ చేపట్టినప్పటికీ.. అత్యంత ప్రమాదకరమైన ఈ విధానంలోనే సొరంగంలో చిక్కుకున్న కూలీలను రెస్క్యూ బృందాలు (Tunnel Operation) చేరుకోగలిగాయి. ఇలా 41 మంది ప్రాణాలను కాపాడిన ఈ ‘ర్యాట్ హోల్ మైనింగ్’ పద్ధతి ఏంటనే విషయాన్ని ఓసారి గమనిస్తే..
ర్యాట్ హోల్ మైనింగ్..?
సమాంతరంగా సన్నని గుంతలు తవ్వుతూ బొగ్గును బయటకు తీసే పద్ధతినే ర్యాట్ హోల్ మైనింగ్గా (Rat Hole mining) వ్యవహరిస్తారు. ఇలా నేలలో ఇరుకైన గుంతలను తవ్వడాన్నే ర్యాట్ హోల్గా పేర్కొంటారు. సుమారు నాలుగు అడుగుల వెడల్పుతో మాత్రమే ఉంటుంది. కేవలం ఒక్క మనిషి మాత్రమే వెళ్లగలడు. ఈ క్రమంలో నిర్దేశిత బొగ్గు పొరను చేరుకున్న తర్వాత.. బొగ్గును వెలికి తీసేందుకు సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు. పార, తదితర ప్రత్యేక పనిముట్లతో చేతుల ద్వారానే తవ్వకం చేపడతారు. తాళ్లు, అవసరమైతే నిచ్చెనల సాయంతో వెళ్లి కొద్ది కొద్దిగా తవ్వుకుంటూ.. ఆ శిథిలాలను కొంత దూరంలో డంప్ చేస్తారు. అక్కడినుంచి ట్రాలీ ద్వారా బయటకు తరలిస్తారు. తాజాగా ఉత్తర్కాశీ ఆపరేషన్లో మాత్రం.. 800 మి.మీ పైపు ద్వారా నిపుణులు లోనికి వెళ్లి తవ్వకాలు చేపట్టారు. వీరికి ఆక్సిజన్ అందించే ఏర్పాటు చేశారు. అత్యంత పలుచటి భూ పొరలుండే మేఘాలయ వంటి ప్రాంతాల్లో చేసే మైనింగ్లో ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇతర సాంతకేతికతలతో పోలిస్తే ఖర్చు తక్కువగా ఉండటంతో పలు ప్రాంతాల్లో దీన్నే ఎక్కువగా ఎంచుకుంటారు.
పర్యావరణ ఆందోళనలు..
ర్యాట్-హోల్ మైనింగ్పై అనేక విమర్శలు, వివాదాలూ ఉన్నాయి. ఈ విధానంలో గనుల్లోకి వెళ్లే కార్మికులకు భద్రత లేకపోవడం ప్రధాన సమస్య. ముఖ్యంగా లోపలికి వెళ్లే కార్మికులకు సరైన వెంటిలేషన్, నిర్మాణ పరంగా రక్షణ లేకపోవడం, వర్షాలు వచ్చినప్పుడు అవి నీటితో నిండిపోవడం వంటి ప్రతికూల అంశాలు. ఈశాన్య రాష్ట్రాల్లో ఇలా తవ్వకాలు చేపట్టిన గనుల్లో అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 2018లో అక్రమ మైనింగ్ చేస్తోన్న ఓ గనిలో ప్రమాదం జరిగి 15 మంది అందులోనే చిక్కుకుపోయారు. 2021లోనూ మరో ఘటనలో ఐదుగురు చిక్కుకుపోయారు. ఇలా కార్మికులతోపాటు పర్యావరణానికి హాని కలిగించే ఈ తరహా విధానాన్ని పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు.
ఎందుకు నిషేధించారు..?
ఈ పద్ధతి శాస్త్రీయమైనది కాదని పేర్కొన్న నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్.. 2014లో దీన్ని నిషేధించింది. అనంతరం 2015లోనూ ఎన్జీటీ తన నిషేధాన్ని సమర్థించింది. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే కార్మికులు/ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతుండటాన్ని ప్రస్తావించింది. అయితే, తమ ప్రాంతంలో మైనింగ్ కోసం మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఎన్జీటీ నిషేధాన్ని ఈశాన్య రాష్ట్రాలు సవాలు చేశాయి. మేఘాలయాలోనూ ఈ తరహా తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
వీరంతా నిపుణులు..
12 మందితో కూడిన రెండు నిపుణుల బృందాలు సిల్క్యారా సొరంగంలో తవ్వకాలు చేపట్టాయి. వీరంతా దిల్లీకి చెందిన నిపుణులు. వీరిలో రాజ్పుత్ రాయ్ అనే నిపుణుడు మీడియాతో మాట్లాడుతూ.. ఒకరు డ్రిల్లింగ్ చేస్తుంటే మరొకరు ఆ శిథిలాలను తీసి మూడో వ్యక్తికి అందిస్తారని చెప్పారు. ఆ వ్యక్తి అక్కడున్న ట్రాలీ ద్వారా బయటకు పంపించివేస్తారని అన్నారు. అయితే, ఈ ఆపరేషన్లో పాల్గొన్న ర్యాట్-హోల్ మైనింగ్ చేసేవారు కాదని.. తవ్వకాల సాంకేతికతలో నిపుణులని ఉత్తరాఖండ్ ప్రభుత్వ నోడల్ అధికారి వెల్లడించారు.
ఇదిలాఉంటే, ఉత్తరాఖండ్లోని ఉత్తర్కాశీ సిల్క్యారా సొరంగం (Silkyara tunnel)లో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు అనేక మార్గాలను అన్వేషించారు. దాదాపు ఆరు ప్రత్యామ్నాయాల్లో ఆపరేషన్ చేపట్టారు. సొరంగంలో సమాంతర తవ్వకం చేపట్టేందుకు 25 టన్నుల ఆగర్ యంత్రంతో భారీ ఆపరేషన్ చేపట్టినప్పటికీ.. అది అందులోనే ధ్వంసం కావడం కలవరపాటుకు గురిచేసింది. దీంతో చివరకు మాన్యువల్ పద్ధతిలో చేసే ర్యాట్ హోల్ మైనింగ్ (Rat Hole Mining)పై ఆధారపడాల్సి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
దేశంలో తొలిసారి ఓ జాతీయ పార్టీ పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లోని నిందితుల జాబితాలో చేర్చనుంది. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
India-Maldives: కొద్దినెలల క్రితం భారత ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితి మరోసారి పునరావృతం కాదని ఆ దేశ విదేశాంగమంత్రి హామీ ఇచ్చారు. -
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
Seized Ship: ఇరాన్ అదుపులో ఉన్న నౌకలోని భారతీయ సిబ్బందిలో ఐదుగురికి విముక్తి లభించింది. దౌత్య చర్చలు ఫలించడంతో వారిని స్వదేశానికి పంపించారు. -
రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను: తండ్రికి మెసేజ్ పంపి విద్యార్థి అదృశ్యం
విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వార్తల్లో నిలుస్తోన్న రాజస్థాన్లోని కోటాలో మరో ఘటన చోటుచేసుకుంది. నీట్ శిక్షణ కోసం వచ్చిన ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. -
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
ఇస్లాం మతాన్ని విశ్వసించే వ్యక్తి భార్య జీవించి ఉండగా మరో మహిళతో సహజీవనం చేసే హక్కును పొందలేరని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
జనాభాలో హిందువుల వాటా తగ్గుదల
భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) తెలిపింది. -
‘తట్టు’కొనేదెలా?
భారత్లో తట్టు టీకా పొందడానికి అర్హులైన చిన్నారుల్లో దాదాపు 12 శాతం మంది.. నిర్దేశిత రెండు డోసుల్లో కనీసం ఒక్క డోసు కూడా పొందని వారు దాదాపు 12 శాతం మంది ఉన్నారని తాజా అధ్యయనం పేర్కొంది. -
తెల్లకాగితాలపై సంతకాలు చేయించి.. అత్యాచారం కేసులు పెట్టారు
దేశవ్యాప్తంగా కలకలం రేపిన పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీ మహిళలపై అకృత్యాల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. -
మరో ఆర్నెల్లు.. వీసా లేకుండా చలో థాయిలాండ్
థాయిలాండ్కు వెళ్లే భారతీయులకు శుభవార్త.. పర్యాటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. -
సీసీటీవీ ఫుటేజీ చూపిన బెంగాల్ గవర్నర్
రాజ్భవన్ సిబ్బందిలోని ఓ మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో గురువారం పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్ సాధారణ పౌరులకు ఈ నెల రెండో తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని చూపించారు. -
అశ్లీల చిత్రాల కేసు సమీక్షకు.. కింది కోర్టుకే వెళ్లమన్న హైకోర్టు
సంబంధిత వ్యక్తుల అంగీకారం లేకుండా ప్రచురించిన అసభ్య దృశ్యాలను తొలగించాలని మైక్రోసాఫ్ట్, గూగుల్ సెర్చింజన్లకు గతేడాది ఏప్రిల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల సమీక్షకు అదే కోర్టుకు వెళ్లాలని దిల్లీ హైకోర్టు పిటిషనర్లకు సూచించింది. -
పరస్పర ప్రయోజనాల ఆధారంగానే ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం
భారత్-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలు, సున్నితాంశాలపై ఒకరినొకరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. -
అదానీ, అంబానీలపై దర్యాప్తునకు ఆదేశించండి
పారిశ్రామిక వేత్తలు అదానీ, అంబానీలపై కేంద్ర సంస్థలు దర్యాప్తు జరిపేలా ఆదేశించాలని ప్రధాని నరేంద్రమోదీని రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ (సీపీఐ) కోరారు. -
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయరాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీం కోర్టును కోరింది. -
కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారత పౌరులను అరెస్టు చేసినట్లు మాత్రమే కెనడా తమకు తెలియజేసిందని భారత్ గురువారం పేర్కొంది. -
నేడు తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయం
ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు శుక్రవారం తెరుచుకోనున్నాయి. -
డాక్యుమెంట్లపై అసంతృప్తి.. భారతీయులను తిరిగి దుబాయ్కు పంపిన జమైకా
జమైకాలో పర్యటించేందుకు వెళ్లిన కొందరు భారతీయులకు చుక్కెదురైంది. దుబాయ్ నుంచి ఛార్టర్డ్ విమానంలో జమైకా రాజధాని కింగ్స్టన్ను చేరుకున్న భారతీయుల డాక్యుమెంట్లను పరిశీలించిన స్థానిక అధికారులు తృప్తి చెందక పోవడంతో వారిని తిరిగి పంపించారు. -
కిక్కిరిసిపోతున్న కారాగారాలకు బహిరంగ జైళ్లే పరిష్కారం: సుప్రీం కోర్టు
దేశంలో కిక్కిరిసిపోతున్న కారాగారాల సమస్యల పరిష్కారానికి బహిరంగ జైళ్లే పరిష్కారమని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. -
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
పదో తరగతి ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు అదరగొట్టేశారు.. ఓ బాలిక ఏకంగా 625/625 మార్కులు సాధించగా.. ఏడుగురు విద్యార్థులు 624 మార్కులతో సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
-
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..