PNS Ghazi: విశాఖ తీరంలో పాక్ జలాంతర్గామి గాజీ శకలాలు..!
వైజాగ్ తీరంలో పాక్ జలాంతర్గామి శకలాలను భారత్ అత్యాధునిక సాంకేతికతను వాడి గుర్తించింది.
ఇంటర్నెట్డెస్క్: వైజాగ్ తీరంలో పాకిస్థాన్ జలాంతర్గామి శకలాలను తాజాగా భారత నౌకాదళం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి గుర్తించింది. 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో బంగాళాఖాతంలోకి దొంగచాటుగా ప్రవేశించిన పీఎన్ఎస్ గాజీ (PNS Ghazi)కి చెందినవిగా వీటిని తేల్చింది. ఈ విషయాన్ని మన నౌకాదళంలోని సబ్మెరైన్ రెస్క్యూ విభాగానికి చెందిన సీనియర్ అధికారి ధ్రువీకరించారు. భారత అమ్ములపొదిలోకి సరికొత్తగా చేరిన ‘ది డీప్ సబ్మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్ (డీఎస్ఆర్వీ) సాయంతో వీటిని కనుగొన్నారు. ‘‘మేం డీఎస్ఆర్వీ సాయంతో గాజీ శకలాలను గుర్తించాం. విశాఖ తీరానికి కేవలం కొన్ని నాటికల్ మైళ్ల దూరంలోనే సముద్ర గర్భాన ఇవి పడి ఉన్నాయి. యుద్ధంలో చనిపోయిన వారిని గౌరవించడం మన నౌకాదళ ఆచారం. అందుకనే ఆ శకలాలను తాకలేదు’’ అని ఆయన పేర్కొన్నారు. తీరానికి 2-2.5 కిలోమీటర్ల దూరంలోని సముద్ర జలాల్లో 100 మీటర్ల లోతున ఇవి ఉన్నట్లు తెలుస్తోంది.
ఎందుకీ డీఎస్ఆర్వీ టెక్నాలజీ
సముద్ర గర్భం చాలా కఠినంగా ఉంటుంది. సబ్మెరైన్ల ప్రయాణం చాలా సవాళ్లతో కూడుకున్న విషయం. అందుకే జలాల కింద ఉపరితలం ఎలా ఉందో అంచనావేసి.. మన జలాంతర్గాములు ప్రయాణించేందుకు అనువైన మార్గాలను డీఎస్ఆర్వీ సాయంతో మ్యాపింగ్ చేస్తారు. వైజాగ్లో సముద్రం సగటున 16 మీటర్ల లోతు ఉంటుంది. ఇది ఓడలు నిలిపేందుకు అనుకూలం. అంతేకాదు.. జలాంతర్గాములు తీరం సమీపంలోకి వచ్చి వెళ్లేందుకు వీలవుతుంది. ఇలాంటి పరిస్థితులను చూసే 1971లో పీఎన్ఎస్ గాజీ వైజాగ్ తీరానికి చేరి నక్కింది.
2013లో ఐఎన్ఎస్ సింధ్రక్షక్ ప్రమాదానికి గురై 13 మంది మరణించడంతో భారత్ నేవీ ఆలోచనలో పడింది. ఇటువంటి సమయంలో సిబ్బందిని రక్షించేందుకు వీలుగా 2018లో తొలిసారి డీఎస్ఆర్వీ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ప్రమాదానికి గురైన నౌకలు, సబ్మెరైన్లను గుర్తించి సహాయక చర్యలు చేపట్టేందుకు దీనిని వాడాలని నిర్ణయించింది. ప్రస్తుతం మన వద్ద రెండు డీఎస్ఆర్వీలు వినియోగంలో ఉన్నాయి. ఒకటి తూర్పు, మరొకటి పశ్చిమ తీరంలో వాడుతున్నారు. వీటిని నౌకలు లేదా విమానాల్లో తరలించవచ్చు. ఇటువంటి సాంకేతికత ప్రపంచంలో ప్రస్తుతం భారత్ సహా 12 దేశాల వద్ద మాత్రమే ఉంది. సముద్ర గర్భం లోతుకు వెళ్లే కొద్దీ ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. డీఎస్ఆర్వీకి 650 మీటర్ల దిగువకు వెళ్లి పనిచేసే సామర్థ్యం ఉంది. వైజాగ్లోని హిందూస్థాన్ షిప్యార్డ్లో ఇలాంటివి మరో రెండింటిని దేశీయంగా తయారు చేయడంపై భారత్ దృష్టిపెట్టింది.
అసలేమిటీ పాక్ జలాంతర్గామి..
టెన్చ్ శ్రేణికి చెందిన డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ పీఎన్ఎస్ గాజీ వాస్తవంగా అమెరికా నౌకాదళానికి చెందినది. దీనిని యూఎస్ఎస్ డయాబ్లోగా వ్యవహరిస్తారు. అమెరికా 1963లో పాక్కు లీజుకు ఇచ్చింది. ఇస్లామాబాద్ నౌకాదళంలో ఇదే తొలి అటాక్ సబ్మెరైన్. ఇది 1971లో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు రగిలిన వెంటనే.. నవంబర్ 14న కరాచీ పోర్టు నుంచి బయల్దేరి దాదాపు 3,000 కి.మీ. పైగా ప్రయాణించి శ్రీలంక మీదుగా వైజాగ్ తీరానికి చేరింది. భారత్ వద్ద ఉన్న ఏకైక విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను ధ్వంసం చేయాలన్నదే దాని వ్యూహం. దాని ఎత్తుగడను ముందే పసిగట్టిన మన నేవీ విక్రాంత్ను అండమాన్ దీవుల వద్దకు తరలించింది. ఆ స్థానంలో వైజాగ్ తీరం నుంచి డెకాయ్గా ఐఎన్ఎస్ రాజ్పుత్ను పంపారు. అది విమానవాహక నౌక వలే భారీ సిగ్నల్స్ వదలడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో విక్రాంత్లోని సిబ్బందిలా ఒకరు తన జబ్బుపడిన తల్లికి టెలిగ్రాం పంపినట్లుగా కావాలనే భద్రతా ప్రొటోకాల్ను ఉల్లంఘించారు. దీనిని గాజీ పసిగట్టింది. రాజ్పుత్నే విక్రాంత్గా భ్రమించి దాడికి సిద్ధమైంది. డిసెంబర్ 3-4 తేదీల అర్ధరాత్రి సముద్రంలో అలజడిని రాజ్పుత్ గుర్తించింది. దానికి కారణం సబ్మెరైన్గా నిర్ధరించుకొంది. అనంతరం అక్కడ రెండు ఛార్జెస్ను నీటిలోకి వదిలింది. అదే సమయంలో జలాల్లో భారీ పేలుడు జరిగి గాజీ మునిగిపోయింది. దీంతో దాదాపు 92 మంది పాక్ సిబ్బంది చనిపోయారు. పేలుడు జరిగిన సమయం.. దాని శకలాల నుంచి సేకరించిన గడియారం ఆగిపోయిన వేళ ఒకటే కావడం విశేషం. ఇది ఆ దేశ నేవీకి కోలుకోలేని దెబ్బగా మారింది. ఆ జలాంతర్గామి శకలాలు ఇప్పటికీ వైజాగ్ సమీపంలోని సముద్రం అడుగున కూరుకుపోయి ఉన్నాయి. పాక్ మాత్రం అంతర్గత పేలుడు వల్లే ఇది మునిగిపోయిందని చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
భారీ వర్షాలు కురుస్తుండడంతో ఉత్తరాఖండ్లోని మద్మహేశ్వర దేవాలయం వద్ద 50మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. -
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
కార్గిల్ యుద్ధం సమయంలో మోదీ అక్కడి యుద్ధ వీరులతో ముచ్చటించిన పలు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
పెండింగ్ బిల్లుల విషయంలో కేరళ, బెంగాల్ గవర్నర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
అగ్నిపథ్ పథకం దేశ సైన్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకువచ్చిన సంస్కరణ అని మోదీ(PM Modi) తెలిపారు. -
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని హెచ్చరించారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. -
92 వేల అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. -
నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్
కార్గిల్ 25వ విజయ్ దివస్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులర్పించనున్నారు. -
గూగుల్ మ్యాప్స్లో సరికొత్త ఫీచర్లు
భారతీయ వినియోగదారులను మరింతగా ఆకర్షించేలా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ మ్యాప్స్ ప్రకటించింది. -
ఇద్దరు ఝార్ఖండ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఝార్ఖండ్ శాసనసభ స్పీకర్ ట్రైబ్యునల్ గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు (7)
తిహాడ్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడంపై ‘ఇండియా’ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. -
మహారాష్ట్ర, హిమాచల్లలో కుంభవృష్టి
హిమాచల్, మహారాష్ట్రల్లో కుండపోత వర్షాలు కురిసి జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ముంబయిలో 9 గంటల వ్యవధిలో 100 మి.మీ. పైగా వాన దంచికొట్టింది. -
ముమ్మాటికీ వివక్షేనన్న విపక్షం
కేంద్ర బడ్జెట్లో ఒకటిరెండు రాష్ట్రాలకు తప్పిస్తే మిగిలినవాటికి అన్యాయం జరిగిందని విపక్ష సభ్యులు మరోసారి గట్టిగా గళం వినిపించడంతో గురువారం పార్లమెంటు ఉభయసభలు దాదాపు స్తంభించిపోయాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!