Tollywood: నాయిక.. పట్టు వదలక
ఏడాదికో సినిమా చేయడం కథానాయకులకి కష్టమేమో కానీ... కథానాయికలు నాలుగైదు సినిమాలైనా సులభంగా చేసేస్తారు. ఎక్కువ సినిమాల్లో నాయికల పాత్రల పరిధి పరిమితం కావడం... తక్కువ కాల్షీట్లతోనే పని పూర్తి చేసుకొని బయటికొచ్చే వెసులుబాటు ఉండటం వీళ్లకి కలిసొచ్చే విషయం.
ఏడాదికో సినిమా చేయడం కథానాయకులకి కష్టమేమో కానీ... కథానాయికలు నాలుగైదు సినిమాలైనా సులభంగా చేసేస్తారు. ఎక్కువ సినిమాల్లో నాయికల పాత్రల పరిధి పరిమితం కావడం... తక్కువ కాల్షీట్లతోనే పని పూర్తి చేసుకొని బయటికొచ్చే వెసులుబాటు ఉండటం వీళ్లకి కలిసొచ్చే విషయం. అందుకే వీలైనన్ని భాషల్లో... వీలైనన్ని సినిమాలు చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తుంటారు. ఇంకా కాల్షీట్లు ఖాళీగా ఉన్నాయనిపిస్తే... వెబ్ సిరీస్లపైనా ఓ కన్నేస్తుంటారు. తెలుగులో ఈ ఏడాది అరడజను మందికిపైగా స్టార్ కథానాయకులు తెరపై కనిపించలేదు. కథానాయికలు మాత్రం అవకాశాల విషయంలో ఎప్పట్లాగే పట్టు ప్రదర్శిస్తూ తమ ఉనికిని చాటుకున్నారు. పూజాహెగ్డే మినహా స్టార్ భామల్లో ఈ ఏడాది చాలా మందికి మంచి విజయాలు దక్కాయి.
స్టార్లుగా చలామణీ అవుతున్న భామలు కొద్దిమందైతే... స్టార్ స్థానం కోసం రేసులో ఉన్నవాళ్లు మరికొద్దిమంది... వీళ్లతోపాటు తొలి పరిచయాల మెరుపులు ఇంకొంతమందివి... ఈ మూడు శ్రేణులకి చెందిన కథానాయికలు చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ కనిపిస్తుంటారు. ఏ అవకాశం ఎవరిని వరిస్తుందో ఊహించలేం. స్టార్ భామలు తమ స్థానాన్ని నిలబెట్టుకునేలా తగిన పాత్రల్ని ఎంచుకుంటూ ప్రయాణం చేస్తుంటారు. జోరుమీదున్న నవతరం భామలేమో స్టార్ హీరోల చిత్రాలపై దృష్టి పెడుతూ... స్టార్ కథానాయిక అనిపించుకోవాలనే లక్ష్యంతో ప్రయాణం చేస్తుంటారు. ఇక కొత్త మెరుపులు ఉండనే ఉంటాయి. ఒక్క సినిమాతోనే అనూహ్యంగా పరిశ్రమ దృష్టిని ఆకర్షించే కొత్త భామలూ అప్పుడప్పుడూ వస్తుంటారు. 2023లో ఈ మూడు రకాల భామలు సత్తాని చాటారు. గత మూడు నాలుగేళ్లుగా తెలుగు చిత్రసీమపై తనదైన ఆధిపత్యం ప్రదర్శించిన పూజాహెగ్డే మినహా అగ్ర కథానాయికలు చాలామంది అవకాశాలు, విజయాల పరంపరని కొనసాగించారు.
అనుభవాన్ని రంగరించి...
తెలుగు చిత్రసీమలో అనుభవం పండిన కథానాయికలు చాలామందే కనిపిస్తున్నారు. ఒకప్పుడు బలమైన పాత్రలు రాయాలన్నా ‘వీటిని చేసేవాళ్లు ఎవరున్నారు?’ అనే ప్రశ్న వేసుకుని ఆగిపోయేవాళ్లు దర్శకులు. ఇప్పుడు ఆ సందేహమే అవసరం లేదన్నట్టుగా నటనతో సత్తా చాటుతున్నారు కథానాయికలు. అనుష్క, కాజల్, తమన్నా, శ్రుతిహాసన్ మొదలుకొని జోరుమీదున్న సమంత, రష్మిక, కీర్తిసురేశ్ తదితర కథానాయికలు బలమైన పాత్రలకి, నటనకి కేరాఫ్గా కనిపిస్తున్నారు. అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో మరోసారి మ్యాజిక్ చేసింది.. సమంత ఈ ఏడాది రెండు చిత్రాల్లో సందడి చేసింది. నాయికా ప్రధానమైన ‘శాకుంతలం’ విజయాన్ని ఇవ్వలేదు కానీ, ‘ఖుషి’తో ఆమె చేసిన సందడి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. శ్రుతిహాసన్ ఈ ఏడాది ఆరంభంలోనే చిరంజీవి, బాలకృష్ణ సరసన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాల్లో నటించి విజయాల్ని సొంతం చేసుకుంది. ‘హాయ్ నాన్న’లో ప్రత్యేక గీతంలో తళుక్కున మెరిసింది. త్వరలోనే విడుదల కానున్న ‘సలార్’లోనూ ఆమే కథానాయిక. కొత్త ప్రాజెక్టుల విషయంలోనూ ఆమె జోరు కొనసాగుతోంది. అడివి శేష్తో కలిసి ఓ చిత్రంలో నటిస్తోంది. తమన్నా ‘భోళాశంకర్’లో చిరంజీవి సరసన నటించింది. ‘జైలర్’తో కావాలయ్యా... అంటూ తెలుగు ప్రేక్షకుల్నీ మురిపించింది. కాజల్ ‘భగవంత్ కేసరి’తో పునరాగమనం చేసి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ‘సత్యభామ’ అనే నాయిక ప్రధానమైన సినిమా చేస్తుంది.
సత్తా చాటారు...
రష్మిక నేరుగా తెలుగు సినిమా చేయలేకపోవచ్చు కానీ... అనువాదాలుగా వచ్చిన ‘వారసుడు’, ‘యానిమల్’ చిత్రాలతో బలమైన ప్రభావమే చూపించింది. తెలుగు సినిమా చేయలేదన్న లోటుని ఆమె ఈ సినిమాలతోనే తీర్చేశారు. ఇప్పుడు మాత్రం తెలుగులో ‘పుష్ప2’, ‘రెయిన్ బో’, ‘ది గర్ల్ఫ్రెండ్’ చిత్రాల్ని చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. నటనా ప్రధానమైన పాత్రలనగానే గుర్తొచ్చే కీర్తిసురేశ్ ఈ ఏడాదీ తన శైలిలో పాత్రల్ని ఎంచుకుని ప్రేక్షకుల్ని మురిపించారు. నానితో కలిసి చేసిన ‘దసరా’ ఆమెకి మంచి పేరు తీసుకొచ్చింది. తమిళంలో చేసిన ‘మామన్నన్’ తెలుగులో ‘నాయకుడు’గా అనువాదమైంది. అందులోనూ కీర్తి నటన ప్రేక్షకుల్ని మెప్పించింది.
కొత్త మెరుపులు...
ఈ ఏడాది తెలుగులో మార్మోగిన కథానాయిక పేరు... శ్రీలీల. ఈ ఏడాది ఎక్కువ అవకాశాలు సొంతం చేసుకున్నదీ, ఎక్కువ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఆమే. గతేడాది ‘ధమాకా’తో విజయాన్ని సొంతం చేసుకుని, తనలోని ప్రతిభనంతా ఆవిష్కరించిన శ్రీలీల ఈ సంవత్సరం ‘భగవంత్ కేసరి’, ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్’, ‘ఆదికేశవ’, ‘స్కంద’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘భగవంత్ కేసరి’లో శ్రీలీల నటన ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్సింగ్’, ‘గుంటూరు కారం’, ‘అనగనగా ఒక రాజు’తోపాటు, విజయ్ దేవరకొండ, నితిన్ చిత్రాల్లో నటిస్తోంది. ఈ నెలలోనే విడుదలయ్యే ‘డెవిల్’తో సంయుక్త మేనన్ విడుదలల సంఖ్య మూడుకి చేరుతుంది. ‘సార్’, ‘విరూపాక్ష’ సినిమాలతో ఆమె ఇప్పటికే విజయాల్ని తన ఖాతాలో వేసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
‘కల్కి 2898 ఏడీ’ మ్యూజిక్ ఇలా క్రియేట్ చేశారు: సంతోశ్ నారాయణన్ మెమొరీస్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. దీనికి తానెలా మ్యూజిక్ అందించారో సంతోశ్ నారాయణన్ వివరించారు.
-
ఎన్నో చిత్రాల్లో చేసినా.. ‘లిల్లీ’గానే గుర్తున్నా : రష్మిక
విజయ్ దేవరకొండ - రష్మిక జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ విడుదలై నేటికి ఐదేళ్లు. ఈసందర్భంగా రష్మిక స్పెషల్ పోస్ట్ పెట్టారు. -
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
తన పెళ్లి వార్తలపై మరోసారి స్పందించారు నటి కీర్తిసురేశ్ (Keerthy Suresh). -
అలాంటి వారికోసం సమయాన్ని వృథా చేసుకోవద్దు: పరిణితీ చోప్రా
ప్రపంచాన్ని మరిచిపోయి జీవించాలని తన అభిమానులకి జీవిత పాఠాలు చెబుతోంది పరిణితీ చోప్రా. -
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
Double Ismart movie: రామ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ ఓటీటీ డీల్ పూర్తయింది. -
నిహారిక ధైర్యాన్ని మెచ్చుకోవాలి : సిద్ధూ జొన్నలగడ్డ
‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu) ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సిద్ధూ జొన్నలగడ్డ పాల్గొన్నారు. -
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘రాయన్’ ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను అలరించిందా? -
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
కన్నడ నటుడు యశ్ 19వ చిత్రంగా ‘టాక్సిక్’ రూపుదిద్దుకుంటోంది. మలయాళీ నటి, దర్శకురాలు గీతూమోహన్ దాస్ దీనిని తెరకెక్కిస్తున్నారు. -
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
‘డబుల్ ఇస్మార్ట్’ పాట వివాదంపై సంగీత దర్శకుడు మణిశర్మ క్లారిటీ ఇచ్చారు. అందులో వాడిన లిరిక్స్ ఎవరినీ కించపరచడం కోసం కాదన్నారు. -
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
రాజ్తరుణ్ కథానాయకుడిగా రామ్ భీమన దర్శకత్వంలో రూపొందిన ‘పురుషోత్తముడు’ మూవీ ప్రేక్షకులను అలరించిందా? -
‘కమిటీ కుర్రోళ్ళు’ వచ్చేశారు.. ట్రైలర్ చూశారా?
యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘కమిటీ కుర్రోళ్ళు’ ట్రైలర్ శుక్రవారం విడుదలైంది
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
‘హాయ్ నాన్న’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు నటుడు నాని. ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. -
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
సామాజిక మాధ్యమాల గురించి నటి జాన్వీకపూర్ (Janhvi kapoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బులిచ్చి పొగిడించుకునే మనస్థత్వం తనది కాదని చెప్పారు. -
బాబీ దేవోల్తో యుద్ధానికి సిద్ధమైన అలియా.. వైరలవుతోన్న ‘ఆల్ఫా’ అప్డేట్!
అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’. దీనికి సంబంధించిన ఓ అప్డేట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’పై కత్రినాకైఫ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. -
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
నటి టబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
‘కల్కి’ స్క్రిప్ట్ రాయడానికి చాలా సమయం పట్టిందని దర్శకుడు నాగ్అశ్విన్ అన్నారు. అశ్వత్థామ పాత్రకు అమితాబ్ను తప్ప మరొకరిని ఊహించుకోలేదని చెప్పారు. -
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
టాలీవుడ్పై నటి జాన్వీ ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ హీరో అని ప్రశంసించారు. -
ఎన్టీఆర్ కోసం మరో విలన్?
‘దేవర’గా థియేటర్లలో సందడి చేయనున్నారు ఎన్టీఆర్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. -
‘కె.జి.ఎఫ్’ ప్రపంచంలోకి అజిత్?
ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ సరికొత్త కలయికకు రంగం సిద్ధం చేశారా? ‘కె.జి.ఎఫ్’ ప్రపంచంలోకి అగ్ర కథానాయకుడు అజిత్ను తీసుకొస్తున్నారా? అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు