Tollywood: అంచనాలు ఎన్నో.. అందుకున్నవి కొన్నే
2024 క్యాలెండర్లో అప్పుడే ముచ్చటగా మూడు నెలలు పూర్తయ్యాయి. ఒకరకంగా తెలుగు చిత్రసీమ త్రైమాసిక పరీక్షలు పూర్తి చేసుకున్నట్లే. ఈ మూడు నెలల్లో బాక్సాఫీస్ ముందు బోలెడన్ని చిత్రాలు అదృష్టం పరీక్షించుకున్నాయి.
తెలుగు చిత్రసీమ మూడు నెలల ముచ్చట
2024 క్యాలెండర్లో అప్పుడే ముచ్చటగా మూడు నెలలు పూర్తయ్యాయి. ఒకరకంగా తెలుగు చిత్రసీమ త్రైమాసిక పరీక్షలు పూర్తి చేసుకున్నట్లే. ఈ మూడు నెలల్లో బాక్సాఫీస్ ముందు బోలెడన్ని చిత్రాలు అదృష్టం పరీక్షించుకున్నాయి. అందులో అగ్ర తారలు నటించిన భారీ సినిమాలతో పాటు పరిమిత వ్యయంతో రూపొందిన యువతారల చిత్రాలు, అనువాదాలు అన్నీ ఉన్నాయి. అయితే వాటిలో విజయ ఢంకా మోగించినవి కొన్నైతే... అంచనాలు అందుకోలేక చతికిలపడినవి ఎన్నో. మరి ఈ మూడు నెలల తెలుగు చిత్రసీమ ప్రొగ్రెస్ రిపోర్ట్ను ఓసారి పరిశీలిస్తే...
‘సర్కారు నౌకరి’ అనే చిన్న చిత్రంతో కొత్త ఏడాదికి స్వాగతం పలికింది తెలుగు చిత్రసీమ. జనవరి 1న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి చేదు ఫలితాన్నే అందుకుంది. ఆ మరుసటి వారం ‘ప్రేమకథ’, ‘రాఘవ రెడ్డి’, ‘డబుల్ ఇంజిన్’.. ఇలా అరడజను వరకు చిన్న చిత్రాలు బాక్సాఫీస్ ముందుకొచ్చాయి. అన్నీ పరాజయాల్నే అందుకున్నాయి. ఇక ఆ తర్వాత నుంచి సంక్రాంతి సినిమాల హంగామా మొదలైంది. ఈసారి తెలుగులో పండగ చిత్రాల మధ్య గట్టి పోటీ కనిపించింది. జనవరి 12న మహేశ్బాబు - త్రివిక్రమ్ల ‘గుంటూరు కారం’, తేజ సజ్జా - ప్రశాంత్ వర్మల ‘హను-మాన్’ ఒకేసారి థియేటర్లలోకి వచ్చాయి. వాటిలో చిన్న చిత్రంగా విడుదలైన ‘హను-మాన్’ పాన్ ఇండియా స్థాయిలో అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం. నిజానికి దీనికి ఆరంభంలో తెలుగు రాష్ట్రాల్లో కావాల్సినన్ని థియేటర్లు దక్కకున్నా.. మెల్లగా మౌత్ టాక్తో స్క్రీన్లను అంతకంతకూ పెంచుకుంటూ పోయింది.ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టి కొత్త రికార్డులు సృష్టించింది. ఇక మహేశ్ చిత్రానికి మంచి ఆరంభ వసూళ్లు దక్కినప్పటికీ.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన దక్కడంతో ఆ తర్వాత జోరు కొనసాగించలేకపోయింది.
13న వెంకటేశ్ తన 75వ సినిమా ‘సైంధవ్’తో ప్రేక్షకుల్ని పలకరించారు. విభిన్నమైన భావోద్వేగభరిత యాక్షన్ డ్రామాగా ముస్తాబైన ఈ సినిమా సినీప్రియుల్ని ఏమాత్రం మెప్పించలేక పోయింది. దీంతో ఈ సంక్రాంతి చిత్రాల్లో తక్కువ వసూళ్లు అందుకున్న సినిమాగా నిలిచింది. ఇక ముగ్గుల పండగ రోజున ‘నా సామిరంగ’ అంటూ థియేటర్లలో సందడి చేశారు నాగార్జున. సంక్రాంతి వైబ్స్తో నిండిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే దక్కింది. ఈ చిత్రంతోనే నృత్య దర్శకుడు విజయ్ బిన్ని డైరెక్టర్గా వెండితెరకు పరిచయమయ్యారు. పండగ సందడి ముగిసిన మరుసటి వారం బాక్సాఫీస్ ముందు కొత్త విడుదలలు ఏమీ కనిపించలేదు. నెలాఖరున రిపబ్లిక్ డే బరిలో ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’తో అదృష్టం పరీక్షించుకున్నారు. కానీ, అది ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. నిజానికి దానితో పాటు అదే రోజున శివ కార్తికేయన్ ‘అయలాన్’ కూడా థియేటర్స్లోకి రావాల్సి ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యల వల్ల ఆఖరి నిమిషంలో వాయిదా పడింది.
ఫిబ్రవరి కలిసి రాలేదు!
సాధారణంగా ఫిబ్రవరి చిత్రసీమకు అన్సీజన్. విద్యార్థులకు పరీక్షల సీజన్ కావడంతో పెద్ద చిత్రాలు ఈనెలలో బరిలో దిగేందుకు వెనకాడుతుంటాయి. కానీ, కొన్నేళ్లుగా ఈ అన్సీజన్లోనే అదిరే విజయాల్ని సొంతం చేసుకుంటూ వస్తోంది తెలుగు చిత్రసీమ. ‘భీమ్లా నాయక్’, ‘ఉప్పెన’, ‘జాంబిరెడ్డి’, ‘నాంది’.. ఇవన్నీ గత రెండేళ్లలో ఫిబ్రవరిలో దక్కిన విజయాలే. కానీ, ఈ ఏడాది ఆ ఆనవాయితీ కొనసాగలేదు. ఈసారి ఫిబ్రవరి బరిలో ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోదగ్గ విజయం దక్కించుకోలేదు. తొలి వారం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’, ‘కిస్మత్’, ‘హ్యాపీ ఎండింగ్’, ‘బూట్కట్ బాలరాజు’.. ఇలా దాదాపు అరడజనుకు పైగా సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. కానీ, వాటిలో ఏదీ చెప్పుకోదగ్గ స్థాయిలో సత్తా చాటలేదు. సుహాస్ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాకి మంచి ప్రయత్నంగా పేరొచ్చినప్పటికీ అది వసూళ్లను ప్రభావితం చేయలేకపోయింది.
ఫిబ్రవరి రెండో వారంలో రవితేజ ‘ఈగల్’తో పాటు రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో నటించిన అనువాద చిత్రం ‘లాల్ సలాం’ బాక్సాఫీస్ బరిలో పోటీ పడ్డాయి. వాటిలో ‘లాల్ సలాం’ దారుణ పరాజయాన్ని సొంతం చేసుకోగా.. ‘ఈగల్’ ఫర్వాలేదనిపించింది. ఆ మరుసటి వారం సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’తో ప్రేక్షకుల్ని పలకరించారు. దీనికి మంచి టాక్ వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా నిరుత్సాహ పరిచింది. మూడో వారంలో మమ్ముట్టి నటించిన అనువాద చిత్రం ‘భ్రమయుగం’తో పాటు ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’, ‘రాజధాని ఫైల్స్’, ‘సిద్ధార్థ్ రాయ్’ తదితర చిన్న సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ‘భ్రమయుగం’కు విమర్శకుల ప్రశంసలు దక్కగా.. మిగిలినవన్నీ చేదు ఫలితాల్నే అందుకున్నాయి.
మార్చిలో చిన్న చిత్రాల మెరుపులు..
తెలుగు చిత్రసీమలో వేసవి సీజన్ మార్చి నుంచే మొదలైపోతుంది. ఈనెల నుంచే విద్యార్థులకు సెలవులు షురూ అవడంతో అగ్రతారల చిత్రాలు బాక్సాఫీస్ ముందు వరుస కట్టడం ఆనవాయితీగా కనిపిస్తుంటుంది. కానీ, ఈసారి అగ్ర నాయకుల సందడంతా సెట్లకే పరిమితమవడంతో చిన్న, మీడియం రేంజ్ సినిమాల జోరు కనిపించింది. మార్చి తొలి వారం వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’తో పాటు ‘భూతద్దం భాస్కర్ నారాయణ’, ‘చారి 111’, ‘ఇంటి నెంబర్ 13’ తదితర సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. కానీ, వాటిలో ఏ ఒక్కటీ ఆశించిన ఫలితాన్ని అందివ్వలేదు. నిజానికి వరుణ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రచార చిత్రాలతో అందరిలో అంచనాలు పెంచినప్పటికీ.. తెరపై ఆస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ మరుసటి వారం గోపీచంద్ ‘భీమా’తో.. విష్వక్ సేన్ ‘గామి’తో బాక్సాఫీస్ బరిలో తలపడ్డారు.
వీటిలో కొత్త దర్శకుడు విద్యాధర్ తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం ‘గామి’కి ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కడం విశేషం. ఇక వీటితోపాటే అదేవారంలో థియేటర్లలోకి వచ్చిన మలయాళ అనువాద చిత్రం ‘ప్రేమలు’ సైతం సినీప్రియుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తనయుడు కార్తికేయ డిస్ట్రిబ్యూటర్గా మారడం విశేషం. మార్చి మూడో వారంలో ‘రజాకార్’, ‘లంబసింగి’, ‘షరతులు వర్తిస్తాయి’, ‘వెయ్ దరువెయ్’.. ఇలా అరడజనుకు పైగా సినిమాలు థియేటర్లలోకి వరుస కట్టాయి. కానీ, వాటిలో ఏదీ హిట్టు మాట వినిపించలేకపోయింది. గతేడాది ‘సామజవరగమన’తో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించారు కథానాయకుడు శ్రీవిష్ణు. ఆయన ఈ మార్చిలో ‘ఓం భీమ్ బుష్’ అంటూ మరోసారి వినోదాల జల్లుల్లో తడిపేశారు. విభిన్నమైన కామెడీ హారర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలతో కలిసి శ్రీవిష్ణు చేసిన అల్లరి ప్రేక్షకుల మోముల్లో నవ్వులు పూయించింది.
ప్రస్తుతం ఈ నవ్వుల యాత్రనే ‘టిల్లు స్క్వేర్’తో థియేటర్లలో విజయవంతంగా కొనసాగిస్తున్నారు సిద్ధు జొన్నలగడ్డ. ‘డీజే టిల్లు’కు కొనసాగింపుగా రూపొందిన చిత్రమిది. మల్లిక్ రామ్ తెరకెక్కించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సినీప్రియుల్ని మెప్పించి మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘టిల్లు 3’ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక దీనికి ఓరోజు ముందే థియేటర్లలోకి వచ్చిన మలయాళ అనువాద చిత్రం ‘ఆడు జీవితం’ కూడా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని బ్లెస్సీ తెరకెక్కించారు. మరి ఇది తెలుగులో ఏ స్థాయి వసూళ్లు రాబడుతుందో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు. రానున్న ఏప్రిల్, మే నెలల్లోనూ బాక్సాఫీస్ ముందు చిన్న, మీడియం రేంజ్ సినిమాల సందడే ఎక్కువ కనిపించనుంది. వీటిలో కొన్నైనా ‘ఓం భీమ్ బుష్’, ‘టిల్లు స్క్వేర్’లా మెరుపులు మెరిపించగలిగితే ఈ వేసవి సీజన్కు మంచి ముగింపు దొరికినట్లు అవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాక్షన్ ఫాంటసీ సిరీస్ను ప్రకటించిన రాజ్ అండ్ డీకే.. టైటిలిదే
రాజ్ అండ్ డీకే కొత్త సిరీస్ను ప్రకటించారు. ‘రక్త్ బ్రహ్మాండ్’ పేరుతో ఇది రానుంది. -
అల్లరి నరేశ్ కొత్త సినిమా.. కీలకపాత్రలో యంగ్ హీరోయిన్
అల్లరి నరేశ్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫొటోలను నిర్మాణ సంస్థ షేర్ చేసింది. -
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో చిరంజీవి ఫ్యామిలీ పాల్గొంది. -
దీపికా పదుకొణెతో ఇంటిమేట్ సీన్స్.. భయాందోళనకు గురయ్యా: బాలీవుడ్ నటుడు
‘గెహ్రీయాన్’ కోసం నటి దీపికా పదుకొణె (Deepika Padukone)తో ఇంటిమేట్ సీన్స్లో నటించడం తననెంతో ఇబ్బందికి గురి చేసిందని బాలీవుడ్ నటుడు తెలిపారు. -
విజయ్ సేతుపతి హిట్ సినిమాను రీమేక్ చేయనున్న బాలీవుడ్ హీరో!
విజయ్ సేతుపతి హిట్ సినిమాను బాలీవుడ్ హీరో రీమేక్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
ఆ దేశంలో ‘హనుమాన్’ రిలీజ్.. ప్రశాంత్ వర్మ పోస్ట్
తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తెరకెక్కించిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). త్వరలో ఇది ఓ దేశంలో విడుదల కానుందని ప్రశాంత్ వర్మ తెలిపారు. -
యశ్ ‘టాక్సిక్’ విడుదలపై నెట్టింట పోస్టులు.. అనుకున్న రోజుకు రావడం కష్టమేనా!
యశ్ ‘టాక్సిక్’ విడుదలపై అభిమానులు పోస్ట్లు పెడుతున్నారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. -
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్పై ‘రాయన్’ టీమ్ ఆనందం వ్యక్తంచేసింది. -
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఇందులో ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అతిథి పాత్ర పోషించడంపై నాగ్ అశ్విన్ స్పందించారు. -
ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు పంచుకున్న ఉపాసన
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ పాల్గొని ఎంజాయ్ చేస్తోంది. -
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు. -
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
అవికా గోర్, వర్ధన్ పూరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బ్లడీ ఇష్క్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే? -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..