Aarambham: ‘ఈటీవీ విన్‌’లో ‘ఆరంభం’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామా మూవీ ‘ఆరంభం’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

Published : 20 May 2024 22:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మోహన్‌ భగత్‌, సుప్రితా సత్యనారాయణ్‌, భూషణ్‌ తదితరలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆరంభం’ (Aarambham). అజయ్‌ నాగ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారైంది. తెలుగు ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ (ETV Win)లో ఈ నెల 23 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 10న థియేటర్లో విడుదలై, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 

కథేంటంటే? ఓ హత్యకేసులో రెండున్నరేళ్లు జైలు జీవితం గడుపుతాడు మిగిల్‌ అనే వ్యక్తి. ఉరిశిక్ష ఖరారుకాగా జైలు నుంచి పారిపోతాడు. ఫుల్‌ సెక్యూరిటీ ఉండగా అతడెలా తప్పించుకున్నాడో తెలుసుకునేందుకు డిటెక్టివ్‌ రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో డిటెక్టివ్‌కి మిగిల్‌కు సంబంధించిన పుస్తకం ఒకటి కనిపిస్తుంది. అందులో ఉన్న డెజావు కాన్సెప్ట్‌ ఏంటి? దాని గురించి మిగిల్‌కు చెప్పిందెవరు? అసలు అతడు మర్డర్‌ చేశాడా, లేదా? అన్న ఆసక్తికర అంశాలతో ఈ సినిమా రూపొందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని