Abhishek Agarwal: ఓ నిర్మాత ఇంతకంటే ఏం కోరుకుంటాడు?
‘‘ఇప్పుడున్నది యువ భారతం. మనదైన చరిత్ర నవతరానికి తెలియాల్సిన అవసరం చాలా ఉంది. వెలుగులోకి రాని హీరోల కథలు ఎన్నో ఉన్నాయి. వాటిపై పక్కాగా పరిశోధన చేసి తెరపైకి తీసుకు రావాలన్నదే మా ప్రయత్నం.
‘‘ఇప్పుడున్నది యువ భారతం. మనదైన చరిత్ర నవతరానికి తెలియాల్సిన అవసరం చాలా ఉంది. వెలుగులోకి రాని హీరోల కథలు ఎన్నో ఉన్నాయి. వాటిపై పక్కాగా పరిశోధన చేసి తెరపైకి తీసుకు రావాలన్నదే మా ప్రయత్నం. ఈ సారి ఓ దొంగ కథతో మేం సినిమాని ఎందుకు తీశామనేది తెరపై చూసి తెలుసుకోవల్సిందే’’ అన్నారు అభిషేక్ అగర్వాల్. ‘కార్తికేయ 2’, ‘ది కశ్మీర్ ఫైల్స్’ లాంటి పాన్ ఇండియా చిత్రాల్ని రూపొందించిన నిర్మాత ఈయన. ఇటీవల రవితేజ కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అభిషేక్ అగర్వాల్ బుధవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
‘‘కథా బలం ఉన్న సినిమాలు తీయడమే మా సంస్థ ఉద్దేశం. ఇప్పటిదాకా మా సంస్థ నుంచి వచ్చిన, ఇకపైన రానున్న సినిమాల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ ఎప్పటికీ నాకు ఇష్టమైన ఓ చిత్రంగా నిలుస్తుంది. జీవిత కథా చిత్రాలనగానే నాయకులు, క్రీడాకారులు, ఇతరత్రా ప్రముఖులే గుర్తొస్తారు. కానీ ఓ దొంగ కథని ఎందుకు సినిమాగా తీశామన్నదే అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం. ఓ మనిషి దొంగ ఎందుకయ్యాడు? దొంగ అయ్యాక ఏం చేశాడనే విషయాలు ఇందులో కీలకం. ఈ కథ అనుకున్నప్పుడే టైగర్ నాగేశ్వరరావు కుటుంబ సభ్యుల్ని సంప్రదించి, వారి అనుమతి తీసుకుని స్క్రిప్ట్ని సిద్ధం చేశాం. ప్రేక్షకులకు కూడా గుర్తుండిపోయే చిత్రం అవుతుంది. ఓ మంచి సినిమాని తీసుకు రావాలని సమష్టిగా కృషి చేశాం. మూడేళ్లపాటు ఈ సినిమా కోసం ప్రయాణం చేశాం. అందుకే విడుదలకి ముందస్తు వేడుకలోన భావోద్వేగానికి గురయ్యా’’.
- ‘‘మేం ఈ కథని ఎంతగా నమ్మామో, కథానాయకుడు రవితేజ కూడా అంతే నమ్మారు. పోరాట ఘట్టాల్లో నటిస్తూ చేతికి గాయమైనప్పటికీ ఆయన వెనక్కి తగ్గకుండా కష్టపడ్డారు. వంశీ ఓ దర్శకుడిలా కాకుండా, నిర్మాతగానూ బాధ్యతలు తీసుకుని పనిచేశాడు. అన్ని భాషల్లోనూ చెప్పాల్సిన కథ ఇది. అందుకే పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకెళుతున్నాం.
- అనుపమ్ ఖేర్ సర్ నన్నొక బిడ్డలా చూస్తారు. ఏదైనా ఓ పాత్ర చేయాలని అడిగితే ఆయన మరో మాట లేకుండా ముందుకొస్తారు. రేణుదేశాయ్ ఓ గొప్ప పాత్రలో కనిపిస్తారు’’.
- ‘‘తొలి అడుగుల్లోనే ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని నిర్మించాం. ఆ చిత్రానికిగానూ దిల్లీలో మా బృందం జాతీయ పురస్కారం అందుకుంటున్నప్పుడు చూసి కన్నీళ్లొచ్చాయి. ఇప్పుడిప్పుడే ప్రయాణం ప్రారంభించిన ఓ నిర్మాత ఇంతకంటే ఏం కోరుకుంటాడు? ఏ ఒక్క వర్గాన్నీ బలపరిచేలా సినిమా తీయాలనుకోను. దేశం కోసం, ధర్మం కోసం నిలబడటమే మా సిద్ధాంతం. అందుకు తగ్గట్టే మా సంస్థ నుంచి సినిమాలు వస్తుంటాయి. మరో బయోపిక్ కోసం రంగం సిద్ధం చేస్తున్నాం. అది కూడా ఆసక్తికరమైన ప్రాజెక్టే. ప్రస్తుతం పరిశోధన కొనసాగుతోంది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉన్నతమైన రేపటి కోసం అన్ని శక్తులు కలిసొస్తున్నాయి
ఎదురు చూపులకి తెర పడింది. ‘కల్కి 2898 ఎ.డి’ విడుదల ఖరారైంది. మేలైన రేపటి కోసం అన్ని శక్తులు కలిసి వస్తున్నాయంటూ జూన్ 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు శనివారం ప్రకటించాయి. -
ప్రేమ వివాహమే చేసుకుంటా!
‘జాతిరత్నాలు’ చిత్రంతో తొలి అడుగులోనే సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది ఫరియా అబ్దుల్లా. ఇప్పుడామె అల్లరి నరేశ్తో కలిసి ‘ఆ.. ఒక్కటీ అడక్కు’తో అలరించేందుకు సిద్ధమైంది. -
కృష్ణ జయంతికి ‘హరోం హర’
‘హరోం హర’తో సినీప్రియుల్ని పలకరించనున్నారు సుధీర్ బాబు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించారు. సుమంత్ జి.నాయుడు నిర్మాత. -
‘ప్రేమికుడు’ మళ్లీ వస్తున్నాడు
ప్రభుదేవా - శంకర్ కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రం ‘ప్రేమికుడు’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్ని మే 1న రీ-రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు రమణ, మురళీధర్ రెడ్డి ప్రకటించారు. -
ఆ లాజిక్తోనే ప్రసన్న వదనం తీశాడు
‘‘నేను తీసిన ‘100%లవ్’ మొదలుకొని నా ప్రతి సినిమాకీ పనిచేశాడు అర్జున్. తను హాలీవుడ్లో ఉండి ఉంటే మరో స్థాయిలో సినిమాలు తీసేవాడు. -
ఈసారి శివాలెత్తిపోద్ది
‘‘నేను చాలా ఇష్టపడి చేసిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. దీని గురించి నేనొక్కటే చెప్తాను. ఈసారి శివాలెత్తిపోద్ది’’ అన్నారు విష్వక్ సేన్. ఆయన హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. -
మూడు జంటల కథ.. ఖేల్ ఖేల్ మే
వినోదాన్ని పంచే ఏ సినిమా కోసమైనా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ జాబితాలోకే చేరే ‘ఖేల్ ఖేల్ మే’ కోసం ఎప్పటినుంచో వేచి చూస్తున్న అభిమానులకు తీపి కబురు వినిపించింది చిత్రబృందం. -
అవి నా జీవితంలో చీకటి రోజులు!
‘‘నా జీవితంలోనే నేను అనుభవించిన ఓ చీకటి దశ ఇద’’ని అంటోంది నాయిక ప్రియాంక చోప్రా. బాలీవుడ్లోనే కాదు.. హాలీవుడ్లోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ.. -
తండ్రీ తనయుల సంఘర్షణ
తన కొడుకు ప్రయోజకుడై మంచి పేరు తెచ్చుకోవాలని ఆశించిన ఓ తండ్రి... ‘నాన్నలందరూ ఇంతే, అర్థం చేసుకోర’ంటూ బాధపడే ఓ తనయుడు... -
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం..
తాజా వార్తలు (Latest News)
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
-
ఏడు పదుల వయసులో.. ‘ఇంటర్’ పరీక్షలు!