Adipurush: ‘ఆదిపురుష్‌’.. మీకు నచ్చకపోతే చూడొద్దు: బాలీవుడ్‌ నటుడు

ప్రభాస్‌ (Prabhas) హీరోగా ఓంరౌత్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush).

Published : 12 Apr 2024 13:40 IST

ముంబయి: రామాయణాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). ప్రభాస్‌ (Prabhas) హీరోగా రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో దీనిని రూపొందించారు. కృతిసనన్‌ కథానాయిక. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విమర్శల పాలైంది. దీనిపై ‘ఆదిపురుష్‌’లో బ్రహ్మ పాత్ర పోషించిన నటుడు బిజయ్‌ ఆనంద్‌ తాజాగా స్పందించారు. తన సరికొత్త చిత్రం ‘బ‌డే మియా ఛోటే మియా’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన విమర్శలు చేసే వారిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘కళలను నేను ఆరాధిస్తుంటా. సుమారు రూ.600 కోట్లు ఖర్చు పెట్టి ఓంరౌత్‌ ‘ఆదిపురుష్‌’ తెరకెక్కించారు. ఒక దర్శకుడిగా అది ఆయన ఛాయిస్‌. తాను అనుకున్న విధంగా దానిని రూపొందించారు. మీకు నచ్చకపోతే చూడొద్దు. ఇతరుల కళను విమర్శించడానికి మనమెవ్వరు?. బాలి, వియాత్నంతోపాటు పలు ఆసియా దేశాల్లో నేను పర్యటించా. సీతారామలక్ష్మణులకు సంబంధించి ఆయా దేశాల్లో విభిన్న కథలు విన్నా. రామాయణం ఒక ఎపిక్‌. దానిని ఎంతమంది తెరకెక్కించారు? ఎవరు తెరకెక్కించారు? అనేది ఎప్పటికీ విషయం కాదు. అద్భుతంగా తీర్చిదిద్దితే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు’’ అని తెలిపారు. నితీశ్‌ తివారీ తెరకెక్కించనున్న ‘రామాయణం’ కోసం తాను ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని